Visakhapatnam

News May 16, 2024

విశాఖ: మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని మిగిలిన ఇంటర్ ఫస్టియర్ సీట్ల భర్తీకి ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమన్వయకర్త ఎస్.రూపవతి పేర్కొన్నారు. ఈనెల 16న సబ్బవరం గురుకులంలో బాలురుకు, 17న మధురవాడలోని అంబేద్కర్ గురుకులంలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని సర్టిఫికెట్స్ తీసుకు రావాలని అన్నారు.

News May 16, 2024

విశాఖ: వందే భారత్ రైలు రీ షెడ్యూల్

image

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ రైలును గురువారం రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖలో గురువారం ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ ట్రైన్ ఉదయం 8:45 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News May 16, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మృతి

image

<<13252907>>మధురవాడలో<<>> బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుమ్మడి మధు (51) మృతి చెందారు. భామిని మండలం కాట్రగడకు చెందిన మధు విశాఖలో స్థిరపడ్డారు. నగరంలో పని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఎండాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. జీవీఎంసీ చెత్త తరలించే లారీగా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 16, 2024

నేటి నుంచి బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమం

image

బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ నిర్మల గౌరీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీజీ అడల్ట్ వ్యాక్సిన్ ప్రోగ్రాం మూడు నెలల పాటు కొనసాగుతుందని, పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన విశాఖ జిల్లాలో వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు.

News May 16, 2024

భీమిలిలో అభ్యర్థుల గెలుపుపై జోరుగా పందేలు

image

భీమిలి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపుపై పందేలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వీరిద్దరి గెలుపుపై రూ. వేల నుంచి లక్షల్లో బెట్టింగ్‌లు వేస్తున్నారు. కౌంటింగ్‌కు ఇంకా 20 రోజులు సమయం ఉండటంతో ఈ పందేలు జోరు మరింత పెరిగే అవకాశం ఉంది.

News May 16, 2024

విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలను అధికారులు వెల్లడించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఫ్యూచర్ వరల్డ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. అల్లూరి జిల్లాకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం ఏపీటీ డబ్ల్యూ ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

News May 15, 2024

విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలను అధికారులు వెల్లడించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఫ్యూచర్ వరల్డ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. అల్లూరి జిల్లాకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం ఏపీటీ డబ్ల్యూ ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

News May 15, 2024

మళ్లీ మాడుగులదే రికార్డ్

image

మాడుగుల నియోజకవర్గ ఓటర్లు అధిక మొత్తంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో 82.99% పోలింగ్ నమోదవగా.. ఉమ్మడి జిల్లాలో ఇదే అత్యధికం. కాగా తాజా ఎన్నికల్లో మరో మూడు శాతం పెరిగి 86.03%గా నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఇదే ఎక్కువ. నియోజకవర్గంలో 1,62,580 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 78,784 మంది పురుషులు, 83,796 మంది మహిళలు ఓటు వేశారు. ఇక్కడ అభ్యర్థుల విజయంలో మహిళల ఓటింగే కీలకంగా మారింది.

News May 15, 2024

మధురవాడలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం హైస్కూల్ దగ్గర లారీ ఢీకొని 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల కాలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

News May 15, 2024

విశాఖ ఓటరు ఎటువైపు?

image

సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు ప్రచారం జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖలో ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లా ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?