Visakhapatnam

News September 9, 2024

విశాఖ: రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

image

విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో సంబంధిత రౌడీ షీటర్లకు ఆదివారం సాయంత్రం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరవద్దని చెప్పారు. గొడవలకు వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలని కోరారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

News September 8, 2024

విశాఖ: తీవ్రవాయుగుండంగా మారనుందా?

image

కళింగపట్నానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణశాఖ అధికారుల తెలిపారు. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన వాయుగుండం చేరిందన్నారు. ఇది దాదాపు వాయవ్యంగానే పయనిస్తూ రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికే పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

News September 8, 2024

ఏయూ అనుబంధ కళాశాలలకు రేపు సెలవు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.

News September 8, 2024

విశాఖ: ‘ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య’

image

ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్.ఎన్ రాజు అన్నారు. ఈనెల 12న ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడే గుర్తించే అవకాశం యువతకు, కుటుంబ సభ్యులకు ఉంటుందని వెంటనే వారిని కాపాడాలని కోరారు.

News September 8, 2024

విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు

image

ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఎం.ఎన్. హారేంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే అల్లూరి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

News September 7, 2024

విశాఖ: ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్న నేపథ్యంలో ఏటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.

News September 7, 2024

అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీసాల సుబ్బన్న

image

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీసీ నూతన కమిటీలకు పిలుపునిచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్ సిఫార్సు చేసిన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో AKP జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మీసాల సుబ్బన్న నియమితులయ్యారు.

News September 7, 2024

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

image

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ అల్ప పీడనం కొనసాగుతున్నదని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం వివరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

News September 7, 2024

విశాఖ: మోదీ, చంద్రబాబు, పవన్ ఆకృతుల్లో వినాయకులు

image

విశాఖపట్నం 37వార్డులో వినాయకచవితి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆకృతుల్లో వినాయకులను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News September 7, 2024

విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులు

image

విశాఖ విమానాశ్రయం నుంచి కొత్తగా మరో 4 ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం సర్వీసులను నడపనుంది. సెప్టెంబర్ 21న విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. తర్వాత అక్టోబర్ 27న విశాఖ విజయవాడ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. అదేరోజు విశాఖ హైదరాబాద్ సర్వీస్ కూడా ప్రారంభిస్తారు. అలాగే విశాఖ అహ్మదాబాద్ కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసులు నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్‌ఛార్జులు కుమార్ రాజా, డీఎస్ వర్మ తెలిపారు.