India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.
పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాడ చీపురుపల్లి జడ్పీ హైస్కూల్ వెనుక తుప్పల్లో మృతదేహం లభ్యం అయింది. అబార్షన్ ద్వారా బయటపడిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు విడిచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహానికి చీమలు పట్టి ఉన్నాయి. వీఆర్వో రొంగలి హేమలత మంగళవారం రాత్రి పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
విజయవాడ పరిసర ప్రాంతాలలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు విస్తృత సేవలు అందిస్తున్నారు. సీఎండీ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సుమారు 60 మంది ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. వీరు 64 బృందాలుగా ఏర్పడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదిక మీద చేపడుతున్నారు.
విశాఖ రేంజి పరిధిలో 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐగా కె.పాపినాయుడును నియమించారు. కే.సంతోష్ను డుంబ్రిగూడ పీఎస్ నుంచి విశాఖ వి. ఆర్కు, సూర్యనారాయణను చోడవరం పీఎస్ నుంచి పాడేరు పీఎస్కు, కె.రమణను పెదబయలు పిఎస్ కు, పెదబయలు ఎస్ ఐ మనోజ్ను విశాఖ వీ.ఆర్కు బదిలీలు చేశారు.
తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పోస్టుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శక్తిమణి ఎంపికయ్యారు. ఈ పోస్ట్కు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఈడీ దీప్తెండు కూడా ఇంటర్వ్యూకి హాజరు కాగా అర్హతులను బట్టి శక్తిమణిని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రస్తుత సీఎండీ అతుల్భట్ నవంబర్లో రిటైర్ అవుతున్నారు.
వరదల కారణంగా ఈనెల 4వ తేదీన పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. నాందేడ్లో బయలుదేరే నాందేడ్-విశాఖ స్పెషల్, పాండిచ్చేరిలో బయలుదేరే పాండిచ్చేరి హౌరా స్పెషల్, సికింద్రాబాద్లో బయలుదేరే సికింద్రాబాద్-విశాఖ వందే భారత్, విశాఖలో బయలుదేరే విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
ఏయూ దూరవిద్యా కేంద్రం పరిధిలో ఈనెల 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈనెల రెండో తేదీన జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసామన్నారు అదేవిధంగా మూడో తేదీన జరగాల్సిన పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలు 5, 6 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 19న ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో గోడపత్రికను లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులు కనీసం ఇద్దరూ చొప్పున గ్రూప్గా ఏర్పడి 17లోగా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని అన్నారు.
వరదల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కావడంతో విశాఖ రైల్వే స్టేషన్ నిర్మాణుష్యంగా దర్శనమిస్తోంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ప్లాట్ఫారాలు సైతం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. విశాఖ నుంచి బయలుదేరే ప్రధాన రైలు అన్నింటిని అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడ ప్రయాణికులు చేసేదిలేక ప్లాట్ఫారాలపైనే ఆశ్రయం పొందుతున్నారు.
Sorry, no posts matched your criteria.