India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను దువ్వాడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటకు చెందిన బి.వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న దోపిడి పథకాలను అమలు చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రన్న ఇసుక దోపిడి పథకం, చంద్రన్న మద్యం దోపిడి, చంద్రన్న విద్యుత్ దోపిడి, చంద్రన్న పింఛన్ల కోత పథకం, చంద్రన్న దీపం అర్హుల కోత పథకం, చంద్రన్న డూపర్ సిక్స్ పథకం, చంద్రన్న ఖనిజ దోపిడీ పథకాలను అమలు చేస్తుందని ధ్వజమెత్తారు.
AU లో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13 నుంచి జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను AU వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి.
నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. జూ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు జూ పార్క్కు కుటుంబాలతో సహా తరలివచ్చి పుట్టల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టల్లో గుడ్లు వేసి పాలు పోసి సందడి చేశారు. బాణసంచాను జూ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో కొందరు నిరాశ చెందారు.
సింహాచలం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేయించడం, పైఅంతస్తులు నిర్మించుకోవడం చెల్లదు. దీనిపై గతంలో కోర్టులు కూడా యథాతథస్థితిని ప్రకటించాయి. నిబంధనలు సడలిస్తూ దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. దీనిపై పంచ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీచర్ పోస్టులు అన్ని కేటగిరీల్లో కలిపి 734 ఖాళీలు ఉన్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటిలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో 625, మున్సిపల్ పాఠశాలల్లో 109 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ-తెలుగు) ఖాళీలు 205, ఉర్దూ 11 ఖాళీలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలను తాజా నివేదికలో పొందుపరచలేదు.
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను విశాఖ కలెక్టర్కు పంపించారు. 2021లో కేటాయించిన రూ.225 కోట్ల విలువచేసే 15 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చీడికాడ మండలం పెదగోగాడకి చెందిన <<14532774>>రెడ్డి సత్యనారాయణ<<>> మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇండిపెండెంట్గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1984లో టీడీపీలో చేరి మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడుగా సేవలందించారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. కాలినడకన, సాధారణ బస్సుల్లోనే ప్రయాణించేవారు. స్థానిక ప్రజలు ఆయనను సత్యం మాస్టారు అంటారు.
ఏయూ దూరవిద్యలో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిఏ, బికాం, బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో బిఏ, బీకాం,ఎంఏ,ఎంబీఏ,ఎంసీఏ తదితర కోర్సులో విద్యార్థులు ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.