India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో నగరమంతా నిఘా నీడలోకి వెళ్ళింది. ఢిల్లీ నుంచి ప్రధాని భద్రతా సిబ్బంది ఇప్పటికే నగరానికి చేరుకొని రోడ్ షో, బహిరంగ సభ స్థలాలను క్షుణంగా పరిశీలించారు. డీజీపీతోపాటు నగర పోలీస్ కమిషనర్, మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ డైవర్షన్ చేసి, డ్రోన్లు నిషేధించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ శ్రమిస్తున్నారు. నగర ప్రజలు సహకరించాలని కోరారు.
ఈనెల 8న విశాఖకు ప్రధాని మోదీ రానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4:15కు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4:45 నుంచి 5:30వరకు వేంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్షోలో పాల్గొంటారు. 5:30 నుంచి 6:30వరకు ఏయూ గ్రౌండ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6:35కు రోడ్డు మార్గాన బయలుదేరి 6:55కు ఎయిర్ పోర్ట్కు చేరుకొని భువనేశ్వర్ పయనమవుతారు.
పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమని తెలిపారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.
పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమన్నారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.
విశాఖలో ఈనెల 8న నిర్వహించనున్న ప్రధాన మోడీ బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు, నేతలు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సంపత్ వినాయక ఆలయం నుంచి ఏయూ గ్రౌండ్ వరకు నిర్వహించనున్న రోడ్ షోకు సుమారు లక్షమంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సింహాచలంలో జనవరి 10న నిర్వహించనున్న ఉత్తర ద్వారా దర్శనం టికెట్లు నేటి నుంచి ఈనెల 9 వరకు ప్రత్యేక కౌంటర్లో లభిస్తాయని ఈవో త్రినాధరావు తెలిపారు. కొండ కింద పిఆర్ఓ కౌంటర్లో రూ.500 టికెట్లు లభ్యమవుతాయన్నారు. www.aptemples.ap.gov.in వెబ్ సైట్లో కూడా దొరుకుతాయని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో త్రినాద్ రావు తెలిపారు.
జామ చెట్టులో గుమ్మడికాయలు కాయడం ఏంటని వింతగా చూస్తున్నారా? అవునండీ పైన కనిపిస్తున్న చిత్రం ఆదివాసీల జీవన ప్రమాణాలపై వారి ముందు చూపు, ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులలో ఓ గిరిజన రైతు పండించిన గుమ్మడి కాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పెరటిలో ఉన్న జామ చెట్టుకి గుమ్మడి కాయలను వేలాడ దీశాడు. దీంతో అవి చెడిపోకుండా ఉంటుందట.
వైజాగ్ నుంచి సికింద్రాబాద్కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా కైలాసగిరి రిజర్వు పోలీస్ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా విశాఖ జట్టు నిలిచింది. రన్నర్గా కర్నూలు జట్టు, మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.