Visakhapatnam

News November 9, 2024

విశాఖ: చిట్టితల్లి ఆరోజు నీతో తప్పకుండా మాట్లాడతా-మంత్రి లోకేశ్

image

అక్కయ్యపాలేనికి చెందిన బాలిక కీర్తి హాఫ్ శారీ ఫంక్షన్ ఈ నెలలో జరగనుంది. దీంతో ఆ బాలిక ఇన్విటేషన్‌ను ‘x’లో మంత్రి నారా లోకేశ్‌‌కు ట్యాగ్ చేస్తూ అంకుల్ నా ఫంక్షన్‌కు మీరు తప్పకుండా రావాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి లోకేశ్ స్పందిస్తూ.. ఇన్విటేషన్ పంపినందుకు థాంక్యూ చిట్టితల్లి. నేను ఆరోజు రాలేను గానీ తప్పకుండా నీతో ఫోన్‌లో మాట్లాడతా. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయమ్మ అంటూ రీ ట్వీట్ చేశారు.

News November 9, 2024

విశాఖ: ఇసుక నిల్వ కేంద్రం, రవాణా కోసం లాటరి

image

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానం సంబంధించి డిపోల ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ శుక్రవారం ఇచ్చారు. విశాఖ కలెక్టర్ ఆదేశాలు మేరకు జీవో విడుదల చేశారు. ఆసక్తి కలవారు భీమిలీ, ముడసర్లోవ, గాజువాకలో 4 ఏకరాల స్థలం కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 14వ తేదీలోపు రూ.5,000 డీడీ గనుల శాఖ కార్యాలయంలో చెల్లించాలన్నారు.

News November 9, 2024

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News November 8, 2024

అరకు: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బ్రోచర్ రిలీజ్ చేసిన హీరో

image

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమ బ్రోచర్‌ను అరకులోయలో షూటింగ్‌కి వచ్చిన హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. గంజాయి, సారా వంటి మాదకద్రవ్యాల నివారణకు, వాటితో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలను హీరో వెంకటేశ్ ప్రశంసించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు.

News November 8, 2024

ఏసీబీకి పట్టుబడిన తామరం వీఆర్వో

image

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తహశీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ తామరం వీఆర్వో లక్ష్మణరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. లక్ష్మణరావు తామరంతోపాటు భీమబోయినపాలెం, శెట్టిపాలెం రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అయితే భీమబోయినపాలెం రెవెన్యూలో భూమి ఆన్‌లైన్ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ అధికారులకు చిక్కాడు.

News November 8, 2024

నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి: MLC

image

ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ రీడింగ్ రూమ్, ఈ లెర్నింగ్ సెంటర్ను శుక్రవారం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు సందర్శించారు. గ్రూప్ 1&2, డీఎస్సీ,డిప్యూటీ ఈవో పోటీ పరీక్షల నిర్వహణ విషయమై అభ్యర్థులతో ఎమ్మెల్సీ ముఖాముఖి చర్చించి వారి అనుమానాలను నివృత్తి చేశారు. త్వరలో జరగబోయే ఈ పోటీ పరీక్షలకి ప్రణాళిక బద్ధంగా చదవాలని విద్యార్థులకు సూచించారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు.

News November 8, 2024

విశాఖ రైల్వే‌స్టేషన్‌లో వ్యక్తి మృతదేహం

image

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మణరావు (54) కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ట్రైన్ బాత్రూంలో మృతి చెందాడు. తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

News November 8, 2024

PHOTO: గుడ్ మార్నింగ్ వైజాగ్

image

సముద్ర చారలను చీల్చుతూ గుడ్ మార్నింగ్ అంటూ విశాఖ వాసులను సూర్యుడు పలకరిస్తాడు. బీచ్ రోడ్‌లో వాకింగ్‌కు వచ్చేవారికి ఈ అద్భుత దృశ్యం నిత్యం దర్శనమిస్తుంది. సముద్రం మధ్య నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్లుగా అనిపించే ఈ మనోహర దృశ్యం ప్రజల మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బంగారు వర్ణంతో సముద్రపు నీళ్లపై పడే సూర్యుడి కిరణాలు సముద్రాన్ని సైతం బంగారు వర్ణంతో మెరిసేలా చేస్తాయి.

News November 8, 2024

అనకాపల్లి: ఈనెల 11 నుంచి అందుబాటులో స్టేజ్-2 దరఖాస్తు

image

ట్రైనీ కానిస్టేబుల్ పోలీస్ నియామక ప్రక్రియలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్, ఎఫిషియెన్సీ పరీక్షలు 2024 డిసెంబర్ చివరివారంలో జరుగుతాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దీనికి సంబంధించి స్టేజ్-2 దరఖాస్తు ఫారమ్స్ నింపనివారి కోసం SLPRB వెబ్‌సైట్‌లో ఈనెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 8, 2024

అనకాపల్లి: ‘లిక్కర్ పాలసీని సక్రమంగా అమలు చేయాలి’

image

ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని అనకాపల్లి జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడికి, గుడికి దగ్గర్లో షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షాపులను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.