Visakhapatnam

News November 22, 2024

విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం

image

విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.

News November 22, 2024

అనకాపల్లి: ‘ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి’

image

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ డిసెంబర్ చివరినాటికి లక్ష గృహాలను పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశించారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 21, 2024

విశాఖలో ట్రాఫిక్ ఎస్‌ఐ, రైటర్‌ సస్పెండ్

image

విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎన్‌వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

News November 21, 2024

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రావికమతంలో కేసు నమోదు

image

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.

News November 21, 2024

విశాఖ డెయిరీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష

image

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ ముందు గురువారం రిలే నిరాహార దీక్షకు దిగారు. విశాఖ కో-ఆపరేటివ్ డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కేవివి మూర్తి, కార్యదర్శి ఎస్.రమణ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.21వేలకు పెంచాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా బోనస్, ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ పద్ధతిపై ఉన్న ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలన్నారు.

News November 21, 2024

5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

image

5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖలో ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

News November 21, 2024

వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహు

image

వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా గతంలో డీఆర్ఎంగా పనిచేసిన సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓ టెండర్ విషయమై అవినీతికి పాల్పడుతూ సీబీఐ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రైల్వే నూతన డిఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది.

News November 21, 2024

మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభం: లోకేశ్

image

మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున హోటళ్లు తీసుకొస్తామన్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

News November 21, 2024

ఐదు నెలల్లో 25,000 కిలోల గంజాయి స్వాధీనం: మంత్రి అనిత

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. గంజాయిపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడడం విచారించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు.

News November 21, 2024

గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్: హోం మంత్రి

image

రాష్ట్రంలో గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. దీని నియంత్రణకు టాస్క్ ఫోర్స్ తో పాటు యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేసి దానికి అడిషనల్ డీజీపీ ర్యాంక్ అధికారిని నియమించినందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.