India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్మ్యాన్ దివస్
➤ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెలలో జరగబోయే రెండు ఐపీఎల్ మ్యాచులు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మంగళవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చేపట్టిన ఆధునీకరణ పనులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్తో కలిసి పరిశీలించారు. మార్చి 24న ఢిల్లీ -లక్నో, మార్చి 30న ఢిల్లీ -సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరగనున్నాయి.

విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.రాష్ట్రంలో వివిధ చోట్ల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఇతర ప్రక్రియలు ముగియటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.

రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా పర్యాటక అధికారి జ్ఞానవేణిని బదిలీ చేశారు. నూతన పర్యాటక శాఖ అధికారిగా జి.దాసును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బీచ్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పర్యాటకులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. మొత్తం 29,997 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు డీఈవో తెలిపారు.

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఆయనకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పదో రౌండ్లో పాకలపాటి రఘువర్మకు లభించిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడికి 12,035 ఓట్లు వచ్చాయి.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.

➤ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు
➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు
➤ రుషికొండ బ్లూ ఫ్లాగ్ ఇష్యూ పై జేసీ సమీక్ష
➤ వాట్సాప్లో పదో తరగతి హాల్ టికెట్లు
➤ ఈ నెల 6న ఒకే వేదికపై దగ్గుపాటి పురంధేశ్వరి, చంద్రబాబు
➤ ఈ నెల 4వ తేదీ నుంచి అసంఘటిత కార్మికులు ధర్నా
➤ ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
Sorry, no posts matched your criteria.