India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో పూర్తయిన మద్యం దుకాణాల లాటరీ పూర్తయింది. సోమవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభమైన మద్యం దుకాణాలు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగింది. ఎక్సైజ్ శాఖ గజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ సమాచారాన్ని త్వరలో తెలుగులో అందించనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చీఫ్ భారతి తెలిపారు. త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషలోనే వాతావరణం సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఇకపై ఐఎండీ సూచనలకు అనుగుణంగా ప్రాంతీయ భాష తెలుగులో సమాచారాన్ని అందజేస్తామన్నారు. కైలాసగిరిపై ఏర్పాటుచేసిన డాప్లర్ రాడార్ ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
విజయదశమి సందర్భంగా ఆదివారం ఒక్కరోజు విశాఖ జిల్లాలో రూ.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో 139 ప్రభుత్వం మద్యం దుకాణాలతో పాటు 132 బార్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు స్వల్పంగానే పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో తగినంత స్టాక్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 14 ఉదయం 8 గంటల నుంచి వుడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం షాపుల కేటాయింపుకు జరిగే లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులు అధికంగా రావడంతో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా ఎక్కువ కౌంటర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త నరికి చంపిన ఘటన నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం గన్నేరుపుట్టులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కత్తితో నరికి పరారయ్యాడు. దంపతులు పని కోసం ఒడిశా నుంచి వచ్చినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘దేవర’ మూవీలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప(పశురా) ఆదివారం అనకాపల్లిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ల సంతోశ్, అభిమానులు పొన్నప్పను కలిసి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి అభినందించారు. అభిమాన నటుడి చిత్రంలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప అనకాపల్లి రావడం ఆనందంగా ఉందన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్, మటన్ షాపుల ముందు పలుచోట్ల జనాలు బారులు తీరారు. విజయదశమి శనివారం రావడంతో జంతువధకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారి ఆలయాల వద్ద వేట వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మాంసం చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250, స్కిన్ రూ.240, మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు.
ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
కొత్తవలస రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 27 కు వాయిదా వేసినట్లు డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న జరగాల్సిన పరీక్షలను నాక్ బృందం సందర్శన కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 27 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.