India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 08529, 08530 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు అక్టోబర్ 10 నుంచి 16 వరకు తిరగనున్నాయని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.
జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.
అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆరిలోవ రామకృష్ణాపురంలో పసికందు అదృశ్యం ఘటనను ఆరిలోవ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆరిలోవ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వలన పసికందు అమ్మమ్మ వాళ్ల బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో పసికందును కుక్క లాక్కుని పోయిందని జరిగిన హై డ్రామాకు తెరపడింది.
టీచర్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బీసీ తూర్పు కాపులకు కేటాయించాలని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అయితే తూర్పు కాపులకు సీటు ఇస్తుందో ఆ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సంఘం నాయకులు బలగ సుధాకర్, లోగిస గణేశ్ పాల్గొన్నారు.
మల్కాపురంలో ఈనెల 3న జరిగిన వాసు హత్య కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు పవన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించామన్నారు. వాసు అన్న సింహాచలం మొదటి భార్య కుమారుడు పవన్ సాయిని పిలిపించి దాడి చేశారని సీఐ తెలిపారు.
కేజీహెచ్లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ ఛారిటీస్ వారి సౌజన్యంతో భోజనం నూతన భోజనం కౌంటర్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. రోగుల బంధువుల కోసం భోజనం కౌంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ శివానంద తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.