India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికలకు 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్ద గంట్యాడ జడ్పీ స్కూల్, గాజువాక జడ్పీ స్కూల్, పెందుర్తి గవర్నమెంట్ స్కూల్, చిన్న వాల్తేర్ ఏయూ స్కూల్, డాబాగార్డెన్స్ ప్రేమా స్కూల్, న్యూస్ కాలనీ హైస్కూల్, కంచరపాలెం పాలిటెక్నిక్, మల్కాపూరం జీవీఎంసీ స్కూల్, గోపాలపట్నం జడ్పీ స్కూల్, మధురవాడ జడ్ప స్కూల్, పద్మనాభం ఎంపీపీ స్కూల్, ఆనందపురం స్కూల్, భీమిలి మహాత్మా గాంధీ స్కూల్.

విశాఖలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైకు తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

విశాఖ సాగర తీరంలో నేడు అద్భుత ఘటన జరగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయనున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభ మేళా నుంచి తెచ్చిన జలాలతో ఇలా చేయడం మరొక విశేషం. బీచ్ రోడ్డులో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత దృశ్యాలను కళ్లారా చూడండి. మిస్ కాకండి.

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్కు తరలించారు.

విశాఖ-పలాస రైల్వే లైన్లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. మార్చ్ 2 నుంచి మార్చ్ 8వరకు ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గతేడాది విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున అందిన సహాయక చర్యలపై ఆరా తీశారు.

➤ విశాఖలో మూతపడిన మద్యం షాప్లు ➤ విశాఖ ఆర్డీవో శ్రీలేఖకు హైకోర్టులో చుక్కెదురు ➤ నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ➤ ఎమ్మెల్సీ ఎన్నికలకు 123 పోలింగ్ కేంద్రాలు.. 22493 మంది ఓటర్లు ➤ రేపు విశాఖ రానున్న సినీ నటుడు బ్రహ్మానందం ➤ విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3200 మంది ➤ వెంకోజీపాలెంలో వ్యక్తి దారుణ హత్య

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.