Visakhapatnam

News December 22, 2024

జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలకు నోటిఫికేషన్

image

జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్‌లో నియమించుటకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.8 మంది న్యాయవాదులు నియామకం నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.బార్ కౌన్సిల్స్ లో కనీసం 10 సంవత్సరాల మెంబర్‌గా రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.ఆసక్తి గలవారు జనవరి 6 లోపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.

News December 22, 2024

గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఆస్తులు సంపాదించడం నేరం: డీఐజీ

image

గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు కొనుగోలు చేయడం నేరం అని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయడం గానీ, డబ్బు చెలామణి జరిగినట్టు రుజువు ఐతే జప్తు చేయబడుతుందన్నారు. లావాదేవీలు జరిపే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

News December 21, 2024

విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్‌లో  తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News December 21, 2024

విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు

image

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

News December 21, 2024

మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది: పవన్ కళ్యాణ్

image

అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం Dy.CM పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలని సూచించగా.. ‘మా ఇంట్లో వాళ్లు నా కోసం ఎంత తపన పడతారో తెలీదు కానీ.. మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది’ అని అన్నారు. ఐదేళ్లు మీకోసం పని చేస్తానని.. ఈ ఐదేళ్ల తర్వాత ప్రోగ్రస్ రిపోర్ట్ ఇవ్వాలని గిరిజనులకు ఆయన కోరారు.

News December 21, 2024

జగన్ పుట్టినరోజు.. గుడివాడ రక్తదానం

image

విశాఖలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకటకుమారి, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఉన్నారు.

News December 21, 2024

విశాఖలో సెలవు ఇవ్వకపోతే చర్యలు: DEO

image

వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేశారని కొందరు అంటున్నారు. అనకాపల్లి జిల్లాకు ఈ సెలవు వర్తించదు. ఇంతకూ మీ ఏరియాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారా? లేదా?

News December 21, 2024

‘పెరిగిన కాఫీ మద్దతు ధర’ 

image

కాఫీ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా జీసీసీ కాఫీ మద్దతు ధరను పెంచిందని జీసీసీ ఛైర్మెన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జీసీసీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. కాఫీ పార్చ్మెంట్‌కు ఇస్తున్న రూ.285 ధరను రూ.320కు, చెర్రీకి ప్రస్తుతం ఇస్తున్న రూ.150లను రూ.170కు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే రొబస్టా కాఫీకి ఇస్తున్న రూ.80 లను రూ.100 లకు పెంచామన్నారు.

News December 20, 2024

విశాఖ: పరిటాల హత్య కేసులో ముద్దాయి విడుదల  

image

పరిటాల రవి హత్య కేసులో ముద్దాయి రేఖమయ్య విడుదలైనట్లు సెంట్రల్ జైల్ అధికారి కె.కుమార్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో 2013 సంవత్సరం నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రేఖమయ్య‌కు హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. పదేళ్ల అనంతరం బాహ్య ప్రపంచంలోకి రేఖమయ్య అడుగుపెట్టాడు.

News December 20, 2024

విశాఖ: ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి’

image

మధ్యవర్తిత్వం విధానం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. విశాఖ నగరం న్యాయస్థానాల భవన సముదాయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కక్షిదారులు న్యాయవాదులు న్యాయమూర్తులు కలిసి మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు.