India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకులం-పట్నా -ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం దీనిని నడపనున్నట్లు తెలిపారు. ఇది దువ్వాడ మీదుగా పట్నా వెళుతుందన్నారు. అలాగే ఈనెల 22 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం పట్నాలో బయలుదేరి దువ్వాడ మీదగా ఎర్నాకుళం వెళుతుందన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలో ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ బీ-ఫారం అందుకున్నారు. బుధవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ బీ-ఫారంను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాదరావును తప్పించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు ఆసీటు కేటాయిస్తారని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో రేపు(గురువారం) మాడుగులలో బండారు పర్యటించనున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్, మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో కార్యకర్తల్లో చర్చ మొదలైంది. కాగా.. ఆ సీటుపై రేపో ఎల్లుండో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
సింహాచలం ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఈనెల 18 నుంచి మే 4వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు అన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 18 నుంచి ఈనెల 25 వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని తెలిపారు. 24న పుష్పయాగం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
మాకవరపాలెం మండలంలోని కొండల అగ్రహారంలో సినీ హీరో, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సోదరుడు సాయిరాం శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి ఆయన ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గణేష్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేగా రేపు(గురువారం) నామినేషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ.పాల్ తెలిపారు. బుధవారం రైల్వే న్యూకాలనీలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీ, తెలంగాణలో మోదీని వ్యతిరేకించే సత్తా ఉన్న ఏకైక పార్టీ వారిదే అన్నారు. పార్టీ గుర్తు హెలికాప్టర్కు బదులు కుండ ఇచ్చారని చెప్పారు.
యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో విశాఖకి చెందిన వేములపాటి హనిత 887 ర్యాంకుతో మెరిశారు. గతేడాది గ్రూప్-1లో రాణించి వైద్యారోగ్యశాఖలో కొలువు సాధించిన ఈమె ఏడాది తిరక్కుండానే సివిల్స్లో సత్తాచాటారు. మూడు ప్రయత్నాల్లో మెయిన్స్ వరకు వచ్చి ఆగిపోయిన హనిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు.
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. కణితి గవర వీధికి చెందిన ఎం.మణి (63) మంగళవారం మధ్యాహ్నం కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సైకిల్పై వెళ్లారు. తిరిగి వస్తుండగా వడ్లపూడి వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన విద్యార్థి సత్తా చాటారు. హుకుంపేట మండలంలోని అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో 545 ర్యాంకు సాధించారు. ఈమేరకు ఆయనను పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.