Visakhapatnam

News May 5, 2024

పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News May 5, 2024

విశాఖ: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

చోడవరం: పోటీలో నిలిచింది ఆరుగురు మాత్రమే..!

image

రాష్ట్రంలో అతి తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ రికార్డు సృష్టించింది. ఇక్కడ కేవలం 6 మాత్రమే బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరావు, బీఎస్పీ అభ్యర్థిగా మహాలక్ష్మి నాయుడు, సీపీఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా గణేశ్, ఇండిపెండెంట్‌గా వివేక రాజు బరిలో ఉన్నారు.

News May 5, 2024

అనకాపల్లి: ‘స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలి’

image

స్వేచ్ఛగా ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం ఆయన అనకాపల్లి కలెక్టరు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలపై ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ వివరించారు.

News May 4, 2024

పరామర్శకు వెళితే దాడి చేశారు: సీఎం రమేశ్

image

తనపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవరాపల్లి మండలంలోని తారువలో మా పార్టీ కార్యకర్తపై దాడి జరిగితే, పరామర్శించడానికి వెళ్లిన నాపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అక్కడే చోద్యం చూస్తున్న పోలీసులు, వారి వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడికి స్వయంగా YCP ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడే నేతృత్వం వహించడం దారుణం’ అని ట్వీట్ చేశారు.

News May 4, 2024

విశాఖలో రామోజీరావుపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స

image

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసిన ఈనాడు రామోజీరావుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మా భూమి మాది కాకపోతే మరెవరిది’ అంటూ రామోజీరావును ప్రశ్నించారు. అన్నం తినే వాళ్ళు ఎవరూ ఇలాంటివి రాయరని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదన్నారు.

News May 4, 2024

విశాఖ: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న అనకాపల్లికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కశింకోట మండలం తాళ్ళపాలెంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుందని వెల్లడించారు. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు.

News May 4, 2024

విశాఖ చేరుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

image

ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా శనివారం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, రెవెన్యూ, పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఆంధ్రా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద జరిగే ఈవీఎంల కమిషనింగ్, ఇతర ప్రక్రియలను పరిశీలించే నిమిత్తం ఆయన వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

News May 4, 2024

విశాఖ: సరిగ్గా నెలరోజులు.. మీ MLA ఎవరు?

image

సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలోని 15 నియోజకవర్గాల్లో నాలుగు మినహా మిగతా వాటిలో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.

News May 4, 2024

70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని ప్రతిపాదన

image

70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి ఎమ్మెల్యే కూనిశెట్టి వెంకటనారాయణ దొర. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన కూనిశెట్టి 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర అసెంబ్లీలో ఆనాడే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తారు. ప్రతిపాదనపై ఓటింగ్‌ జరిగితే ఒకే ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది.