Visakhapatnam

News May 12, 2024

రేపు వేతనంతో కూడిన సెలవు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులకు కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

News May 12, 2024

విశాఖ: అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సాధార‌ణ ప‌రిశీల‌కులు అమిత్ శ‌ర్మ (63003 10152), పోలీసు ప‌రిశీల‌కులు అమిత్ కుమార్ (63003 15841), వ్యయ ప‌రిశీల‌కులు రెంగ రాజ‌న్ (63003 01726), ఎస్.కోట‌, ప‌శ్చిమ‌, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల సాధార‌ణ‌ ప‌రిశీల‌కులు సీతారామ్ జాట్ (63003 20829), భీమిలి, తూర్పు, ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గాల వ్యయ ప‌రిశీల‌కులు సౌమ్య (63003 16752)గా తెలిపారు.

News May 11, 2024

విశాఖ: అప్పట్లో రూ.40 కోట్లు.. ఇప్పుడు రూ.21 కోట్లు

image

విశాఖ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూ.21 కోట్లు విడుదలయ్యాయి. 2019లో జరిగిన ఉమ్మడి విశాఖ ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి, విశాఖ, అరకు పార్లమెంట్ స్థానాల ఉండటంతో ఎన్నికల నిర్వహణకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖ పరిధి తగ్గింది. దీంతో విశాఖలో ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల కూడా తగ్గింది.

News May 11, 2024

విశాఖ: మీ నియోజకవర్గంలో విజయం ఎవరిది?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News May 11, 2024

సా.6 నుంచి డ్రై పీరియడ్ ప్రారంభమవుతుంది: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు డ్రై పీరియడ్‌గా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని, మద్యం దుకాణాల సైతం మూసివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల జరగడానికి ముందు చివర 48 గంటల సమయాన్ని డ్రై పీరియడ్‌గా వ్యవహరిస్తామని తెలిపారు.

News May 11, 2024

విశాఖ: సాయంత్రం నుంచి మద్యం దుకాణాల బంద్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేయాలన్న నిబంధన ఉంది. శనివారం సాయంత్రం తర్వాత మద్యం దుకాణాలకు సీల్ వేసి మూసి వేస్తారు. రెండు రోజుల తర్వాత వీటిని తిరిగి తెరుస్తారు. దీంతో మద్యం దుకాణాల ముందు మందు బాబులు క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేసి భద్రపరుచుకున్నారు.

News May 11, 2024

ఉండేది విజయనగరం జిల్లా.. ఓటు విశాఖ ఎంపీకి

image

విశాఖ జిల్లాలో మొత్తం 1,991 పోలింగ్ కేంద్రాలున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,962గా ఉంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉంది. ఆ నియోజకవర్గ ఓటర్లు విశాఖ ఎంపీకి తమ ఓటు వేస్తారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొంత భాగం విశాఖ జిల్లాలో ఉండగా.. ఆ నియోజకవర్గ ఓటర్లు అనకాపల్లి ఎంపీ స్థానానికి తమ ఓటును వినియోగించాల్సి ఉంటుంది.

News May 11, 2024

విశాఖ: ఓటుకు రూ.1000 నుంచి 1500..?

image

మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.

News May 11, 2024

విశాఖలో రికార్డు‌స్థాయి ఓటింగ్

image

ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. దీనికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు విశాఖలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అనూహ్య స్పందన లభించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 6,651 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా 2024లో జరుగుతున్న ఎన్నికలకు ఏకంగా 15,993 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు.

News May 11, 2024

విశాఖ: నేటి సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా నేటి సాయంత్రం 6 గంటలకు తమ ప్రచారాన్ని ముగించాలి. ఓటింగ్ జరగడానికి 48 గంటలు ముందుగా అభ్యర్థులు తమ ప్రచారాలను ముగించాలి. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు సభలు నిర్వహించకూడదు. రేపు, ఎల్లుండి పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం అనుమతితో మాత్రమే ప్రచురించాల్సిన అవసరం ఉందని జిల్లా అధికారులు సూచించారు.