Visakhapatnam

News April 29, 2024

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ రీ షెడ్యూల్

image

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ కు సంబంధించిన కనెక్షన్ రైలు ఆలస్యంగా వస్తున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News April 29, 2024

విశాఖ: నేడు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

image

విశాఖ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సోమవారం సాయంత్రం 6 గంటలకు గుర్తులు కేటాయిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తులు కేటాయించిన అనంతరం నియోజకవర్గం కేంద్ర పరిశీలకులు అభ్యర్థులకు మార్గదర్శకాలు జారీ చేస్తారని అన్నారు.

News April 29, 2024

విశాఖ: జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా..!

image

విశాఖ జిల్లాలో తుది ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 20,12,373 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈనెల 21వ తేదీకి తుది ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరందరికీ మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇక కొత్తగా ఓటర్లను నమోదు చేయడం, తొలగింపు, దిద్దుబాటుకు అవకాశం లేదు. 

News April 29, 2024

విశాఖలో సీఎం జగన్ పర్యటన … షెడ్యూల్ ఇదే..!

image

సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.

News April 29, 2024

మే 1-5 లోగా పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

image

మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, తదితర ఫించనుదారులు 1,26,773 మంది, మెడికల్ ఫించన్లు పొందుతున్న వారు 1,121 మంది కలిపి 1,27,894 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గత నెలలో 99.18 శాతం ఫించన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈనెల కూడా ఫించన్లు పంపిణీ చేయాలన్నారు.

News April 29, 2024

ఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు 79.25% హాజరు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు విశాఖ జిల్లాలో 79.25% హాజరు నమోదైనట్లు మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు తెలిపారు. పరీక్షకు 9311 మంది దరఖాస్తు చేసుకోగా 7379 మంది హాజరయ్యారు. 1932 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. విశాఖ నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

News April 28, 2024

వాళ్ల మధ్య లవ్ ట్రాక్ ఉంది: షర్మిల

image

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. విశాఖ నగరం అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్ వద్ద రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీగా సత్యారెడ్డిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారని చెప్పారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.

News April 28, 2024

విశాఖ: 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు

image

విశాఖ జిల్లాలో ఎన్నికలకు 15 వేలమంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. జిల్లాలో 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడు విభాగాల్లో 110 బృందాలను నియమించామని చెప్పారు. మైక్రో అబ్జర్వర్, వీడియో గ్రాఫర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. కంట్రోల్ రూములను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

News April 28, 2024

ప్రతి ఒక్కరు ఓటు వేయాలి: కలెక్టర్ మల్లికార్జున

image

వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన 5K రన్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైజాగ్ వాలంటీర్లు, స్వీప్ అధికారులు, సాధారణ పౌరులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

News April 28, 2024

పెదబయలులో అర్ధరాత్రి దారుణ హత్య

image

అల్లూరి జిల్లా పెదబయలు మండల కేంద్రంలో శోభ హిమరాజు(33)ని అప్పారావు అనే నిందితుడు కత్తితో హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి శోభ హిమరాజు ఓ పెళ్లికి వచ్చి పెదబయలులో ఓ డాబాపై నిద్రిస్తున్నాడు. అదును చూసుకుని అప్పారావు కత్తితో మెడపై గాయపరిచాడు. క్షతగాత్రుడిని పాడేరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.