Visakhapatnam

News February 21, 2025

భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాలి: బొత్స

image

విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్ కేటగిరీలో వున్న జగన్ భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారన్నారు. జగన్ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు.

News February 21, 2025

పద్మనాభం: వేదవ్యాస్‌కు రెండో పతకం

image

చండీగఢ్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన వేదవ్యాస్‌ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నిర్వహించిన 1000 మీటర్ల పరుగు పోటీలో 34 నిమిషాల 55 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. వేదవ్యాస్ వరుసగా రెండు పతకాలు సాధించడంతో పొట్నూరు ప్రజలు అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకున్నారు.

News February 21, 2025

విశాఖ: ఆర్డీఓపై చర్యలు చేపట్టాలి: ఏపీయూడబ్ల్యూజే

image

విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.

News February 21, 2025

విశాఖ: కలెక్టర్‌కి జర్నలిస్ట్‌ల వినతి

image

విశాఖ జిల్లాలో చిన్న, మధ్యతరహా పత్రికల యాజమాన్యాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌కు శుక్రవారం వినతి అందజేశారు. ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను సరళీకృతం చెయ్యాలని కోరారు. అర్హత కలిగిన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్ట్‌లకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని వారు లేఖలో పేర్కొన్నారు.

News February 21, 2025

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్

image

గ్రామీణ మండ‌లం చిన‌గ‌దిలిలో ఉన్న‌ ఈవీఎం గోదామ్‌లను జిల్లా కలెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

News February 21, 2025

విశాఖ ప్రజలారా జాగ్రత్త..!

image

విశాఖ అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. చదువు రాని వాడు చేపల వేటకు రాష్ట్రాలు దాటి వెళ్తున్నాడు. కాస్తోకూస్తో చదివినోడు దుబాయ్, ఇటలీ, మలేషియా అంటూ విమానం ఎక్కుతున్నాడు. వీళ్ల కష్టాలే కొందరికి వరంగా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు తీసిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్నారు. వీరిని నమ్మి పరాయి దేశానికి వెళ్తున్న విశాఖ బిడ్డలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఈమోసాలు ఇటీవల ఎక్కువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

News February 21, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్.. నిందితుల అరెస్ట్ 

image

క్రికెట్ బుక్కిల ఏరివేతలో భాగంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గాజువాకకు చెందిన బాధితుడు సమాచారం ఆధారంగా క్రికెట్ బెట్టింగ్ ఊబిలో అమాయకుల నుంచి నుంచి మాయమాటలు, ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు చేస్తున్న బుక్కీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మరికొందరి బుక్కిల సమాచారం సేకరించారు.

News February 21, 2025

భీమిలి: భార్యను బలవంతం చేసినందుకే జ్యోతిషుడి హత్య

image

జ్యోతిషం పేరిట పూజలు చేస్తూ పెందుర్తి నివాసి అప్పన్న(50) జీవనం గడిపేవారు. అప్పన్న పూజ పేరిట గుడ్డాల మౌనికను బలవంతం చేశాడు. మౌనిక తన భర్త ఊళ్ల చిన్నారావుకు విషయం తెలిపింది. చిన్నారావు అప్పన్నను హత్య చేసేందుకు తన తల్లి ఆరోగ్యం కోసం పూజ చేయాలని రూ.7 వేలకు ఒప్పించి ఉప్పాడ తీసుకెళ్లి హత్య చేసి భార్య సహాయంతో పెట్రోల్ పోసి తగల బెట్టారు. వీరిని గురువారం భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 21, 2025

విశాఖ: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. మాతృ, శిశు మరణాలు నమోదు కాకుండా చర్యలు చేప్పట్టాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. DMHO జగదీశ్వర రావు ఉన్నారు.

News February 20, 2025

విశాఖ టుడే టాఫ్ న్యూస్

image

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు