India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో లక్ష్మీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. 2,500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో శోభారాణి పాల్గొన్నారు.
అల్లూరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జనవరి 1 నుంచి బయోమెట్రిక్ హాజరుతో జీతాల చెల్లింపు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హాజరు గుర్తింపునకు సచివాలయాల యాప్ ఉపయోగించి, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా అధికారుల నుంచి ముందస్తు సెలవులకు అనుమతులు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్-1, గ్రేడ్-5, VROలు అందరికీ వర్తిస్తుందన్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఎలమంచిలిలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఈనెల 25న రాజమండ్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వైరల్ అవుతోంది.
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
టీం ఇండియాలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు విశాఖకు చెందిన ఆంధ్ర రంజీ క్రికెటర్ పైల అవినాశ్ తెలిపారు. సోమవారం ఆయన సింహాచలంలో మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఇటీవల జరిగిన వేలంలో రూ.30 లక్షలకు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించారు. టోర్నీలో ప్రతిభ కనబరిచి తన కలసాకారం చేసుకునే దిశగా సాధన చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖలోని అక్కయ్యపాలెంలో బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు(13) అమ్మమ్మ వద్ద ఉంటూ నగరంలోని ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇంటిలో ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బాత్రూంలో షూ లేసులతో హ్యాంగర్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు కర్నూలులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అన్నారు. పోటీలు గాజువాక జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతాయన్నారు.
విశాఖలోని సీతంపేట CSB బ్యాంకుకు తమరాన చిరంజీవి అనే వ్యక్తి బురిడీ కొట్టించాడు. CSB బ్యాంకుకి వెళ్లి సుజాతనగర్ FEDERAL బ్యాంకులో గోల్డ్ తాకట్టు ఉందని.. అది విడిపించి మీ బ్యాంక్లో పెడతానని రూ.14,69,000 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ డబ్బులతో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
2014లో పెదబయలు మండలంలోని కుంతుర్ల గ్రామానికి చెందిన మజ్జి బాలరాజు అనే వ్యక్తి, అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందాడని ఎస్సై కే.రమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిలో ఏ-2 ముద్దాయి అయిన గంపదొర సత్తిబాబు అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి అరకు 11.45 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఇవే తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.