India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని కొబ్బరి తోట వద్ద ఓ బాలిక మిస్సింగ్ కేసులో రౌడీ షీటర్ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14వ తేదీన తన కుమార్తె కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయగా చివరకు ప్రేమ పేరుతో రౌడీ షీటర్ దేశరాజ్ కుమార్ మాయ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును మార్పు చేసి పోక్సో చట్టం కింద రౌడీ షీటర్ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు.
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా ఎమ్మెల్యేలతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారని హోంమంత్రి పేర్కొన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదినం కావడంతో కేక్ కట్ చేశారు.
విశాఖ, అరకులో యాంకర్ హబ్లు ఏర్పాటు చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. తొట్లకొండతో పాటు పలు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు విస్తరిస్తామన్నారు. బీచ్ టూరిజం సర్క్యూట్లో భాగంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బీచ్ల అభివృద్ధితో పాటు ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇదేదో గ్రాఫిక్స్ ఫొటో..లేదా వాల్ పేపర్ ఫొటో అనుకుంటే మీ పొరపాటే.! డుంబ్రిగూడ మండలంలోని జంగిడివలస రైల్వే గేటు సమీపంలో స్థానిక గిరిజనులు వేసిన పొద్దుతిరుగుడు పువ్వుల పంట ఇది. ఒకపక్క ఆహ్లాదకరమైన మంచు తెరలు.. మరోపక్క ఆకర్షించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల అందాలు ప్రకృతి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విశాఖ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్కు ముందు నితీశ్ కుమార్కు విరాట్ కోహ్లీ ఇండియా క్యాప్ అందించారు. గతేడాది IPLలో అదరగొట్టడంతో నితీశ్.. ఈ అక్టోబర్లో బంగ్లాతో జరిగిన T-20లో అరంగేట్రం చేశారు. అతన్ని వచ్చే సీజన్కు SRH రూ.6 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 నితీశ్కు గుర్తుండిపోతుందనే చెప్పొచ్చు.
విశాఖ డెయిరీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గించారంటూ మొన్నటి వరకు పాడి రైతులు ఆందోళన చేయగా.. డెయిరీలో అవినీతిపై స్థాయీ సంఘం ఏర్పాటు చేస్తామని స్పీకర్ అయ్యన్న బుధవారం ప్రకటించారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ పర్మినెంట్, కాంట్రాక్టర్ ఉద్యోగులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ పరిణామాలు డెయిరీ మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ డిసెంబర్ చివరినాటికి లక్ష గృహాలను పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశించారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎన్వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.
Sorry, no posts matched your criteria.