Visakhapatnam

News May 13, 2024

విశాఖలో నగదు పట్టుకున్న పోలీసులు

image

ఎన్నికల నేపథ్యంలో విశాఖలోని పలుచోట్ల నగదు పట్టుబడుతుంది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మధారలో రూ.1.14 లక్షలు, ఎంవీపీ కాలనీలో రూ.1 లక్ష, మరోచోట రూ.2 లక్షలు, రూ.29 వేలు, రూ.30వేలు చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ నగదును ఆయా ఎంసీసీ, ఎఫ్ఎస్‌‌టీ బృందాలకు అప్పగించామన్నారు.

News May 13, 2024

విశాఖలో పోలింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఒక లోకసభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్లు ఇబ్బంది పడకుండా 11 రకాల కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

News May 13, 2024

చెరగని సిరాపై వదంతులు నమ్మవద్దు: విశాఖ కలెక్టర్

image

చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతుందంటూ.. సోషల్ మీడియాలో జరగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. ఆ సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

News May 12, 2024

విశాఖ బీచ్ రోడ్‌లో భారీ నగదు పట్టివేత..!

image

విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు రూ.కోటిన్నర నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో పాండురంగపురంలోని కారులో తరలిస్తున్న రూ.కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. సీ-విజిల్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

News May 12, 2024

తోటకూర గింజలతో తల్లి బిడ్డల చిత్రం

image

ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకవరపాలెం మండలం, తూటిపాల గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రవికుమార్ అద్భుతాన్ని సృష్టించాడు. 624 తోటకూర గింజలతో తల్లీబిడ్డల చిత్రాన్ని రూపొందించాడు. చిత్రం మధ్యలో అమ్మ గురించి, గొప్పతనం తెలుపుతూ సూక్ష్మ లిపిలో రాశాడు. ఇలా రూపొందించడానికి తనకు 10 గంటల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు.

News May 12, 2024

85శాతంకు పోలింగ్ పెంచే లక్ష్యం: అల్లూరి కలెక్టర్

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈసారి 85శాతం వరకు పోలింగ్ పెంచే లక్ష్యం మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లోక్ సభకు, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు.

News May 12, 2024

అనకాపల్లి జిల్లాలో 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 12,89,371 మంది ఓటు హక్కు వినియోగించు కోనున్నారని కలెక్టర్ రవి పేర్కొన్నారు. వీరి కోసం 1529 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 340 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిలో 380 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీఓలు 1750, ఏపీఓలు,1743, ఓపీఓలు 7036 మంది విధుల్లో ఉంటారని చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశామన్నారు.

News May 12, 2024

విశాఖ: రేపు రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు సెలవు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రుషికొండలోని బ్లూ బ్లాగ్ బీచ్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి ఓ ప్రకటనలో తెలిపారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ లో విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కార్మికులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు. పర్యాటకులు ఎవరూ ఆరోజు బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు రావద్దని సూచించారు.

News May 12, 2024

రేపు వేతనంతో కూడిన సెలవు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులకు కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

News May 12, 2024

విశాఖ: అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సాధార‌ణ ప‌రిశీల‌కులు అమిత్ శ‌ర్మ (63003 10152), పోలీసు ప‌రిశీల‌కులు అమిత్ కుమార్ (63003 15841), వ్యయ ప‌రిశీల‌కులు రెంగ రాజ‌న్ (63003 01726), ఎస్.కోట‌, ప‌శ్చిమ‌, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల సాధార‌ణ‌ ప‌రిశీల‌కులు సీతారామ్ జాట్ (63003 20829), భీమిలి, తూర్పు, ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గాల వ్యయ ప‌రిశీల‌కులు సౌమ్య (63003 16752)గా తెలిపారు.