India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు ప్రభుత్వ వెబ్ సైట్ను సందర్శించాలన్నారు.
విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎన్నలేని సేవలు అందిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఏయూలో నిర్వహించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. సాంకేతిక సహాయాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో ఈనెల 26 నుంచి నిర్వహించే స్కూల్స్, జూనియర్ కళాశాలల క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దేముడు బాబు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఏయూ గ్రౌండ్లోను, రెజ్లింగ్ పోటీలు అల్లూరి జిల్లా కొయ్యూరులో జరుగుతాయన్నారు. 27న ఆనందపురంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథిలిన్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి.గౌర్ విష్ణు తేజ్లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.
విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన ఒక్క రోజుకే పరిమితమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆర్థిక సదస్సు ముగింపు అనంతరం విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అన్ని చేశామని మంగళవారం సాయంత్రం చేరుకోవలసిన మంత్రి అనివార్య కారణాలతో రాలేదని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో ప్రమాదం జరగడంతో షిఫ్ట్ ఇన్ ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్పి బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. గాయపడిన మల్లేశ్వరరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్గా, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు(టీడీపీ), ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా (జనసేన)తమ్మిరెడ్డి శివశంకర్ను నియమించారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి తీవ్ర అపచారం చేశారని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు, యాగాలు చేశారు.
ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 16న కౌన్సిలింగ్ జరిపి ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.
విశాఖ నగరం కంచరపాలెం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఊర్వశి జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వైపు బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు కిందపడగా.. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి కింద పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.