India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.
సింహాచలం శ్రీ వరహ లక్ష్మి నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాలాక్షి నగర్ సీత కొండ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. కమ్యూనిటీ గార్డులు గుర్తించి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుచ్చియ్యపేట మండలం పొట్టి దొరపాలెంలో రామాల అన్నపూర్ణ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు బి.రమణ ఫిర్యాదు మేరకు ఎస్సై డి ఈశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టానికి తరలించారు. అన్నపూర్ణకి తన భర్త సత్తిబాబుతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు. భర్తను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విశాఖ ఎంపీ స్థానానికి 39 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా 33 పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆమోదం తెలిపారు. అర్హత లేని ఐదు నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. ఒకదానిపై విచారణకు ఆదేశించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పరిశీలన ప్రక్రియ నిర్వహించారు.
అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి సారించామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే రహదారుల నిర్మాణం, రవాణా వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. ఓటర్లంతా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
విశాఖ నుంచి మలేషియాకు శుక్రవారం నుంచి విమాన సర్వీస్లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి రాత్రి 10గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 4.20 గంటలకు కౌలాలంపూర్ చేరుతుంది. కార్యక్రమంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏపీడీ ఎస్.రాజారెడ్డి, అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.కె.కుమార్ రాజా, ఓ.నరేష్ కుమార్, డీ.ఎస్.వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్కు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న APPGCET దరఖాస్తు గడవు మే 4వ తేదీతో ముగియనుందని కన్వీనర్ ఆచార్య జీ శశిభూషణరావు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. మచిలీపట్నం- విశాఖపట్నం (17219) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి మే 26 వరకు, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి మే 27 వరకు రద్దు అయినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.