Visakhapatnam

News January 14, 2025

విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. నేడు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 13, 2025

రేపు విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రేపు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. రేపు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 13, 2025

నర్నీపట్నం: కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల ప్రిన్సిపల్ శాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు సర్వ శిక్షా అభియాన్ ఏపీడి జయప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన సమయంలో సమాచారాన్ని ఒక రోజు ఆలస్యంగా అధికారులకు చెప్పడాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News January 13, 2025

అనకాపల్లి: బాలిక పై అత్యాచారం

image

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఐదేళ్ల బాలిక పై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం జరగగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బాలికను కేజీహెచ్‌కు తరలించారు.

News January 13, 2025

విశాఖ: 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన ఆర్టీసీ

image

విశాఖ ద్వారక బస్సు స్టేషన్ నుంచి సంక్రాంతి సందర్భాన్ని పరిష్కరించుకుని 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపినట్లు రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌కు 25, విజయవాడకు 40 బస్సులు నడపగా, ఆదివారం శ్రీకాకుళం 100, రాజమండ్రికి 20, కాకినాడకు 20, పార్వతీపురానికి 40, సాలూరుకు 30 బస్సులతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామన్నారు.

News January 13, 2025

సింహాచలం ఆలయంలో నేడు గోదాదేవి కళ్యాణం

image

భోగి పండగ సందర్భాన్ని పరిష్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో త్రినాధరావు తెలిపారు. ఎదురు సన్నాహోత్సవం, కళ్యాణోత్సవ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఉదయం జరగాల్సిన నిత్య కళ్యాణాన్ని గోదాదేవి కళ్యాణంతో జరిపిస్తామన్నారు.

News January 13, 2025

విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్ కార్గో ప్రారంభం

image

విశాఖ ఎంపీ శ్రీభరత్ కృషి ఫలించింది. ఆదివారం నుంచి ఎయిర్ కార్గో సేవలను మళ్లీ పునరుద్ధరించారు. ఇందుకోసం కృషి చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి, మంత్రి నారా లోకేశ్‌కి ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో పారిశ్రామిక రంగానికి కొత్త శోభను తీసుకురావడానికి అంతర్జాతీయ ఎయిర్ కార్గో కార్యకలాపాలు ప్రారంభం శుభ పరిణామం అని ఎంపీ అన్నారు.

News January 13, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

News January 12, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News January 12, 2025

వైజాగ్‌లో ఒప్పో రెనో 13 సిరీస్ లాంఛ్

image

ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్‌ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.