Visakhapatnam

News April 14, 2024

పరవాడ: ‘ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలి’

image

పెందుర్తి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నానని ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలని వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ విజ్ఞప్తి చేశారు. పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. భర్నికం పంచాయతీ అభివృద్ధికి రూ.1.94 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.10.76 విలువ గల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు.

News April 14, 2024

అచ్యుతాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటకి  చెందిన రాము విద్యుత్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. కొండకర్ల ప్రైవేట్ రిసార్ట్‌లో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో భవనం పైనుంచి కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాముని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2024

దీని వెనుక మర్మమేమిటి: గంటా

image

చంద్రబాబు అరెస్టుకు ముందు హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన సీఎం జగన్ సన్నిహితుడు శ్రీధర్ రెడ్డి, సంచలనం జరగబోతుంది అంటూ ట్విట్ చేసినట్లు భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సరిగ్గా నాలుగు రోజుల కిందట అదేవిధంగా శ్రీధర్ రెడ్డి ట్విట్ చేసినట్లు పేర్కొన్నారు. దీని వెనుక మర్మమేమిటి అనే విషయాన్ని సీబీఐ తేల్చాలంటూ గంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News April 14, 2024

విశాఖ: ‘కొత్త డ్రామాకు తెరలేపిన జగన్’

image

సీఎం జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపినట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. కేవలం దోచుకోవడం ప్రతిపక్షాలపై దాడులు చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశాడన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశాడన్నారు.

News April 14, 2024

విశాఖ: ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు

image

పరవాడ మండలం మూల స్వయంభువరం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఉప్పునీటి తుంపర్లు కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటినుంచి తమను రక్షించే వరకు తాము అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

News April 14, 2024

విశాఖ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ

image

అచ్యుతాపురంలో ఈనెల 16న వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈమేరకు సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. అదేరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

News April 14, 2024

విశాఖ: టీడీపీలోకి అక్కరమాని విజయనిర్మల..!

image

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. VMRDA ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణపై ఓడిపోయారు.

News April 14, 2024

విశాఖలో కిడ్నాప్ కలకలం

image

వ్యక్తిని కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం క్యాబ్‌ బుక్ రుషికొండ బీచ్ రోడ్డులో బీజేపీ ఆఫీసు వద్ద దిగాడు. వెనుక కారులో ఐదుగురు ఆ వ్యక్తిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు తెలుస్తోంది.

News April 14, 2024

విశాఖ: ‘రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విశాఖ జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును పొందాలని కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. ఆఫ్ లైన్‌లో ఆదివారం అర్ధరాత్రిలోగా ఆన్లైన్‌లో, 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. 15 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అయితే అవి ఓటరు జాబితాలో ఉండే అవకాశం లేదన్నారు.

News April 14, 2024

అనకాపల్లి జిల్లాలో 12,79,685 మంది ఓటర్లు

image

ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావడానికి ఆదివారంతో గడువు ముగియనుంది. జిల్లా పరిధిలోని పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో కలిపి ప్రస్తుతం 12,79,685 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం తమ వివరాలను ఓటర్ల హెల్ప్ లైన్ యాప్, సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని డీఆర్ఓ దయానిధి సూచించారు.