India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, స్టీల్ ప్లాంట్ సమస్య, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన విశాఖలో బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం విశాఖలో కాకుండా ఒడిశాలో గల బ్లూ ఫ్లాగ్ బీచ్లో నిర్వహించనున్నట్లు ఈస్ట్రన్ నావల్ కమాండ్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ను డీడీ నేషనల్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.
అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ఆదివారం R&B,ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతిభ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు అనకాపల్లి, చోడవరం, ఎస్.రాయవరం, రావికమతం, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర మండలాల నుంచి 100 మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు మార్గదర్శిగా నిలుస్తాయన్నారు.
తెన్నేటి విశ్వనాథం విశాఖ జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించారు. 1937లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన ఆయన.. విశాఖ-1 MLAగా, విశాఖ MPగా గెలుపొందారు. అరకులో కాఫీ మొక్కల పెంపకం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన గుర్తుగా విశాఖలో 2కాంస్య విగ్రహాలు, GVMC, పెద్దేరు రిజర్వాయర్కు ఆయన పేరు పెట్టారు. విశాఖలో తెన్నేటి పార్క్ అంటే తెలియనివారుండరు.
NOTE: నేడు ఆయన వర్థంతి
విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బీచ్ రోడ్డులో ఐకానిక్ తాజ్ గేజ్ వే హోటల్ స్థానంలో వరుణ్ గ్రూప్ దీన్ని నిర్మించనుంది. రూ.600 కోట్లతో 24 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్, హోటల్, స్టూడియో నిర్మిస్తారు. రూ.120 కోట్లతో తాజ్ గేట్ వే హోటల్ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈనెల 14 నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు వరించాయి. రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్గా ఎం.సురేంద్ర, కొప్పల వెలమ ఛైర్మన్గా PVG కుమార్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నాగేశ్వరరావు, AP కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా జి.బాబ్జి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్గా S.సుధాకర్, GCC ఛైర్మన్గా K. శ్రావణ్ కుమార్ VMRDA ఛైర్మన్గా ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు.
రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ గా అనకాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మళ్ల సురేంద్రను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేట్ పదవుల జాబితాలో సురేంద్రకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అవకాశం కల్పించిన చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జిని ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బాబ్జికి ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం వర్గం న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నామినేటెడ్ పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావును ఏపీ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రగడను పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో తప్పించారు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా జనసేన గెలుపుకు ప్రగడ సహకరించారు.
Sorry, no posts matched your criteria.