India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.
రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్స్ పై తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్కౌట్ గైడ్స్, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో సాధారణ బోగీలు వద్ద చల్లని తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విశాఖ జిల్లాలో ఈనెల 14 అర్ధ రాత్రి నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. చేపల పునరుత్పత్తి సమయంలో వాటి సంరక్షణకు ఏటా 61 రోజుల పాటు వేటను నిలిపివేస్తుంది. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ సమయంలో చేపలు వేటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం పాయకరావుపేట, గాజువాకల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.05కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి 2.10కు హెలికాప్టర్లో బయలుదేరి 2.35కు పాయకరావుపేట సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.40కు హెలికాప్టర్లో విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.35కు పాతగాజువాక చేరుకుంటారు. సా. 6 నుంచి 7.30 వరకు ఎన్నికల సభలో పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది హోం ఓటింగ్ పై అవగాహన కలిగి ఉండాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు సిబ్బందికి ఓటింగ్ విధానంపై నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు.
ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లని వెలుగులోకి తీసుకువచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్ క్రికెట్ లీగ్స్ నిర్వహిస్తామని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర మాజీ క్రికెటర్స్ రీయూనియన్ వార్షికోత్సవం సందర్భంగా మాజీ క్రికెటర్స్ క్రికెట్ ఆడారు. అనంతరం ఆంధ్ర మాజీ క్రికెటర్స్ ఆధ్వర్యంలో గోపీనాథ్ రెడ్డిని సత్కరించారు.
విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విశాఖ జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
విశాఖలో ఐఓబీలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ శంకర్రావు అప్పులు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. ఇతను క్రికెట్ బెట్టింగ్తో పాటు ఇతర వ్యవహారాల కోసం అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పించిన అన్ని పునరావాస సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, సమాజంలో ఉన్నత జీవనం సాగించాలని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆకాంక్షించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో 86 మంది మాజీ మావోయిస్టులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరిగి మావోయిస్టు పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి సహాయ సహకారాలు అందించడం కానీ చేయమని మాజీ మావోయిస్టులు ప్రతిజ్ఞ చేశారు.
Sorry, no posts matched your criteria.