Visakhapatnam

News May 8, 2024

సింగపూర్‌కి చేరిన భారత నేవీ నౌకలు

image

భారత నౌకాదళానికి చెందిన ఢిల్లీ శక్తి కిల్తాన్ నౌకలు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఫ్లీట్ నేతృత్వంలో సింగపూర్‌కి చేరుకున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ సిబ్బంది అక్కడే భారత హై కమిషనర్ స్వాగతం పలికారు. ఈ పర్యటన దక్షిణ చైనా సముద్రంలో భారత నావికాదళం, తూర్పు నావికాదళం కార్యాచరణ విస్తరణలో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య స్నేహ సహకారం మరింత పెరుగుతుందన్నారు.

News May 8, 2024

విశాఖ: మూడు రోజుల్లో 95.9% పోలింగ్

image

విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ రికార్డు సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన 13,076 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 12,541 మంది హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 95.9 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి 5,389 మంది దరఖాస్తు చేయగా 4,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వీరి శాతం 77.78గా నమోదయింది.

News May 8, 2024

విశాఖ: ఇంటర్ ఫెయిల్ అయిన వారికి తత్కాల్ అవకాశం

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్ బోర్డు తత్కాల్ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఫీజు చెల్లించలేని వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని పరీక్షల విభాగం కంట్రోలర్ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు రూ.3 వేలు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

News May 8, 2024

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకం: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని, వారు ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లికార్జున, సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ పేర్కొన్నారు. స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం జరిగిన ఒక్క రోజు శిక్షణ సదస్సులో మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి వారిద్దరూ ప్రసంగించారు. పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు.

News May 7, 2024

విశాఖ: ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీకి మద్దతు

image

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష ఎన్డీఏ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతు ప్రకటించారు. తనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఓటర్ల గందరగోళానికి గురికాకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

News May 7, 2024

ఫలితాలు విడుదల.. మొదటి మూడు ర్యాంకులు విశాఖవే

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఏయూ ఈఈటీ – 2024 ఫలితాలు మంగళవారం వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. పెందుర్తికి చెందిన సాయి ఈశ్వర్ మొదటి ర్యాంకును, చంద్రంపాలెంకు చెందిన కే సాయి ప్రణీత్ రెండవ ర్యాంకును, తగరపువలసకు చెందిన జీ మోహన్ సాయి సంపత్ మూడవ ర్యాంకును సాధించారు.

News May 7, 2024

ఉద్యోగులకు సీఎం జగన్ మేలు చేశారు: చంద్రశేఖర్ రెడ్డి

image

సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం లాసన్స్ బేకాలనీలో గల బొత్స ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వైసీపీ మేనిఫెస్టోలో 40శాతం ధరకే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ప్రకటించారన్నారు. రెండు డీఏలు జూన్, జూలై లోపు ఇస్తున్నారని, 11 పీఆర్సీ కింద ఐఆర్ 20 శాతం ప్రకటించారని చెప్పారు.

News May 7, 2024

గాజువాకలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

image

కొత్తగాజువాక నుంచి హిమాచల్‌నగర్ వెళ్లే రోడ్డులో ఓ వృద్ధుడు నిన్న చనిపోయాడు. స్థానికులు గాజువాక పోలీస్‌స్టేషన్‌కి సమాచారం ఇవ్వడంతో హెచ్సీ బి.నారాయణ అక్కడకు వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్, తోపుడు రిక్షాల కోసం ప్రయత్నించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకు ఎదురుచూసి సామాజిక కార్యకర్త తరుణ్ సాయంతో బైక్‌పై శ్మశానవాటికకు తరలించి ఖననం చేశారు.

News May 7, 2024

విశాఖ: టీడీపీలో చేరిన YSR ముఖ్య అనుచరుడు

image

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి కొయ్య ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరారు. సోమవారం అనకాపల్లిలో జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీతీర్థం పుచ్చుకున్నారు. ప్రసాద్ రెడ్డికి టీడీపీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

News May 7, 2024

విశాఖ ఎంపీగా ఎన్నికైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్

image

విజయనగరం సంస్థానాధీశుడు పీవీజీ రాజుకు స్వయంగా చిన్నాన్న అయిన పూసపాటి విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) 1962లో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1926లో సొంతంగా క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకుని 1938లో ఇంగ్లాండ్ వెళ్లి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతో ఆయన 1952లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. క్రికెట్‌కు విస్తృత ప్రచారాన్ని కల్పించిన ఆయన 1965లో కన్నుమూశారు.