Visakhapatnam

News May 10, 2024

ఓటర్లకు విశాఖ కలెక్టర్ ఆహ్వాన పత్రిక

image

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వినూత్నరీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈనెల 13న ఎన్నికల పండగలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ఈ ప్రచారాన్ని చేపట్టారు.

News May 10, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎజ్జల సోమునాయుడు, మైలిపల్లి రాజు చేపల చెరువు వద్ద ప్రమాదవశాస్తు కరెంట్ షాక్‌తో చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. సోమునాయుడు అవివాహితుడు కాగా.. రాజుకు పెళ్లై ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.  

News May 10, 2024

విశాఖలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వ్యక్తులు అరెస్టు

image

ఓటర్లకు డబ్బులు పంచుతున్న నలుగురిని గురువారం మహారాణిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దండు బజారులో ఓ వ్యక్తి నుంచి రూ.50,000. సాలిపేటలో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1,08,168లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 10, 2024

విశాఖ: నేడు ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు సమావేశం

image

విశాఖలో నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు గురువారం రాత్రి విశాఖ పార్టీ కార్యాలయం వద్ద బస్సులో బస చేశారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి తెలిపారు. ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించామన్నారు.

News May 10, 2024

విశాఖ: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డిసిఎం సందీప్ తెలిపారు. విశాఖ-చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ప్రతి సోమవారం విశాఖలో బయలుదేరి మరుసటి రోజు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుందన్నారు. ఈనెల13 నుంచి 24 వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి విశాఖ చేరుకుంటుందన్నారు.

News May 10, 2024

విశాఖ: అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లు

image

విశాఖ జిల్లాలో దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 16,821 మందికి పైగా దివ్యాంగ ఓటర్లు ఉంటే వీరిలో 547 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. మిగిలిన 16,274 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేయనున్నారు. వీరి కోసం 100 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వీరిలో 8వేల మంది అంధులు ఉన్నారు. వీరి కోసం బ్యాలెట్ పేపర్లు బ్రెయిలీ లిపిలో సిద్ధం చేస్తున్నారు.

News May 10, 2024

అనకాపల్లి: ఎన్నికల ప్రక్రియపై ట్రైనీ ఐపీఎస్‌లకు అవగాహన

image

ఎన్నికల ప్రక్రియపై నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్‌లకు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు.

News May 9, 2024

విశాఖలో కూటమి అభ్యర్థులను పరిచయం చేసిన చంద్రబాబు

image

ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. విశాఖ నగరం ద్వారక నగర్‌లో నిర్వహించిన సభలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్, తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్, పశ్చిమ అభ్యర్థి గణబాబును పరిచయం చేశారు.

News May 9, 2024

విశాఖ: కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా శశిథరూర్ ప్రచారం

image

ఏఐసీసీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ నగరంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

News May 9, 2024

సింహాచలం: అప్పన్న ఆలయానికి భక్తుల తాకిడి

image

చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ తెల్లవార్లు ఇక్కడే ఉండి ఉదయం అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని తిరిగి వెళతారు.