India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధురవాడ పరిధిలో మారికవలసలో గల శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు చేసిన ఆర్తనాదాలపై ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షణం నివేదిక అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహశీల్దారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, 55 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.
రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి విశాఖ రానున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. బుధవారం ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటీ పార్కును సందర్శించి అక్కడ ఉద్యోగులు, నిపుణులతో భేటీ అవుతారు. అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరి విజయవాడ వెళతారు.
గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 పుట్బాల్ పోటీలకు ఎస్.రాయవరం జడ్పీ పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి సెలెక్షన్స్లో ఎస్.రాయవరం విద్యార్థినులు కావ్య, భార్గవి, వాహిని, వైష్ణవి, వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనలో మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరితగతిన అండర్ గ్రౌండ్ సిస్టం పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు. వివరాలకు ఏయూ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
23/9/2018 మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమును మవోయిస్టులు అతి కిరాతంగా చంపిన రోజు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ఇద్దరు నేతలను మావోయిస్టులు హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్ కుమార్ మంత్రిగా పనిచేయగా.. సివేరి కుమారుడు అబ్రహం గత ఎన్నికల్లో TDP తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి సస్పెన్షన్కు గురయ్యారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్లో ఈనెల 21న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తారు. సోమవారం వంద డబ్బాల విశాఖ డెయిరీ నెయ్యి(1500 కేజీలు) దేవస్థానానికి రానుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహశీల్దార్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో 8 మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని అనకాపల్లి జిల్లాకు, ముగ్గురిని అల్లూరి జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఎంబీ అప్పారావు, పీ.లచ్చాపాత్రుడు, ఎస్.రాణి అమ్మాజీ, కే.జానకమ్మ, ఎస్.రామారావు, ఏ.శ్రీనివాసరావు, కే.రమాదేవి, ఎస్.నాగమ్మ, వేణుగోపాల్, శ్యామ్ కుమార్, కే.జయ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.