India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రక్షణ శాఖ మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్లో ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోరాట కమిటీ సభ్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు వీరు అడ్డు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ బుధవారం మాడుగుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వైసీపీ తరఫున అక్క ఈర్లె అనురాధ నామినేషన్ వేసిన విషయం తెలిసిదే. నామినేషన్ అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించేందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. తన నామినేషన్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం వినోదాత్మక సన్నివేశం జరిగింది. సింహాద్రి అప్పన్న ఉంగరం పోయింది.. ఎవరు తీశారంటూ.. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులను విచారించారు. కొందరు భక్తులు ఇది నిజమేననుకుని కంగారుపడ్డారు. చివరకు పట్టు వస్త్రాల్లో దొరికిందని ఆలయ అర్చకులు ప్రకటించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి భరత్ అనే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి మతుకుమిల్లి శ్రీ భరత్ పోటీ చేస్తుండగా.. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. మరి వీరిలో గెలిచి ‘భరత్ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేసేదెవరని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
విశాఖ ఉత్తర నియోజకవర్గ BJP అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, భార్య సీతాసుజాత ఉమ్మడి ఆస్తులు రూ.106.22 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తులు రూ.91.69 కోట్లు, చరాస్తులు రూ.2.90 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.5.72 కోట్లు ఉన్నాయి. భార్య పేరుతో రూ.10.14 కోట్లు స్థిరాస్తులు, రూ.1.49 కోట్లు చరాస్తులు,అప్పులు రూ.1.67 కోట్లు ఉన్నాయి. వీరికి వాహనాలు లేవు. ఆయనపై ఒక పోలీస్ కేసు ఉంది.
విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనులు కారణంగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ ను మే 27 వరకు, కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ ప్రెస్ మే 26 వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్ను తొలగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మరో ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లను, ఒక సోషల్ వర్కర్ ను సస్పెండ్ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్ నెంబర్లు, ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ నెంబర్లు సేకరించారన్న ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేసుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
రేపు తెల్లవారుజామున 4.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రైలు రాక ఆలస్యం వలన 7 గంటలు ఆలస్యంగా 11.20 గంటలకు విశాఖలో బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీని గమనించి ప్రధానంగా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సత్తిబాబు (35) మృతదేహం హైవేపై లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.