Visakhapatnam

News October 24, 2024

సొంత బాబాయ్‌నే జగన్ చంపించేశాడు: హోంమంత్రి అనిత

image

సీఎం కుర్చీలో కూర్చోడానికి సొంత బాబాయ్‌ని వైఎస్ జగన్ చంపించేశాడని హోంమంత్రి అనిత ఆరోపించారు. తల్లీ, చెల్లి మీద ఏదోరోజు కేసు పెడతారనుకున్నాం.. అలానే కేసు పెట్టారని ఆమె అన్నారు. బాబాయ్ మృతి విషయంలో సీఐడీ పేరుతో చెల్లిని కామ్ అప్ చేశారని ఎద్దేవా చేశారు. అన్న కోసం ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిళ.. ఎన్నికల ముందు ఎదురుతిరిగిందన్న ఆమె.. జగన్ నిజస్వరూపం ఏంటో వాసిరెడ్డి పద్మ చెప్పారని అన్నారు.

News October 24, 2024

విశాఖ జడ్పీ సమావేశానికి హాజరైన హోంమంత్రి

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశ మందిరానికి వచ్చిన హోంమంత్రికి ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు ప్రతినిధులు స్వాగతం పలికారు.

News October 24, 2024

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు పంట నష్టం: జడ్పీ ఛైర్పర్శన్

image

అల్లూరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందని విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో ‌జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో పంట నష్టం మంజూరుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన కలెక్టర్లు హరీంద్ర ప్రసాద్, విజయ్ కృష్ణన్, దినేశ్ కుమార్ పాల్గొన్నారు.

News October 24, 2024

ఆస్ట్రేలియా టూర్‌కు నితీశ్ కుమార్, రికీ భుయ్

image

విశాఖకు చెందిన క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్ భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా టార్‌‌కు వెళ్లే టీం ఇండియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. కాగా.. నితీశ్ కుమార్ రెడ్డిని బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

News October 24, 2024

కారుచౌకగా భూములు కేటాయింపు: మంత్రి

image

పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీ శారదా పీఠానికి గత ప్రభుత్వం కారుచౌకగా భూములను కేటాయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎకరం రూ.20 కోట్ల ధర పలికే భూమిని కేవలం రూ. లక్ష రూపాయలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. అందుకనే భూముల కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News October 24, 2024

హోంగార్డ్ భార్యకు కారుణ్య నియామకం

image

విశాఖ పోలీసు శాఖలో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తించిన మహమ్మద్ హాసం న్యూరో సమస్యలతో అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా కాంట్రిబ్యూషన్ ఫండ్ నుంచి సదరు హోంగార్డ్ భార్య జరీనా కౌషర్‌‌ కి బుధవారం ఆర్థిక సహాయం కింద చెక్ అందించారు. అనంతరం ఆమెకు కారుణ్య నియామకం క్రింద హోమ్ గార్డు ఉద్యోగం నియామక పత్రాన్ని  కమిషనర్ శంఖబ్రాత భాగ్చి అందజేశారు.

News October 23, 2024

విశాఖ: ఏయూలో సెమిస్టర్ ఫీజు తగ్గించిన అధికారులు

image

ఏయూ విద్యార్థుల వినతిని అధికారులు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సెమిస్టర్ పరీక్ష ఫీజులో రూ.450 తగ్గించి నిర్ణయం తీసుకున్నారు. ఏయూ ఆర్ట్స్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అధికారులను కలిసి లిఖిత పూర్వకంగా పరీక్ష ఫీజును తగ్గించాలని, పరీక్ష ఫీజు చెల్లించే గడువును నవంబర్ 2వ తేదీ వరకు పొడిగించాలని వీసీ ఆచార్య జి.శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావులకు వినతిపత్రం అందజేశారు.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

విశాఖ: మన్యం బిడ్డకు అరుదైన అవకాశం

image

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భకి చెందిన పరదాని రమణమూర్తికి అరుదైన అవకాశం లభించింది. పర్యావరణ అధ్యయనం కోసం అంటార్కిటికా ఖండంలో 2నెలల పాటు అధ్యయనం చేసేందుకు ఎంపికైన ఐదుగురు భారత శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించే గౌరవం దక్కింది. రమణమూర్తి ఏయూలో మాస్టర్ డిగ్రీలో బయోఫిజిక్స్ పూర్తి చేశారు. విశాఖపట్నం భూ అయస్కాంత పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.

News October 23, 2024

విశాఖకు 724 కి.మీ. దూరంలో ‘దానా’

image

విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి.మీ. దూరంలో ‘దానా’ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.