India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకృతి సేద్యం, నూతన సాగు విధానాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రైతులకు గిట్టుబాటు ధరకు కల్పించే విధంగా సేవలందించాలని తెలిపారు.

కార్యాచరణ పరిమితుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. రానుపోను రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ✔ ఫిబ్రవరి 21న సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్ప్రెస్ (22807)✔ ఫిబ్రవరి 18న షాలిమర్-విశాఖ ఎక్స్ ప్రెస్(22853) రద్దు చేశారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.

కదిలే రైళ్లు, ప్లాట్ ఫాం, వెయిటింగ్ హాలులో చోరీకి గురైన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రూ.10 లక్షల విలువైన 54ఫోన్లను రైల్వే డీఎస్ఆర్పీ పి.రామచంద్రరావు సూచనలతో సీఐ ధనుంజయ నాయుడు ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్లో బాధితులకు అందించారు. వేర్వేరు సందర్భాల్లో మిస్ అయిన ఫోన్లు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి రికవరీ చేశారు.

ఒకే సమస్యపై ప్రజల నుంచి పదేపదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్లో సోమవారం సమీక్ష చేశారు. పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏషియా సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జులై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలోచేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’ అని ఆయన తెలిపారు.

దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కాలేజీలో జరుగుతున్న ఈవెంట్లో డాన్స్ చేస్తున్న సమయంలో వివాదం తలెత్తింది. సెకండియర్ విద్యార్థి ప్రదీప్ కాలు పొరపాటున థర్డ్ ఇయర్ విద్యార్థి సూర్యాకు తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యాతో పాటు అతని స్నేహితులు.. ప్రదీప్, అతని ఫ్రెండ్ ఈశ్వర్పై దాడి చేశారు.
Sorry, no posts matched your criteria.