Visakhapatnam

News May 3, 2024

జూన్ 1 విశాఖ-హతియా రైలు రద్దు

image

విశాఖపట్నం-హతియా నగరాల మధ్య నడుస్తున్న వారాంతపు వేసవి ప్రత్యేక రైలును జూన్ 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 30 వరకు విశాఖ నుంచి హతియా(08559) వెళ్లే రైలు, అదేవిధంగా హతియా నుంచి విశాఖకు(08560) వచ్చే రైళ్ళను మే 6 నుంచి జూన్ 1 రద్దు చేశారు. ప్రయాణికులు దీనిని గమనించాలని తెలిపారు.

News May 3, 2024

శనివారం నాటికి విశాఖకు చేరనున్న బ్యాలెట్ పత్రాలు

image

ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ శరవేగంగా జరుగుతోంది. జిల్లాలోని 6 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం కోసం 45,350 బ్యాలెట్ పత్రాల ముద్రణ కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయంలో జరుగుతోంది. శనివారం నాటికి బ్యాలెట్ పత్రాలు విశాఖకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ అంతా కర్నూల్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనే జరుగుతుంది.

News May 3, 2024

విశాఖ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ రూఫ్ ఏర్పాటు

image

విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

News May 3, 2024

సింహాచలం: నేటి నుంచి చందనోత్సవ టిక్కెట్లు విక్రయాలు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈనెల 10న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లువిక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.ఈనెల 7వ తేదీ సాయంత్రం వరకు విక్రయాలు సింహాచలం మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్రాంచ్ లలో టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు.కొండపై కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

News May 3, 2024

భీమిలి కొట్లాట కేసులో పదిమంది అరెస్ట్

image

భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News May 2, 2024

విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

image

విశాఖ ఆనందపురంలో చెక్ పోస్టు వద్ద భారీగా నకీలి కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడులలో 3 వాహనాలు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 22 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 6 కత్తులు, రూ.10 లక్షల నకిలీ కరెన్సీ, ఒక రైస్ పూలింగ్ బౌల్, గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్‌లు పోలీసులు సీజ్ చేశారు.

News May 2, 2024

విశాఖ: మే 5న సమీకృత ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ సపోర్ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తునట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు.

News May 2, 2024

విశాఖ: 1989లో తండ్రులు, 2024లో కొడుకులు

image

గాజువాకలో పోటీ పడుతున్న అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావుల తండ్రులు 1989లో ప్రత్యర్థులుగా బరిలో దిగారు. వారు పెందుర్తి నుంచి పోటీ చేస్తే.. వారి వారసులు గాజువాకలో పోటీ పడుతున్నారు. 1989లో పెందుర్తి నుంచి గుడివాడ గురునాధ‌రావు కాంగ్రెస్ నుంచి, ప‌ల్లా సింహాచ‌లం TDP నుంచి పోటీ చేయగా, గురునాధరావు విజ‌యం సాధించారు. వారసుల్లో ఎవరు పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 2, 2024

విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక హోమాలు

image

విశాఖ శ్రీ శారదా పీఠంలో ఈ నెల 4, 5 వ తేదీలలో రెండు రోజులు పాటు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు తెలిపారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రాజ శ్యామలా – వనదుర్గ హోమం, శ్రీ సుదర్శన నారసింహ హోమం జరగనున్నట్లు తెలిపారు. హోమం గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

News May 2, 2024

విశాఖలో ఐదుచోట్ల గాజు గ్లాస్ గుర్తు

image

విశాఖ జిల్లా పరిధిలో గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై స్పష్టత వచ్చింది. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించలేదు. అయితే విశాఖ తూర్పు, ఉత్తరం, భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. తూర్పు, ఉత్తర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వడ్డీ శ్రావణి అనే స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించారు.