Visakhapatnam

News May 14, 2024

భీమిలి నియోజకవర్గంలో హై టెన్షన్

image

భీమిలిలో 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో 74.85 % శాతం నమోదు కాగా.. 2024లో 71.14 % (@12AM) పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు YCP, TDPల నుంచి అవంతి, గంటా శ్రీనివాస్ పోటీలో ఉండగా.. ఇతరులు మరో 13 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నేతలు ఇరువురు ఇంతవరకు గెలుపు బాటలోనే నడవగా, ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో అని నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది.

News May 14, 2024

భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: గంటా

image

భీమిలిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం భీమిలి టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనమని అన్నారు. అధికార పార్టీ చాలా ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూటమి కార్యకర్తలు సంయమనం పాటించారని అన్నారు.

News May 14, 2024

ఇందిరా గాంధీ జూలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్

image

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్-2024 నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ డా.నందని సలారియా తెలిపారు. 5 సంవత్సరాల వయస్సు నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనవచ్చు అన్నారు. 5 నుంచి 11 సంవత్సరాల వారికి మే 21 నుంచి 25 వరకు, 12-18 సంవత్సరాల వారికి మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు బ్యాచ్‌లుగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 14, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నావెల్ డాక్ యార్డ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. గాయపడిన మహిళను పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలని కోరారు.

News May 14, 2024

తనకు తాను ఓటేసుకోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

image

మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తను పోటీ చేసిన మాడుగుల నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన వెన్నెలపాలెంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఆఖరి నిమిషంలో మాడుగుల నియోజకవర్గం టీడీపీ టికెట్ ఖరారవ్వడంతో ఆయన ఓటును మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా.. కూటమి తరఫున పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌ పోటీలో ఉన్నారు.

News May 14, 2024

గాజువాకలో ఈవీఎంల ఫొటోలు బహిర్గతం..?

image

గాజువాక నియోజకవర్గంలో ఓటు బహిర్గతం అయ్యినట్లు తెలుస్తోంది. ఓ పార్టీకి ఓటు వేసినట్లు ఈవీఎంల ఫొటోలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి ఓటు వేస్తూ ఈవీఎంల ఫొటో తీశాడు. తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటు వేసిన వివరాలు బహిర్గతం కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే.. అది మాక్ పోలింగ్ జరిగినప్పుడు తీసిన ఫొటో అని కూడా ప్రచారం జరుగుతోంది.

News May 14, 2024

వేసవీ రద్దీ దృష్ట్యా విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ ప్రత్యేక రైలు

image

ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే వారి సౌకర్యార్ధం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(08589/08590) మధ్య ఈ నెల 14, 15 తేదీలలో నడుస్తుందని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 4.15గంటలకు విశాఖలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 6.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మరల 15వ తేదీ ఉదయం 10.30గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖ చేరుతుంది.

News May 13, 2024

అల్లూరి: ఓటు వేసేందుకు వెళుతూ మృతి

image

కొయ్యూరు మండలం కినపర్తికి చెందిన నర్సి శ్రీనివాస్ (35)అనే వ్యక్తి సోమవారం ఓటు వేసేందుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందాడు. కినపర్తి నుంచి శరభన్నపాలెం పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేసేందుకు శ్రీనివాస్ బయలుదేరాడని సర్పంచి శ్రీను, స్థానికులు తెలిపారు. మార్గమధ్యంలో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 13, 2024

విశాఖ: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరకు, పాడేరులో పోలింగ్ ముగియగా.. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
> SHARE IT

News May 13, 2024

ఓటు వేసిన అల్లూరి జిల్లా కలెక్టర్

image

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాడేరులోని కృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలోని 284 పోలింగ్ కేంద్రంలో సోమవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలోని ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.