Visakhapatnam

News April 30, 2024

విశాఖ: నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు సీఈఓ ఎం.పోలినాయుడు తెలిపారు. ఈ సమావేశం తోపాటు ఒకటి నుంచి 7 వరకు స్థాయి సంఘాల సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలకు లోబడి సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిధ అంశాలపై ఎలాంటి చర్చ జరగదన్నారు. కేవలం హాజరైన సభ్యుల నుంచి సంతకాలు తీసుకుని సమావేశం ముగిస్తామన్నారు.

News April 30, 2024

టీడీపీ నుంచి సివేరి అబ్రహం సస్పెన్షన్

image

అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా.. అరకు సీటు ఆశించి భంగపడ్డ అబ్రహం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

News April 30, 2024

ఏజెంట్ల వివరాలు సాయంత్రంలోగా అందించాలి: కలెక్టర్

image

విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టరేట్లో సమర్పించాలని ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున సూచించారు. ఫారం- 8 ద్వారా రెండు సెట్ల వివరాలు అందజేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలు మే 8వ తేదీలోగా, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు మే 25 లోగా అందజేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.

News April 30, 2024

ఎన్నికల్లో హింసను ప్రోత్సహించకండి: అధికారులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు హింసను ప్రోత్సహించరాదని పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని నైతిక విలువలు, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం చిహ్నాల కేటాయింపులో భాగంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

News April 29, 2024

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నియామకం

image

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ నియమించిన 37 మందిలో ఉత్తరాంధ్ర వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, అల్లూరి జిల్లాకు చెందిన కె.భాగ్యలక్ష్మి ఉన్నారు. వీరు రాష్ట్రమంతా పర్యటిస్తూ రాజకీయ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ వైసిపి అధిష్టానం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది.

News April 29, 2024

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: శ్రీభరత్

image

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో అంబేద్కర్ కళాక్షేత్రం ఎస్సీ, ఎస్టీ సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లదని చెప్పారు.

News April 29, 2024

విశాఖపట్నం పార్లమెంటుకు 33 మంది పోటీ

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 33 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. పరిశీలనలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, సోమవారం వరకు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. గుర్తింపు పొందిన ప్రధాన పార్టీలకు చెందిన వారు నలుగురు, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 14 మంది, 15 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారని చెప్పారు.

News April 29, 2024

పెన్షన్ల కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు: కలెక్టర్

image

సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళనవసరం లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. మే 1న పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వికలాంగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు మంచానికి పరిమితమైన వారి ఇంటి వద్దకే పెన్షన్ నగదు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. జిల్లాలో 1,64,899 మంది పింఛన్దారులు ఉన్నట్లు తెలిపారు.

News April 29, 2024

విశాఖ: ఇకే గ్రామానికి చెందిన యువకులు మృతి

image

ఇటీవల గొడిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు ఫార్మా ఉద్యోగులు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఎస్.రాము రెండు రోజుల క్రితం మృతి చెందగా, ఎస్.పొట్టియ్య ఈ రోజు మృతి చెందారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News April 29, 2024

మే 1న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 1న పెందుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆ పార్టీ నాయకులకు సమాచారం అందింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్ బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభకు జన సేకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పెందుర్తి జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.