India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాకవరపాలెం మండలం కె.తూటిపాలలో వివాహిత కొల్లి విజయ(25) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
విశాఖలో బుధవారం ఐన్ఎన్ఎస్ నిర్దేశిక్ నౌకను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను నౌకాదళ అధికారులు చేశారు. కోల్కతాలో ఐఎన్ఎస్ నిర్దేశిక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన దీనిని రెండు ఇంజన్లతో రూపకల్పన చేశారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరగనుంది.
జాయ్ జమీమియా (హనీ ట్రాప్) కేసులో మాజీ ఎంపీ కుమారుడు పాత్ర ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. కమిషనరేట్లో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. జామ్ జమీమియా ముఠాలో మాజీ ఎంపీ కుమారుడు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. దీనిపై కూడా తాము విచారణ చేస్తున్నామన్నారు. పోలీసులకు దొరికితే ఏ విధంగా సమాధానాలు చెప్పాలో ముందుగానే ముఠా సభ్యులు శిక్షణ పొందినట్లు తెలిపారు.
జీకే వీధి మండలం ఆర్వీ నగర్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి. గోవర్ధన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. 2017 ఏప్రిల్ 19న ఆర్.వీ నగర్ జంక్షన్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అనంతరం లారీ డ్రైవర్ భయంతో కిందికి దూకడంతో లారీ ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు.
భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల దృష్ట్యా భవానీపట్నం- విశాఖపట్నం ప్రత్యేక రైలు గమ్యాన్ని రాయగడ స్టేషన్ వరకు పరిమితం చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే సీనియర్ డీసీఎం, సందీప్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెం.08503/04, భవానీపట్నం-విశాఖపట్నం- భవానీపట్నం పాసెంజర్ 3.01.2025 నుండి 9.01.2025 వరకు రాయగడ-విశాఖపట్నం స్టేషన్ ల మధ్య రాకపోకలు సాగిస్తుందని తెలియజేసారు.
విశాఖ: 22ఏ నిషేధిత జాబితా భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విశాఖలో అన్నారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత 22ఏ నుండి భూముల తొలగింపుపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నచోట మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లకు ఛార్జీలు తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ భూ కబ్జాలపై విచారణ చేస్తున్నామన్నారు.
విశాఖ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారంటూ షర్మిలను ఆమె Xద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగు కాంగ్రెస్ నేతలా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు షర్మిల ఎవరి మీద పోరాటం చేస్తున్నారో అనే క్లారిటీ ఆమెకైనా ఉందా అని అన్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఆధారం చేసుకుని స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ అందించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 లో ఏ.యు మెరుగైన స్థానాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 35% విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూ నిలచింది. ప్రపంచవ్యాప్తంగా 8536 విద్యాసంస్థలను పరిశీలించి వీటిలో టాప్ 35% ఎంపిక చేసింది. దీనికి సంబందించిన అధికారిక ఉత్తర్వులు రిజిస్ట్రార్ ధనుంజయరావుకు మంగళవారం అందాయి.
‘ఫేక్ వీడియో కాల్స్తో జాగ్రత్త’ అంటూ విశాఖ సిటీ పోలీసులు పోస్టర్ విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి మీ వీడియోలను రికార్డ్ చేస్తున్నారని, వాటిని అశ్లీలంగా ఎడిట్ చేసి డబ్బులు కావాలంటూ బెదిరింపులకు దిగుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచిత అకౌంట్స్ నుంచి వచ్చే రిక్వస్ట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 సంప్రదించాలన్నారు.
విశాఖలో మెట్రో ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే <<14776969>> కారిడార్ -1<<>>, <<14777184>>కారిడార్-2<<>>, <<14777236>>కారిడార్-3<<>> కింద రూట్మ్యాప్ రెడీ చేశారు. దీనిపై అసెంబ్లీలోనూ విశాఖ MLAలు తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలు కలపాలని సూచించారు. SMలోనూ మెట్రో రూట్లపై చర్చ నడుస్తోంది. మరి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో ఎటాచ్ అయితే మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.