Visakhapatnam

News December 26, 2024

విశాఖ: ‘మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి’

image

పనోరమ హిల్స్ వద్ద మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మర్రిపాలెంకు చెందిన ఎస్.నాగేశ్వరరావు(38) ఆటోలో కేటరింగ్ సామాన్లు తీసుకువచ్చి అనుమాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని..అతిగా మద్యం తాగిన కారణంగానే అతను మరణించినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు.

News December 26, 2024

ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!

image

వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్‌లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.

News December 26, 2024

విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.

News December 26, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

విశాఖ: గ్యాస్ లీక్.. లైట్ వెయ్యగానే వ్యాపించిన మంటలు..!

image

పాతడెయిరీ ఫారం ఇందిరాగాంధీ నగర్‌లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అప్పారావు, సత్యవతి, రాజశేఖర్, చంద్రశేఖర్ గాయపడ్డారు. వీరిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన వీరు తిరిగి వచ్చే ఇంటి మొత్తం గ్యాస్ లీకై వ్యాపించింది. నాగరాజు లైట్ వెయ్యగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. 

News December 26, 2024

యువ సమ్మేళనంలో పాల్గొంటున్న విశాఖ యువతీ, యువకులు

image

అంతర్ జిల్లా యువ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు బుధవారం వైఎస్ఆర్ కడప వెళ్లినట్లు NYK జిల్లా అధికారి మహేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 30వరకు ఈ యువ సమ్మేళనం జరుగుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన 25 మంది యువతీ యువకులు ఇందులో పాల్గొన్నారన్నారు. యువ సమ్మేళనాలతో వివిధ సమూహాల సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందన్నారు.

News December 25, 2024

విశాఖ: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ మోహన్ పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారని తెలిపారు.

News December 25, 2024

విశాఖ: ‘యాక్షన్-ప్యాక్డ్ క్షణాలకు సిద్ధంగా ఉండండి’

image

ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it

News December 25, 2024

ఆడారిని వద్దన్న TDP.. రమ్నన్న BJP..!

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ రాజకీయ జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. MLAగా విశాఖ వెస్ట్ నుంచి YCPనుంచి ఓడిపోయిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమిప్రభుత్వం వచ్చాక డెయిరీలో అక్రమాలు జరిగాయని జిల్లా TDPనాయకుల ఆరోపణలతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. అయితే TDPలో ఆయన చేరేందుకు ప్రయత్నించగా స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో BJPలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

News December 25, 2024

జాబ్‌కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి..!

image

ప్రకాశం జిల్లాలో జన్మించిన కంభంపాటి హరిబాబు AUలో బీ.టెక్, PHD పూర్తి చేసిన అనంతరం అదే యూనివర్సీటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. BJPలోని పలు పదవుల్లో సేవలంది 1999లో విశాఖ-1 MLAగా, 2014లో విశాఖ MPగా గెలిచారు. 2021లో మిజోరం గవర్నర్‌గా నియమింపబడ్డ ఆయన తాజాగా ఒడిశా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. కాగా.. ఆయనకు ఇటీవల హార్ట్ సర్జరీ అయ్యింది.