Visakhapatnam

News April 17, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సమీక్ష

image

ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో విశాఖ నుంచి కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కే మయూరి అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.

News April 16, 2024

విశాఖ: ‘రాష్ట్ర ప్రజలు కోడి కత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారు’

image

రాష్ట్ర ప్రజలు కోడికత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ రెడ్డిని ప్రజలు చీకొడుతుండడంతో ఏదో విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీ షో లా ఉందన్నారు. జగన్ రెడ్డి పై విసిరిన రాయి ఇంతవరకు దొరకలేదన్నారు.

News April 16, 2024

కోడ్ అమలుకు పటిష్ట చర్యలు: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లిఖార్జున పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలు, ప్రచారం, ఓటర్ల నమోదు, నామినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు.

News April 16, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించాలని వినతి

image

గంగవరం అదాని పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గత వారం రోజుల నుంచి కోల్ కోక్ సరఫరాను నిలిపివేసిందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల స్టీల్ ప్లాంట్ కు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

News April 16, 2024

టీడీపీలో చేరిన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు 

image

ప్రముఖ పారిశ్రామికవేత్త కొణతాల రఘునాథ్ మంగళవారం టీడీపీలో చేరారు. రఘునాథన్‌కు చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి కొణతాల రామకృష్ణ సోదరుడైన రఘునాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానికంగా చర్చనీయాశం అయ్యింది. 2014లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ పోటీ చేశారు.

News April 16, 2024

సైబర్ మోసాలు.. పుస్తకాన్ని ఆవిష్కరించిన విశాఖ పోలీసులు

image

ప్రజలు సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సైబర్ మోసాలు నివారణపై తెలుగు ఇంగ్లీష్‌లో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొరియర్ ద్వారా పార్సిల్ వచ్చిందని ఆగంతకులు ఫోన్ చేస్తే నమ్మవద్దని అన్నారు. మోసానికి ఎవరైనా గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News April 16, 2024

పాడేరు: ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. అరకు, పాడేరు, చింతపల్లి, విశాఖపట్నంలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్న 4,733 విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

News April 16, 2024

విశాఖ: గంజాయి రవాణా కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ విశాఖ మెట్రోపాలిటీ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ రాహుల్ రజాక్ 2019 ఆగస్టు 26న తన లారీలో 1,015 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష విధించారు.

News April 16, 2024

విశాఖ: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధురవాడ దుర్గానగర్ కాలనీలో నమ్మి శ్రీకాంత్ (43) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న శ్రీకాంత్‌కు 2009లో వివాహం అయింది. ఏడాది తర్వాత భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి మద్యానికి బానిస అయ్యాడు. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన పడక గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2024

జగన్ పాలనలో శాంతి భద్రతలు లోపించాయి: గండి బాబ్జి

image

రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు లోపించాయని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో రాయితో దాడి చేయడానికి ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సీఎం అయ్యాక దాడుల సంస్కృతి పెరిగిపోయిందన్నారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు.