Visakhapatnam

News April 25, 2024

విశాఖలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు మార్పు

image

మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పెందుర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌కు విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్‌ను ఉత్తర ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా నియమించారు.

News April 25, 2024

గాజువాక వైసీపీ అభ్యర్థి ఆస్తి రూ.10.54 కోట్లు

image

➤అభ్యర్థి పేరు: గుడివాడ అమర్ నాథ్
➤ ఆస్తుల మొత్తం : రూ.10.54 కోట్లు
➤ చరాస్తులు మొత్తం: రూ.3.40కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.6.91 కోట్లు
➤ కేసులు: 3
➤ అప్పులు: రూ.93.16 లక్షలు
➤➤2019లో ఆయన కుటుంబం ఆస్తి విలువ రూ.5.10 కోట్లు ఉండేది.

News April 25, 2024

గాజువాక టీడీపీ అభ్యర్థిపై మూడు కేసులు

image

గాజువాక TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13కోట్లు,చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్యదేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61,34 లక్షలు. అవిభక్త కుటుంబానికి రూ.20.26 కోట్లున్నాయి. అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై మూడు కేసులున్నాయి.

News April 25, 2024

బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ కార్యక్రమం

image

గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ సమగ్ర మిషన్ కార్యక్రమం ప్రారంభించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం చింతపల్లిలో అదనపు ఎస్పీ కే.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి చిట్టి కార్యక్రమం ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సులో గర్భం దాల్చి మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News April 25, 2024

కైలాసగిరిపై మరో రెండు రోజుల్లో రైలు సిద్ధం

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖ నగరం కైలాసగిరిపై సర్కులర్ రైలు మరో రెండు రోజుల్లో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు విఎంఆర్డిఏ అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ నెల నుంచి సర్కులర్ రైలు బాధ్యతలు విఎంఆర్డిఏ తీసుకుని నిర్వహిస్తుందన్నారు. అయితే సాంకేతిక సమస్యలు రావడంతో వార్షిక నిర్వహణకు వేరే ఏజెన్సీకి అప్పగించామన్నారు. మరమ్మతులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు.

News April 25, 2024

విశాఖ రైల్వే స్టేషన్‌లో రూ.20కే భోజనం

image

విశాఖ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్, స్నాక్ మీల్స్‌ను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీతో కలిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారి కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు రెండు రకాల మీల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్ మీల్స్ రూ. 50కు అందిస్తున్నారు.

News April 25, 2024

విశాఖలో పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

image

ఈనెల 27న నిర్వహించనున్న పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పాలిసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ కె.నారాయణరావు తెలిపారు. విశాఖ నగరంలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 9,511 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 11 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

News April 25, 2024

విశాఖ: ఎంవీవీ ఆస్తులు రూ.431 కోట్లు

image

విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులు రూ.431.30 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎంవీవీ దంపతులకు చరాస్తులు రూ.340.44కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య పేరుతో 1.2 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరిట రూ.80.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ఆయనకు రూ.18.72 కోట్లు, భార్య పేరుతో రూ.6.6 కోట్లు అప్పు ఉందని అన్నారు. ఆయనపై ఒక కేసు ఉంది.

News April 25, 2024

పాడేరు: గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 3 బాలికలు, 5 బాలుర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని పీవో అభిషేక్ సూచించారు. 2024 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

News April 25, 2024

జగన్ పాలనలో వెనుకబడిన ఆంద్రప్రదేశ్: రాజ్ నాథ్ సింగ్

image

సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో ర్యాలీగా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో 3,600 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. జగన్ వైఫల్యం వలన ఏపీ వెనుకబడి పోయిందన్నారు.