Visakhapatnam

News January 12, 2025

అనకాపల్లి: బాలికపై అత్యాచారం

image

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు.

News January 12, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

News January 12, 2025

విశాఖ: ఉద్యోగులకు VRS ప్రకటించిన స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే మార్చి నెలాఖరులోగా సెటిల్మెంట్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న 500 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మందికి వీఆర్ఎస్ అమలు చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 15 ఏళ్ల సర్వీసు, 45 ఏళ్ల వయసు ఉండాలి.

News January 12, 2025

విశాఖ: నేడు చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం చర్లపల్లికి (సికింద్రాబాద్) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-చర్లపల్లి స్పెషల్ రైలు ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి చర్లపల్లి చేరుకుంటుందన్నారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం మీదుగా వెళుతుందన్నారు.

News January 12, 2025

విషాదం.. విశాఖకు తరలిస్తుండగా గర్భిణి మృతి

image

హుకుంపేట మండలం పట్టం పంచాయతీ దాబువలసలో విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న భవానీ అనే గర్భిణీని పాడేరు జిల్లా ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గ్రామానికి తరలించి శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లల సంతానం. 

News January 11, 2025

విశాఖ: జూ. కళాశాలలకు నేటి నుంచి సెలవులు

image

విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశాఖలో ఆర్ఐఓ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు సెలవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 19 ఆదివారం కావడంతో తిరిగి 20 నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. ప్రైవేట్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News January 11, 2025

అనకాపల్లి: ‘అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు’

image

సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.

News January 10, 2025

‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏళ్ల జైలు.. ఇదీ కేసు!

image

యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’లో విశాఖ కలెక్టర్‌గా రామ్ చరణ్..!

image

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.

News January 10, 2025

విశాఖ నుంచి పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు 

image

సంక్రాంతి దృష్ట్యా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈ నెల 13 వరకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 20, రాజమండ్రి, విజయవాడకు 40, కాకినాడకు 20, విజయనగరం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 830 బస్సులు నడవనున్నాయన్నారు.