Visakhapatnam

News April 20, 2024

అనకాపల్లి: పార్లమెంటుకు ఒకటి, అసెంబ్లీకి 5 నామినేషన్లు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం పార్లమెంటుకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఆడారి శరత్ చంద్ర నామినేషన్ వేశారు. చోడవరం నుంచి సూర్య నాగ సన్యాసి రాజు (టిడిపి), మాడుగుల నవ భారత్ నిర్మాణ సేవ పార్టీ నుంచి తాళ్ల రవి, నామినేషన్లు వేశారు. అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా ఆళ్ల సత్తిరాజు, ఎలమంచిలి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బి.అమాజమ్మ, కాంగ్రెస్ నుంచి సుందరపు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు

News April 20, 2024

జనసేనలో చేరిన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్

image

మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, దక్షిణ నియోజకవర్గ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే తమ ధ్యేయమని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, వార్డు అధ్యక్షుడు అర్జున్, నాయకులు పాల్గొన్నారు.

News April 20, 2024

విశాఖ: ‘ఎన్నికల వ్యయాలను ఖచ్చితంగా లెక్కించాలి’

image

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాల వివరాలను ఖచ్చితంగా లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, అందువలన వాటిపై ఏఈఓలకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.

News April 20, 2024

విశాఖ- బెంగళూరు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-బెంగళూరు-విశాఖ మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ-ఎస్ఎంవీ బెంగళూరు సమ్మర్ స్పెషల్ ట్రైన్ ప్రతి శనివారం విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు బెంగళూరు చేరుకుంటుంది. జూన్ 29 వరకు ఇది నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూరు నుంచి విశాఖకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. జూన్ 30 వరకు నడుస్తుంది.

News April 20, 2024

అయ్యన్న పాత్రుడిపై 17 క్రిమినల్ కేసులు

image

☞ అభ్యర్థి: అయ్యన్నపాత్రుడు☞ పార్టీ: టీడీపీ☞నియోజకవర్గం: నర్సీపట్నం☞ కేసులు: 17 ( క్రిమినల్ కేసులు)☞ చరాస్తులు: రూ.1.13 కోట్లు☞ స్థిరాస్తి రూ.5,04కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.79 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.10.8కోట్లు☞ భార్య పేరిట బంగారం: కేజీ☞ అప్పులు: రూ.2.86 కోట్లు➠ అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేయగా, అఫిడవిట్‌లో వివరాలను వెల్లడించారు.

News April 20, 2024

యలమంచిలి: రమణమూర్తి రాజు ఆస్తుల వివరాలు

image

☞ అభ్యర్థి: ఉప్పల పాటి రమణమూర్తిరాజు (కన్నబాబు రాజు)☞ కేసులు: క్రిమినల్ కేసులు లేవు☞ చరాస్తులు: రూ.16.05 కోట్లు☞ స్థిరాస్తి: రూ.20.67☞ అప్పులు: రూ.12.21 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.6.39 కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.8.17 కోట్లు☞ భార్య పేరిట అప్పులు: రూ.3.22 కోట్లు➠ ఈయన పేరిట సొంత కారు లేదని అఫిడవిట్‌లో తెలిపారు.

News April 20, 2024

ముంచంగిపుట్టు: ప్రిన్సిపల్‌కి ఐదేళ్ల జైలు శిక్ష

image

2018లో ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నరసింహమూర్తి ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఆమె జవాబు పత్రాలు మార్చేసి పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణమయ్యారు. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదైంది. విచారణ అనంతరం విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ప్రిన్సిపల్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.

News April 20, 2024

అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్న పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.

News April 20, 2024

విశాఖ: జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ని వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈరోజు ఉ.9 గంటలకు గొడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరి నక్కపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సా.3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

News April 20, 2024

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి: అబ్జర్వర్

image

ఏపీలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.