India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు మాల్దీవుల ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్తో భేటీ అయ్యారు. విజ్ఞానయాత్రలో భాగంగా సోమవారం పెందుర్తి, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వారు పలు పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్తో సమావేశం అయ్యారు. పలు అంశాలపై ఆయనతో వారు చర్చించారు.
తుమ్మపాలలో మూడు రోజులపాటు జరిగిన 68వ SGF రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాల,బాలికల విభాగాల్లో విశాఖ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలుర ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, ప్రకాశం జట్టు ద్వితీయ, కృష్ణ జట్టు తృతీయ స్థానాలు సాధించింది. బాలికల ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, నెల్లూరు జట్టు ద్వితీయ, తూర్పుగోదావరి జట్టు తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ఏపీపీఎస్ కు సంబంధించి గ్రూప్ 1,2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చైర్ పర్సన్ అనురాధకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో ఆమెకు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హుల జాబితాను 1:100 నిష్పత్తికి పెంచాలన్నారు. గ్రూప్-2 మెయిన్ పరీక్షకు కనీసం 90 రోజులు వ్యవధి ఉండేలా చూడాలన్నారు.
చంద్రబాబు విశాఖ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి ఖండించారు. సోమవారం విశాఖ నగరం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్టార్ హోటల్స్లో సమావేశాలు నిర్వహించి ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. అమర్నాథ్ మంత్రిగా ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
సీతపాలెం వద్ద సముద్రంలో మునిగి ఆదివారం అభిరామ్(21) మృతిచెందాడు. పెందుర్తికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై సీతపాలెం తీరానికి వచ్చారు. వీరిలో సిరిగుడి అభిరామ్ ఒడ్డున రాళ్ల గుట్టలపై ఉండగా ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటానికి సముద్రంలో పడిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో మత్స్యకారులు కాపాడారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
గత ప్రభుత్వం గతంలో ఎక్కడాలేని విధంగా రుషికొండపై అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్మించుకున్నట్లుగా చెప్పడంపై మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలోని రుషికొండపై ఉన్న భవనాలను శనివారం సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ ఎమ్మెల్యేలు దగ్గరుండి సీఎంకు భవనాలను చూపించారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’ అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్సైట్లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.
విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
Sorry, no posts matched your criteria.