Visakhapatnam

News January 5, 2025

విశాఖ: దూరవిద్య డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ

image

ఏయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్‌ టేబుల్ అందుబాటులో ఉంటుందన్నారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.

News January 5, 2025

విశాఖ: నేవీ విన్యాసాలకు హాజరైన ముఖ్యులు వీరే!

image

విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొని హెలికాప్టర్లు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయలు, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, అనకాపల్లి MP సీఎం రమేశ్, నగర మేయర్ హరి వెంకటకుమారి, MLA వంశీకృష్ణ శ్రీనివాస్, గొల్ల బాబురావు పాల్గొన్నారు.

News January 4, 2025

ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2025

స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News January 4, 2025

విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 8న ప్రధాని విశాఖలో పర్యటించి అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 4, 2025

ప్రధాని పర్యటనపై సీఎస్ సమీక్ష

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అమరావతి నుంచి అనకాపల్లి విశాఖ, కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు ఇతర వాహనాల్లో సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాల ట్రాఫిక్ పార్కింగ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

News January 3, 2025

విశాఖలో ప్రధాని సభకు లక్ష మంది..!

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న తరుణంలో ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి సభకు దాదాపు లక్ష మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు, చెట్లు ట్రిమ్మింగ్, గ్రౌండ్ ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2025

విశాఖ: పీఈటీ టెస్టులకు 278 మంది హాజరు 

image

పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపికకు కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నాలుగవ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ పరీక్షల్లో 718 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 278 మంది మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యారు. ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి అనంతరం బయోమెట్రిక్ తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

News January 3, 2025

జగదల్పూరు వరకే విశాఖ-కిరండూల్ రైలు

image

కేకే లైన్లో జరుగుతున్న పనుల వలన విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు జగదల్పూరు వరకు నడుస్తాయని అరకు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 5న విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 6న విశాఖ-కిరండూల్(58501) పాసింజరు జగదల్పూర్ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణం జనవరి 6న కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 7న కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ రైళ్లు జగదల్పూర్ నుంచి బయలుదేరుతాయన్నారు.

News January 3, 2025

ఒడిశా గవర్నర్‌గా హరిబాబు ప్రమాణ స్వీకారం 

image

విశాఖ మాజీ ఎంపీ చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న హరిబాబును ఒడిశాకు బదిలీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్‌కు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, గాజువాక బీజేపీ కన్వీనర్ నరసింహారావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.