Visakhapatnam

News November 27, 2024

పరవాడ ఘటనపై దర్యాప్తునకు అనకాపల్లి కలెక్టర్ ఆదేశం

image

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం రాత్రి లిక్విడ్ లీకేజ్ వల్ల 9 మంది కార్మికులు శ్వాస, దగ్గుతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. వీరిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన హెల్పర్ అమిత్ బుధవారం మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి వెంటిలెటర్ చికిత్స జరుగుతుందన్నారు.

News November 27, 2024

విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకరమైన బల్లులు స్వాధీనం

image

వైజాగ్ ఎయిర్ పోర్టులో అత్యంత ప్రమాదకరమైన బల్లులను కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు మూడు, వెస్ట్రన్ బల్లులు మూడు స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలిస్తుండగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు సంయుక్త తనిఖీల్లో విషయం వెలుగులోకి వచ్చింది.

News November 27, 2024

పరవాడ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు అమరావతి నుంచి ఆయన అనకాపల్లి జిల్లా అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైన ఘటనలో <<14723741>>ఒకరు మృతి<<>> చెందగా ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వారిని కేర్ క్రిటికల్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.

News November 27, 2024

కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభం

image

విశాఖ నగరం కైలాసగిరి పై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా నెలకొల్పిన అడ్వెంచర్స్ స్పోర్ట్స్-జిప్ లైనర్, స్కై స్కైలింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి 2025 నాటికి పూర్తవుతుందన్నారు.

News November 27, 2024

విశాఖ: ‘నా భర్తపై 20 కేసులు పెట్టారు’

image

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌పై 20 కేసులు పెట్టారని ఆయన భార్య ఇంటూరి సృజన అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భర్తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, స్టంట్ వేశారని విశ్రాంతి అవసరమని చెప్పినా వినడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టారో స్పష్టం చేయాలన్నారు.

News November 27, 2024

పరవాడ: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి

image

పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు CITU ఆరోపించింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో CPM అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, CITU ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 27, 2024

విశాఖ: చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్..

image

చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్‌కు పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆనందపురం మం. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న సుందరరావు, వెంకటేశ్వరరావు 2019 ఆగస్టులో విద్యార్థినులతో వీడియోలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై తోటి టీచర్‌లు MEOకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో జడ్జి ఆనందిని వీరికి ఏడాది జైలు శిక్ష విధించారు.

News November 27, 2024

IPLకు అనకాపల్లి జిల్లా యువకుడు.. నేపథ్యం ఇదే

image

అనకాపల్లి జిల్లా కుర్రాడు పైలా అవినాశ్‌ని IPL వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అచ్యుతాపురం మండలానికి చెందిన అవినాశ్ సత్యారావు, నాగమణిల చిన్న కొడుకు. వీరది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాగా అవినాశ్‌కు క్రికెట్‌ మీద ఉన్న మక్కువ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ రంజీల్లో సత్తా చాటాడు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తీసుకుంది.

News November 27, 2024

విశాఖలో మొదలైన రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి 

image

రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్‌ను గెలిపించాలని ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ విశాఖ రైల్వే ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బోనస్ కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ చేసిన పోరాట విజయాలను వివరించారు.

News November 26, 2024

విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటుపై సంతకాల సేకరణ

image

విశాఖ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు బెంచి సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్, న్యాయవాది ఐఎం.అహమ్మద్, కోకన్వీనర్ గుడిపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు అవశ్యకతపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మోహన్, ఐఎఎల్ రాష్ట్ర అద్యక్షులు సురేశ్ కుమార్ పాల్గొన్నారు.