India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరగ్గా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. తమకు ఓటు వేయలేదని ఓ పార్టీ నాయకులు దాడి చేశారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన కంచరపాలెం పోలీసులు వివరణ ఇచ్చారు. ‘ఈ గొడవకు పార్టీలతో సంబంధం లేదని, కేవలం పక్క పక్క ఇళ్లవారి మధ్య జరిగిన గొడవ మాత్రమే’ అని చెప్పారు.
సీఎం జగన్ రెడ్డి కోటరీలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో రూ.1000 కోట్ల స్కాంకు పాల్పడినట్లు జనసేన నాయకుడు, జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్ తో వందల కోట్లు సంపాదించినట్లు విమర్శించారు. ఋషికొండలో తవ్విన గ్రావెల్ను పోర్టుకు అమ్మినట్లు వెల్లడించారు.
ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు నేడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నెలరోజులు దాటినా అవసరమైన బొగ్గు నిల్వలు స్టీల్ ప్లాంట్కు చేరడం లేదు. ఆదానీ పోర్టులో రూ.600కోట్లు విలువైన బొగ్గు నిల్వలు ఉండిపోయాయి. దీంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి విశాఖ ఉక్కు చేరుకుంది. మార్చి నెలలో విద్యుత్ బకాయిలు రూ.68.43 కోట్లకు చేరుకుంది. దీంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని అప్పన్న బాబు నుంచి స్వీకరించిన చందనాన్ని భక్తులకు పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. పది గ్రాములు చొప్పున ప్యాకెట్లుగా తయారుచేసి భక్తులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ, అనకాపల్లి, అరకు ఎంపీ నియోజకవర్గాలలో పోలింగ్ శాతాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖ పార్లమెంటుకు 71.11%, అనకాపల్లి ఎంపీ స్థానంకు 82.03%, అరకులో 73.68% పోలింగ్ నమోదయింది. విశాఖలో 13,70,484, అనకాపల్లిలో 13,09,997, అరకు 11,45,426 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా విశాఖ ఎంపీ స్థానంలో పోలింగ్ నమోదవ్వగా.. ఆ ప్రభావం ఏ పార్టీపై పడిందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
సీఎంగా జగన్ చేసిన సంక్షేమ పథకాలను చూసే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం గాజువాకలో ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ శాతం పెరగడం వైసీపీకే లాభమన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడమే తమ విజయానికి చిహ్నం అన్నారు. 2004 కంటే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ వైయస్ విజయం సాధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కూటమికి భంగపాటు తప్పదన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా భువనేశ్వర్-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భువనేశ్వర్-యలహంక (02811) ప్రత్యేక రైలు జూన్ 1 నుంచి 29 వరకు నడపనున్నారు. యలహంక-భువనేశ్వర్ (02812) ప్రత్యేక రైలు యలహంకలో జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందనున్నది. ఈ రైళ్లు ఖుర్దా, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్ల కోట తదితర స్టేషన్ల మీదుగా నడవనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖలో ఇంజనీరింగ్కు 20,502, అగ్రికల్చర్, ఫార్మసీకి 5,793 మంది కలిపి 70, గాజువాకలో ఇంజనీరింగ్కు 10,131, ఫార్మసీకి 3,479 మంది కలిపి 13,610 మంది, ఆనందపురంలో ఇంజనీరింగ్ కు 1,793, ఫార్మసీకి 772 మంది కలిపి 2,565 మంది దరఖాస్తు చేశారు.
విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్కు బుధవారం గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో ఉండగానే ఆయనకు నొప్పి రావడంతో అప్రమత్తమైన అధికారులు క్యాజువాలిటీలో ఫేస్ మేకర్ వేశారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు నేడు సర్జరీ చేయనున్నట్టు తెలిసింది.
అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని మిగిలిన ఇంటర్ ఫస్టియర్ సీట్ల భర్తీకి ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమన్వయకర్త ఎస్.రూపవతి పేర్కొన్నారు. ఈనెల 16న సబ్బవరం గురుకులంలో బాలురుకు, 17న మధురవాడలోని అంబేద్కర్ గురుకులంలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని సర్టిఫికెట్స్ తీసుకు రావాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.