Visakhapatnam

News May 15, 2024

విశాఖ: ఓటర్ల కోసం రైలుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు

image

పోలింగ్ రోజున నాందేడ్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణిస్తున్న పలువురు ఓటర్లు రైలు ఆలస్యంగా నడుస్తోందని, తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని సామాజిక మాధ్యమాలలో వీడియోలు పోస్ట్ చేశారు. వీటిని చూసిన రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పందించారు. సాయంత్రం 6 గంటలలోగా విశాఖ చేరాలని రైల్వే అధికారులకు సూచించగా.. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నేరుగా 5:15 గంటలకు రైలును విశాఖకు పంపారు.

News May 15, 2024

విశాఖ: ఉక్కు ఉద్యోగులకు అందని వేతనాలు

image

మే15వ తేదీ వచ్చినా ఉక్కు ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహకు గురవుతున్నారు. ఇంటి అద్దెలు, నెలవారీ బ్యాంకుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకటో తేదీన సగం వేతనం, ఆ తర్వాత సగం వేతనం చెల్లించేవారు. ఈనెల అదీ లేకపోవడంతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. కంపెనీ రొటేషన్ తక్కువగా ఉండటం వల్ల వేతనాలు చెల్లింపు ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.

News May 15, 2024

ఎన్నికల ఫలితాలపై విశాఖలో జోరుగా బెట్టింగ్..!

image

ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంటుంటే.. వారి గెలుపోటములపై పందెంరాయుళ్లు బెట్టింగులు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ విశాఖ సిటీలో TDP జెండా ఎగురవేసింది. ఆ స్థానాల్లో పందేలు జోరందుకున్నాయని టాక్ నడుస్తోంది. హాట్‌సీట్‌గా ఉన్న విశాఖ ఈస్ట్‌లో అభ్యర్థి గెలుపుతో పాటు, మెజార్టీపైనా బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. అటు విశాఖ MP, పశ్చిమ అభ్యర్థులపైనా ఇదే పరిస్థితి.

News May 15, 2024

విశాఖ: వచ్చే నెల 29న మెగా లోక్ అదాలత్

image

జూన్ 29న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. జిల్లా కోర్టులో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో రాజీ కాగలిగిన పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్ కేసులు, పౌర శిక్షాస్మృతిలోని కేసులు, చెల్లని చెక్కు కేసులు, సివిల్ తగాదాలు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చని ఆయన అన్నారు.

News May 15, 2024

గుంటూరు-విశాఖ, రాజమండ్రి – విశాఖ మధ్య రెండు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రత దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ తెలిపారు. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15 నుంచి 26 వరకు, విశాఖ- గుంటూరు మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు, రాజమండ్రి – విశాఖ- రాజమండ్రి మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News May 15, 2024

విశాఖ: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-2025 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. ఇందుకోసం http://iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా జూన్ 10లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. నమోదు చేసుకున్న విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ, ప్రభుత్వ బాలికల ఐటీఐ, గాజువాక ప్రభుత్వ ఐటీఐ, నరవ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

News May 15, 2024

భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: అవంతి

image

భీమిలిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం భీమిలి వైసీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు పోలింగ్ పెరగడం వైసీపీకే లాభమన్నారు. ప్రతిపక్ష టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా ఓటర్లు వైసీపి వైపే ఉన్నారన్నారు.

News May 15, 2024

15 నుంచి 26 వరకు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌లో భద్రతా చర్యల దృష్ట్యా ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్నం – విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) ను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) ను కూడా పై తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

News May 15, 2024

సింహాచలం: 22న స్వాతి నక్షత్ర హోమం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో నరసింహ జయంతి సందర్భంగా ఈ నెల 22న స్వాతి నక్షత్ర హోమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వాతి నక్షత్రం, నరసింహ జయంతి ఒకే రోజు రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు పాల్గొన్నారు.

News May 14, 2024

భీమిలి నియోజకవర్గంలో హై టెన్షన్

image

భీమిలిలో 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో 74.85 % శాతం నమోదు కాగా.. 2024లో 71.14 % (@12AM) పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు YCP, TDPల నుంచి అవంతి, గంటా శ్రీనివాస్ పోటీలో ఉండగా.. ఇతరులు మరో 13 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నేతలు ఇరువురు ఇంతవరకు గెలుపు బాటలోనే నడవగా, ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో అని నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది.