India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ సెంట్రల్ జైలు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన ఎస్.కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్గా పనిచేసిన ఎం.వెంకటేశ్వర్లుపై జైలుశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జైలు లోపలకు గంజాయి వెళ్లడం, రాత్రి వేళల్లో ఫోన్లలో మాట్లాడించడం, శిక్షపడ్డ ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఘటనల నేపథ్యంలో వీరిపై వేటు వేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు.
అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై <<14787594>>పెట్రోల్ దాడి<<>> ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఇద్దరూ <<14788224>>ఆటోలో<<>> కూర్చొని మాట్లాడుతుండగా.. పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ను సీఎంవో తెలిపింది. ఈరోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 2024 డిసెంబర్ నెలలో నిర్వహించబోయే ఉత్సవాలను అధికారులు వెల్లడించారు.11న స్వర్ణ తులసీదళార్చనం, గీతాజయంతి, గ్రామ తిరువీధి, 12న స్వర్ణ పుష్పార్చనం, నృసింహ దీక్ష ప్రారంభం. 13నశ్రీ తాయార్ సన్నిధిని సహస్రనామార్చనం, కృత్తిక, తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం,14న శ్రీ స్వామివారి మాస జయంతి16న నెలగంటు జయంతి కార్యక్రమాల నిర్వహించనున్నారు.
విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలోని 43వ వార్డు శ్రీనివాసనగర్లో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసా బేగం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?
Sorry, no posts matched your criteria.