Visakhapatnam

News December 7, 2024

పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత

image

విశాఖ ఆరిలోవలో నిర్మించిన నూతన పోలీసు స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొనున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఈ భవన నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తూ నేటికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు.

News December 7, 2024

పెందుర్తి: మాదకద్రవ్యాలపై పోస్టర్ ఆవిష్కరణ

image

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

News December 7, 2024

విశాఖ నుంచి విమానాల దారి మళ్లింపు

image

విశాఖలో ఇవాళ పొగ మంచు తీవ్రంగా కురిసింది. ఎయిర్‌పోర్టు ఏరియాలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ రావాల్సిన.. ఇండిగో సంస్థకు చెందిన మూడు విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-వైజాగ్ విమానాలను హైదరాబాద్‌కి మళ్లించారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చే విమానాన్ని భువనేశ్వర్‌లో ల్యాండ్ చేశారు.

News December 7, 2024

నేడు విశాఖకు మంత్రి లోకేశ్ రాక

image

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖకు రానున్నారు. మధాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి రోడ్డు మార్గాన వెళ్తారు. ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనంలో పాల్గొంటారు.

News December 7, 2024

విశాఖ: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం చాటింగ్

image

విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతను భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని భర్త గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

News December 7, 2024

విశాఖ: అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్

image

విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.

News December 7, 2024

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

image

సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్‌ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.

News December 7, 2024

విశాఖ: డీప్ టెక్ సదస్సులో ఏడు ఒప్పందాలు

image

విశాఖ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన డీప్ టెక్ స‌ద‌స్సులో GFST(గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్)కు వివిధ కంపెనీల మ‌ధ్య ఏడు ఒప్పందాలు జ‌రిగాయి. విద్య‌, వైద్య రంగాల్లో టెక్నాల‌జీ, అడ్వాన్స్‌డ్ స్ట‌డీస్, మహిళా సాధికార‌త త‌దిత‌ర అంశాల‌పై GFSTతో స‌మ‌గ్ర‌, జీఎస్‌ఆర్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జ‌ర్మ‌న్ వ‌ర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు ఎంవోయూలు చేసుకుంది.

News December 6, 2024

విశాఖ: డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్

image

ఈ ఏడాది మార్చిలో ఎన్నికల వేళ విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్‌ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

News December 6, 2024

విశాఖ: వేటలో మేమే మేటి.. మాకు లేరు ఎవ్వరూ సాటి!

image

ఆహార సంపాదనలో పెద్ద పులులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటాయి. వేటాడే సమయంలో అణకువను ప్రదర్శిస్తూ ఓపికతో వేచి చూసి ఒక్క ఉదుటున ఇతర జంతువులపై దాడి చేసి చంపి తింటాయి. ఈ క్రమంలో వాటి ఓపికకు, సహనానికి సలాం కొట్టాల్సిందే. విశాఖ జూ పార్కులో చెట్టుపై కట్టిన మాంసాన్ని ఒక్క ఉదుటున లాక్కుని తింటున్న టైగర్ విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.