Visakhapatnam

News October 4, 2024

విశాఖ: ‘డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ’

image

మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పోలీస్ అధికారులు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. విశాఖలో గురువారం న్యూఢిల్లీకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో 50 మంది పోలీస్ అధికారులకు డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ మాటాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 4, 2024

విశాఖ జిల్లా TOP NEWS TODAY

image

* మాడుగుల నియోజకవర్గంలో 80 అడుగుల రోడ్డు.!
* ముంచింగిపుట్టులో గంజాయితో పట్టుబడ్డ మహిళలు
* ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్
* విశాఖ పోర్టు.. సరికొత్త రికార్డు
* విశాఖ: ఇన్ స్టా గ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్ట్
* డొంకరాయి జలాశయం వద్ద మొసలి హల్ చల్
* బుచ్చియ్యపేట: ఆవుల అక్రమ తరలింపు అడ్డగింత
* సీఎంతో భేటీ అయిన భీమిలి టీడీపీ ఇన్‌ఛార్జ్
* అల్లూరి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక

News October 3, 2024

విశాఖలో టెట్ పరీక్షకు 3439 మంది హాజరు

image

విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించినట్లు తెలిపారు.

News October 3, 2024

ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్

image

ఏయూలో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధిలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యం కోర్సుల్లో, ఆరు నెలలకు యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోగా దరఖాస్తు చేయాలి, 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. >Share it

News October 3, 2024

విశాఖ: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్‌కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్‌కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.

News October 2, 2024

అనకాపల్లి నగరానికి ఇదో ఆభరణం..!

image

ఏపీలో చెన్నై-కోల్ కతా నగరాలను కలిపే జాతీయ రహదారి నాలుగు వరుసలుగా ఉండేది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు వరుసలుగా ఇటీవల దానిని అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా కేంద్రం అనకాపల్లిని ఆనుకుని ఇలా తీర్చిదిద్దారు. పాము మెలికలు కనిపించే ఈ డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ కూడలి రాష్ట్రంలో ఇదే మొదటిది కావటం విశేషం.

News October 2, 2024

రాష్ట్రంలోనే విశాఖకు మొదటి స్థానం

image

స్వచ్ఛత హీ కార్యక్రమంలో విశాఖకు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం దక్కింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అవార్డును అందుకున్నారు. గత నెల 17 నుంచి నేటి వరకు నాలుగు రకాలుగా స్వచ్ఛత హీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యంతో విజయవంతమయ్యారని సీఎం కొనియాడారు. అవార్డు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తంచేశారు.

News October 2, 2024

విధుల్లోకి విశాఖ ఉక్కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

image

ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన 4,000 మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కార్మిక శాఖ అధికారి పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన వారిని యథావిధిగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ ప్రకటనలో అధికారి కోరారు. దీంతో కార్మికుల ఆందోళన కొంత మేరకు ఫలించింది.

News October 2, 2024

విశాఖ: హైకోర్టు ఆదేశాలతో రేషన్ డిపోల పునర్విభజనకు బ్రేక్

image

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల పునర్విభజనకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. జిల్లాలో రేషన్ షాపుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను రద్దు చేయాలని రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం తెలిపారు.

News October 2, 2024

విశాఖ జిల్లాలో 1,58,224 మందికి పెన్షన్ పంపిణీ

image

విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 97.39 శాతం పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 1,58,244 మందికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో 3వ తేదీన మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.