Visakhapatnam

News May 2, 2024

ఏయూలో లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్ కోర్సుకు దరఖాస్తులు

image

ఆంధ్ర యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికి లాజిస్టిక్స్ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్‌తో కలిపి ఈ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్‌లో రెండేళ్ల కోర్సును అందిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. జూన్ 18 చివర తేదీ.

News May 2, 2024

మీ ఓటు ఎక్కడుందో తెలియాలంటే..!

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటు వేయాలి అనుకునేవారు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సులభమైన విధానం ఏర్పాటు చేశారు. 1950 నెంబర్‌కు ఫోన్ చేసి ఓటరు పేరు, నియోజకవర్గంలో, ఓటర్ కార్డ్ నెంబరు చెబితే పోలింగ్ బూత్ వివరాలు అందిస్తున్నారు. అదేవిధంగా 0891-2590100‌కు ఫోన్ చేసినా సమాచారం అందిస్తారు. నిత్యం అందుబాటులో ఉండే ఈ కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని విశాఖ అధికారులు తెలిపారు.

News May 2, 2024

ఒకటి నుంచి ఏడు నియోజకవర్గాలకు ఎదిగిన విశాఖ

image

1952లో జరిగిన తొలి ఎన్నికల్లో విశాఖపట్నం 68,282 మంది ఓటర్లతో ఓకే అసెంబ్లీ స్థానంతో కలిగి ఉంది. నేడు విశాఖ 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఎదిగి నగరంలో 17 లక్షల మంది ఓటర్లు, జిల్లా వ్యాప్తంగా 20 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. విశాఖ నగరం తొలి ఎమ్మెల్యేగా తెన్నేటి విశ్వనాథం ఎన్నికయ్యారు. పునర్విభజన అనంతరం విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, గాజువాక, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలు వెలశాయి.

News May 2, 2024

ఎవరి హయాంలో విశాఖ అభివృద్ధి..?

image

2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. హుద్ హుద్ లాంటి విపత్తులను ఎదుర్కొని విశాఖను తాము అభివృద్ధి చేశామంటూ కూటమి అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ ముఖచిత్రాన్ని మార్చామంటూ వైసీపీ అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో విశాఖ అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి

News May 2, 2024

అరకు, అనకాపల్లిలో గడ్కరీ ప్రచారం

image

విశాఖ ఎయిర్ పోర్టుకు శుక్రవారం 10:45కు నితిన్ గడ్కరీ రానున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని సుందరనారాయణపురం హెలికాఫ్టర్‌లో వెళ్ళనున్నారు. ఉదయం 11:30కు అరుకు పార్లమెంటు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖకు హెలికాప్టర్లో చేరుకుని, సాయంత్రం 4:30కి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో నితిన్ గడ్కరీ పాల్గొంటారు. సాయంత్రం 6:15కు విశాఖ నుంచి బయలుదేరి నాగపూర్ వెళ్తారు.

News May 2, 2024

విశాఖ: కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కుమార్తె మృతి

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుమార్తె మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో పీఎం పాలెంలో నివాసం ఉంటున్నారు. కుమార్తె ప్రవర్తన నచ్చక తీవ్రమనస్తాపం గురై ఎలుకల మందు తాగారు. ఇది చూసి చిన్నారులు సైతం ఎలుకల మందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది.

News May 2, 2024

మే 11 నుంచి ఏయూ హాస్టల్స్ కు సెలవులు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలోని హాస్టల్స్ కు ఈనెల 11వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ జి.వీర్రాజు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు వసతి గృహాలను ఖాళీ చేసి, సెక్యూరిటీ గార్డులకు స్వాధీనం చేయాలని దాంట్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఈ వసతిగృహాలను కేటాయించే అవకాశం ఉంది.

News May 2, 2024

అనకాపల్లి: నేటి నుంచి మత్స్యకారుల జీవనభృతికి ఎంపిక

image

మత్స్యకారులకు చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం చెల్లిస్తున్న జీవన భృతికి ఎన్నికల కమిషన్ అనుమతితో గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిషేధ కాలంలో వారికి ప్రభుత్వం జీవనభృతిగా రూ.10 వేలు అందిస్తుంది.

News May 2, 2024

సింహాచలం: చందనోత్సవంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

image

సింహాచలం అప్పన్న బాబు చందనోత్సవ కార్యక్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని చందనోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అదనంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 2, 2024

విశాఖ: నోటా కోసం ప్రత్యేక ఈవీఎం 

image

విశాఖ జిల్లాలో దక్షిణ నియోజకవర్గం పోలింగ్లో కాస్త భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ బరిలో 16 మంది అభ్యర్థులున్నారు. నోటాతో కలిపి ఈ సంఖ్య 17కు చేరడంతో రెండు బ్యాలెన్స్ యూనిట్లను వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కో ఈవీఎం యూనిట్లో 16 మంది పేర్లు మాత్రమే పెట్టవచ్చు, నోటాకు మరొక యూనిట్ అవసరం ఏర్పడుతుంది. దీనితో దక్షిణ నియోజకవర్గానికి అదనంగా 284 బ్యాలెట్ యూనిట్లు కేటాయించారు.