Visakhapatnam

News April 16, 2024

అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అచ్యుతాపురం నుంచి ఫెర్రో కంపెనీకి వెళ్తున్న లారీ పశ్చిమబెంగాల్‌కి చెందిన ఆకుల బోరి అనే వ్యక్తిని ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు సెజ్‌లోని కంటైనర్లను ఉపయోగించే పరిశ్రమల్లో జల్లెడపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 16, 2024

విశాఖ: నేటి నుంచి కొత్త విమాన సర్వీసు ఏర్పాటు

image

విశాఖ- హైదరాబాద్ నూతన విమాన సర్వీసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11.40 గంటకు విశాఖలో బయలుదేరి 12.50 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అంతకముందు అదే సర్వీసు రాత్రి 9.35 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.00 గంటలకు విశాఖ వస్తుంది. విమానయాన ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.

News April 16, 2024

అనకాపల్లి: ‘వైసీపీ పాలనలో అంతులేని అవినీతి’

image

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమర్నాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

News April 15, 2024

అనకాపల్లి: ‘వైసీపీ పాలనలో అంతులేని అవినీతి’

image

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెం ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమరనాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

News April 15, 2024

గాజువాకలో 108 సూపర్వైజర్ ఆత్మహత్య

image

అల్లూరి జిల్లా పాడేరు 108 సూపర్వైజర్ ఇబ్రహీం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విధుల్లో ఉన్న సూపర్వైజర్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు గాజువాక వెళ్లారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదంతో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిగా.. అప్పటికే మృతి చెందాడు. 108 సిబ్బంది, ఉద్యోగులతో ఎంతో సఖ్యతగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పాప ఉన్నారు.

News April 15, 2024

పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు: బొత్స ఝాన్సీ

image

పేదలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్‌తో కలిసి కొత్తపాలెంలో సోమవారం ప్రచారం చేశారు. పొరపాటున చంద్రబాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని, అప్పుడు పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు అందిస్తారన్నారు. పేదల కోసం పాటుపడుతున్న జగన్‌ను గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు.

News April 15, 2024

విశాఖ: ఎన్నికల వ్యయం లెక్కలు పక్కాగా రాయాలి

image

ఎన్నికల వ్యయానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు పక్కా రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఆర్.వో., జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన రోజు నుంచి అభ్యర్థుల ఖాతాల్లో వ్యయానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తామని వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

News April 15, 2024

50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన నేడు

image

నాతవరం మండలంలోని చిక్కిడిపాలెంలో మన నేస్తం పేరిట 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు కేఎస్ఆర్ శర్మ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు.

News April 15, 2024

విశాఖ: అర్ధరాత్రి నుంచి నిలిచిన చేపల వేట

image

జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోయింది. ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు నిషేధం అమలులో ఉంటుంది. వేటకు విరామంతో ఆదివారం సాయంత్రానికి నూరు శాతం మరబోట్లు తీరానికి చేరుకున్నాయి. సముద్రంలో చేపల వేటపై పది వేల కుటుంబాలకు పైగా జీవిస్తుండగా.. హార్బర్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 వేల మంది ఆధారపడి ఉన్నారు. నిషేధ సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.

News April 15, 2024

విశాఖ: నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం

image

నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను 0891-2523408 నంబర్‌కు డయల్ చేసి తెలియపరచాలని సూచించారు. అనంతరం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు వృద్ధుల సమస్యలు, ఫిర్యాదుల కోసం సమయం కేటాయించడం జరిగిందని చెప్పారు.