Visakhapatnam

News May 29, 2024

విశాఖ: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంగా పరమేశ్వర్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గా పరమేశ్వర్ ఫంక్వాల్ నియమితులయ్యారు. ఆయన కాన్పూర్ ఐఐటీలో చదివి 1998లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజనీర్‌గా రైల్వే శాఖలో చేరారు. రైల్వే ట్రాక్ వంతెనలు పర్యావరణ ఇంజనీరింగ్‌పై ఆయన రాసిన పరిశోధన పత్రాలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. డెన్మార్క్ స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ చైనా సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించి పలు అధ్యయనాలు నిర్వహించారు.

News May 29, 2024

విశాఖ: మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారులు ఎంపిక

image

మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. విశాఖ జిల్లాలో 13,530 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.పదివేలు చొప్పున మొత్తం రూ.13.53 కోట్లను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుంది. జూన్ 4 తర్వాత పంపిణీ చేస్తారు.

News May 29, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో 2017లో సంచలనం రేపిన కిడ్నాప్, రేప్ కేసులో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆనంది మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News May 28, 2024

అనకాపల్లి: ఏలేరు కాలువలో మృతదేహం

image

తుమ్మపాల-ఏలేరు కాలువ మొదటి ఖానా నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35-40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. అతని శరీరంపై బ్రౌన్ కలర్‌పై నీలి రంగు చెక్స్ కలిగిన ఫుల్ హాండ్స్ షర్టు, బ్రౌన్ కలర్ ఫుల్ పాంట్ ఉన్నట్లు తెలిపారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వెల్లడించారు.

News May 28, 2024

పవన్ గెలుపుపై వైజాగ్‌లో జోరుగా బెట్టింగ్‌లు..?

image

కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్నకొలదీ MLA, MP అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయి ఈ ఎన్నికల్లో పిఠాపురంకలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపుపై విశాఖలో జోరుగా పందేలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ ఓడితే రూ.లక్షకు రూ.4లక్షలు ఇవ్వడానికి రెఢీ అయినట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చెయ్యండి.

News May 28, 2024

ఏయూకు 271వ స్థానం

image

బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.

News May 28, 2024

రాష్ట్ర చరిత్రలో భారీ భూకుంభకోణం: మూర్తి యాదవ్

image

ఎస్సీ,ఎస్టీ, బీసీలను సీఎస్ జవహర్ రెడ్డి అండ్ కో భయపెట్టి రూ.వేల కోట్ల విలువ చేసే భూములను దోచుకున్నారని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయమై తాను ఆరోపణలు చేసి 72 గంటలు అయినా సీఎస్ నుంచి సరైన సమాధానం లేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది భారీ భూ కుంభకోణంగా పేర్కొన్నారు.

News May 28, 2024

సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లు రద్దు

image

సంబల్పూర్ కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 17, 24 (2 ట్రిప్పులు) తేదీల్లో నడపనున్న సంబల్పూర్ కాచిగూడ రైళ్లను రద్దు చేసామన్నారు. అలాగే కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను వచ్చే నెల 18, 25(రెండు ట్రిప్పులు) తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ఆక్యుపెన్సి కారణంగా వీటిని రద్దు చేశాయన్నారు.

News May 28, 2024

విశాఖ: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీపై పరిమితి ఎత్తివేత

image

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీపై భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిమితి ఎత్తివేసింది. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా, సుమారు 20 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో బ్రాంచ్‌లో 240 సీట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి ఆ పరిమితిని ఏఐసీటీఈ ఎత్తేసింది.

News May 28, 2024

విశాఖ: కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ సేవలు

image

జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ విధానం సోమవారం నుంచి అమలులోకి తెచ్చినట్లు కారాగారం పర్యవేక్షకుడు ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే జైలుకి వచ్చి జైలు నిబంధనలు మేరకు మాట్లాడే అవకాశం ఉండేది. దూరం నుంచి రావటం.. సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఖైదీల కుటుంబ సభ్యులకు భారమవుతుందనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లోకి తెచ్చారు.