Visakhapatnam

News November 17, 2024

దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్: అరకు ఎంపీ

image

సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోస్ట‌పై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.

News November 17, 2024

విశాఖ: ‘గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు’

image

గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News November 17, 2024

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలి: కలెక్టర్

image

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో లోచలపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, తలారిసింగి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారికి సహాయకారిగా ఉండాలని సూచించారు.

News November 16, 2024

విశాఖ: రూ.65 కోట్ల విలువ కలిగిన భూమి స్వాధీనం

image

సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ.65 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 ఎకరాల భూమితో పాటు మరో 4,460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

News November 16, 2024

అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం

image

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.

News November 15, 2024

విద్యకు రూ.29,000 కోట్లు కేటాయింపు: విశాఖ ఎంపీ

image

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ఈ ఏడాది రూ.29,000 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. శుక్రవారం ఎన్ఏడి జంక్షన్ వద్ద నూతన విద్య వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం విజయం కోసం కాదని అన్నారు. సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం అన్నారు. అయితే అది డిజిటల్ వైషమ్యాన్ని పెంచకుండా అందరికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

News November 15, 2024

అరకు కాఫీని మార్కెటింగ్ చేయనున్న టాటా సంస్థ..!

image

అల్లూరి జిల్లాలోని అరకు కాఫీ ప్రాధాన్యతను గుర్తించి, ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన టాటా సంస్థ, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో టాటా సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. టాటా సంస్థకు కావలసినంత మేర కాఫీ గింజలను అందించడం జరుగుతుందని చెప్పారు. సంస్థ ఆశించిన స్థాయిలో గింజలు గ్రేడింగ్ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.

News November 15, 2024

హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి

image

విశాఖపట్నం మల్కాపురం ప్రాంతానికి చెందిన దేవకుమార్ గురువారం రాత్రి తన స్నేహితునితో బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగింది. ప్రమాదంలో దేవకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. దేవకుమార్ స్నేహితుడు విజయవాడ వాసిగా గుర్తించారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

News November 15, 2024

విశాఖ: గోస్తనీలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి 

image

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెన‌పై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్‌ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

News November 15, 2024

ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్‌లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.