India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నర్సీపట్నం ఆర్టీసీ హైర్ బస్సు దొంగతనంలో నిందితుడు సాదిక్ భాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాకు చెందిన భాషా గతంలో వోల్వో, లారీలకు డ్రైవర్గా పనిచేశాడు. ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి వచ్చి మద్యం మత్తులో బస్సులో పడుకున్న తర్వాత బస్సుకు తాళం ఉండటం గమనించి దొంగతనం చేశాడని తెలిపారు.
విశాఖలో సోమవారం నిర్వహించిన రోజ్గర్మేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోస్టల్, రైల్వే, బ్యాంకింగ్ మరిన్ని రంగాల్లో ప్రభుత్వ సేవలకు ఎంపికైన 664 మందికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లెటర్లను అందజేసి, వారందరికీ అభినందనలు తెలిపారు. దేశం గర్వించేలా పని చేయాలనీ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు.
ఉపాధి హామీ పథకం, అమృత్ పథకం, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ 20 సూత్రాల ఛైర్మన్ ఎల్.దినకర్ తెలిపారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల అనంతరం నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పాల్గొన్నారు.
విశాఖ కేజీహెచ్లో సర్వర్లు పని చేయక రోగులు కష్టాలు పడుతున్నారు. తెల్లవారి నుంచి ఓపి కౌంటర్ దగ్గర గంటల తరబడి లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లకే సమయం అయిపోతుందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఓపి కౌంటర్ వద్ద ప్రతిరోజు రోగులకు కష్టాలు తప్పడం లేదని.. ప్రత్యమ్నాయం చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
భీమిలి మండలం తిమ్మాపురం సముద్ర తీర ప్రాంతానికి రెండు తాబేళ్ల కళేబరాలు ఆదివారం కొట్టుకొచ్చాయి. రెండు రోజులుగా భీమిలి, ఉప్పాడ, మంగమూరిపేట తదితర తీర ప్రాంతాలకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ సీజన్లో గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయని వారు వెల్లడించారు. కాలుష్యం కారణంగా ఇవి మృత్యువాత పడుతున్నట్లు భావిస్తున్నారు.
విశాఖ వీఐపీ రోడ్డులో Devinci థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు త్రీటౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఆదివారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో మహిళలకు అధిక సొమ్ము ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నలుగురు బాధిత మహిళలను శక్తి సదన్ హోమ్కు పంపారు.
విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బుచ్చియపేట జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు, సీనియర్ జడ్పీటీసీ కర్రి సత్యం పాల్గొన్నారు. జడ్పీటీసీల ఫ్లోర్ లీడర్గా పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజును ఎన్నుకున్నామని రాంబాబు తెలిపారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాటపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. జన సమూహం ఎక్కువగా ఉన్న సమయంలో హీరో అల్లు అర్జున్ వెళ్లకుండా ఉంటే బాగుండేదని.. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ముందుగా గ్రహించి సమాచారం ఇవ్వాల్సి ఉందని అన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మంచిది కాదని పల్లా అన్నారు. ఈ ఘటన కారణంగా బెనిఫిట్ షోలు ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
విశాఖ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హరిదాసులు, బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అయితే కాలానుగుణంగా హరిదాసులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు కాలినడకన తంబుర పట్టుకుని వీధివీధి తిరిగేవారు. అయితే మర్రిపాలెం గ్రామంలో టూవీలర్ల పై హరిదాసులు తిరుగుతూ సందడి చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు ఆనాటి కళకనిపించడం లేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎం.పి.పి. స్కూల్ను అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బల్లగరువులో సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ దారిలో ఉన్న కొర్రపత్తి స్కూల్కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడగా వారు సమస్యను వివరించారు. అలాగే అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ, ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.