Visakhapatnam

News December 28, 2024

చోడవరం: మేనల్లుడిని హత్య చేసిన మేనమామ

image

చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. ప్రేమ కుమార్‌ను మద్యం మత్తులో ఉన్న దుర్గ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 28, 2024

సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కే సందీప్ తెలిపారు. 5,12 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13 తేదీల్లో విశాఖలో రాత్రి 7:30 గంటలకు బయలుదేరుతుందన్నారు.

News December 28, 2024

బాల్య వివాహాల నిర్మూలనను బాధ్యతగా స్వీకరించాలి: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనను అందరం బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి బాల్య వివాహాల కమిటీ హైబ్రిడ్ సమావేశం నిర్వహించారు. పీవీటీజీ తెగలు, బడి మానేసిన పిల్లలలో బాల్య వివాహాలు జరుగుతున్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత రెండేళ్లలో 25 బాల్య వివాహాలు నిరోధించినప్పటికీ గత రెండేళ్లలో 357 మంది టీనేజ్ గర్భవతులు ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

News December 27, 2024

విశాఖ: మెముకు బదులుగా సాధారణ రైళ్లు

image

మెముకు బదులుగా సాధారణ రైళ్లును ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడపనున్నట్లు వాల్తేరు డిసీఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-పలాస-విశాఖ నెంబర్లతో ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు శుక్ర, ఆదివారాలు మినహా ఈ రైలు నడుస్తుందన్నారు. విశాఖ-విజయనగరం మధ్య మెము పాసింజర్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు గురువారాలు మినహా సాధారణ రైలుగా నడుస్తుందని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడుస్తుందన్నారు.

News December 27, 2024

PHOTO: వంజంగిలో ఎర్రబడ్డ ఆకాశం

image

అల్లూరి ఏజెన్సీ విభిన్న వాతావరణాలకు నిలయం. ఇక్కడ ఏ సమయంలో వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. ఎప్పుడూ మేఘాలతో ఉండే పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆకాశం ఎర్రగా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఈ దృశ్యాల్ని బంధించి ఆందించారు.

News December 27, 2024

వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.

News December 27, 2024

విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’

image

భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

News December 27, 2024

కుల‌గ‌ణ‌న‌పై స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే: విశాఖ జేసీ

image

జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల‌పై సమీక్ష చేసేందుకు, ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వ‌హించిన కులగ‌ణ‌న‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే(సోష‌ల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.

News December 26, 2024

విశాఖ: కూటమిలో ఆడారి ఇముడుతారా?

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News December 26, 2024

గోల్డ్ అవార్డు గెలుచుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు గెలుచుకుంది. అవార్డును విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున ఇంధన, పర్యావరణం జనరల్ మేనేజర్ ఉత్తమ బ్రహ్మ, డీజిఎం విజయానంద్ గురువారం విజయవాడలో స్వీకరించారు. స్టీల్ ప్లాంట్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సాధించినందుకు ప్లాంట్ సీఎండీ ఏకె సక్సేనా అధికారులు సిబ్బందిని అభినందించారు.