India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. విశాఖ ప్రజలు ఎక్కువగా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లిలో వివిధ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం వెళ్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా అనకాపల్లి వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ కామెంట్.

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మల్కాపురం ప్రకాశ్నగర్కు చెందిన ఆర్యన్ కుమార్ గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. హెచ్పీసీఎల్లో సూపర్వైజర్గా పని చేస్తున్న ఆర్యన్ కుమార్ ఇంటికి వెళ్తున్న సమయంలో అతివేగంగా స్కూటీపై వెళుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ రైల్వే ఉద్యోగితో ఇబ్బందులు పడ్డ బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా సోంబాబును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డీఆర్ఎం ఆఫీస్లో ఏసీ, టీవీలు తక్కువ ధరకు ఇప్పిస్తానని అక్కయ్యపాలెం ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, ఎలమంచిలి, దువ్వాడ ప్రాంతాల్లో కొందరిని మోసం చేశాడు. లోకో పైలట్ ఎంప్లాయ్ అని నకిలీ ఐడీ చూపించేవాడు. టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

రుషికొండ బీచ్ వద్ద గల సముద్రంలో మత్స్యకారుల వలలకు అరుదైన చేపలు చిక్కాయి. చేపల వేట కోసం మత్స్యకారులు గురువారం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో మత్స్యకారుల వలలోకి రెండు రకాల అరుదైన చేపలు చిక్కాయి. వాటిని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వారు తెలిపారు. ఒక్కోసారి సముద్ర పాములు వలకు చిక్కుతుంటాయని వారు పేర్కొన్నారు.

విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించారు. ఉడా చిల్డ్రన్ ఏరినాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో 14 మందికి మద్యం దుకాణాలను కేటాయించారు. వారిలో జీవీఎంసీ లిమిట్స్లో 11 మందికి, భీమిలి పరిధిలో ఒకరికి, పద్మనాభం పరిధిలో ఒకరికి, ఆనందపురం పరిధిలో ఒకరికి కేటాయించారు. జిల్లాలో 14 మద్యం దుకాణాలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి.

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని ఆ సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

➤ విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన నేతలు ➤ ఏప్రిల్ 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ➤ హనుమంతువాకలో యాక్సిడెంట్ ఒకరు మృతి ➤ మల్కాపురం పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ➤ ఏయూ వీసీతో నన్నయ్య యునివర్సిటీ వీసీ భేటీ ➤ విశాఖలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ➤ ఏయూను సందర్శించిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యురాలు

SEEDAP ద్వారా ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 14, 18, 28వ తేదీల్లో మైనారిటీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. 14న భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్, వీఎస్ కృష్ణ కాలేజ్, మార్చి 18న గాజువాక గవర్నమెంట్ ఐటీఐ, కంచరపాలెం పాలిటెక్నిక్, మార్చి 28న గాజువాక నాక్ సెంటర్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ, కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు esedap.ap.gov.in చూడాలి.

విశాఖలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ దుర్గా బజారుకు చెందిన బి.మణికంఠకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఫోన్ విషయంలో తండ్రి, కూతురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఫిబ్రవరి 24న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.