India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: విశాఖలో 38,818 మందికి గానూ 30,050 మంది(77%)..అనకాపల్లిలో 10,443 మందికి 5,442 మంది(52%).. అల్లూరిలో 5,623 మందికి 2,689 మంది (48%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: విశాఖలో 34,672 మందికి గానూ 29,258 మంది (84%).. అనకాపల్లిలో 9,248 మందికి 6,119 మంది(66%).. అల్లూరిలో 4,542 మందికి 3,172 (70%) మంది పాసయ్యారు.
➠ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విశాఖ జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 84 శాతంతో 4వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్లో 52 శాతంతో 24వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్లో 66శాతంతో 25వ స్థానంలో నిలిచింది.
➠ అల్లూరి సీతారామరాజు జిల్లా ఫస్ట్ ఇయర్లో 48 శాతంతో 26 స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్లో 70 శాతంతో 20వ స్థానంలో నిలిచింది.
కసింకోట మండలం బయ్యవరం సమీపంలో హైవే పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో గౌస్(12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెందుర్తి నుంచి పిఠాపురం కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ముస్లిం కుటుంబం ఆగిన నేపథ్యంలో వారిపైకి బస్సు దూసుకెళ్లింది. క్షతగాత్రులు అనకాపల్లిలో చికిత్స పొందుతున్నారు.
భీమిలి నుంచి పోటీపడుతున్న గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్(YCP)కి ఇప్పటివరకు ఓటమి తెలీదు. ఈసారి మాత్రం ఒకరికి ఓటమి తప్పదు. గంటా ఇప్పటి వరకు అనకాపల్లి ఎంపీ, చోడవరం, భీమిలి, విశాఖ నార్త్, అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, అవంతి రెండు సార్లు భీమిలి ఎమ్మెల్యేగా ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. మరి మొదటిసారి ఓటమి రుచిని వీరిద్దరిలో భీమిలి ఎవరికి చూపిస్తుందో కామెంట్ చెయ్యండి.
ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ఈనెల 7న పురుగుల మందు తాగిన గుర్తుతెలియని వ్యక్తి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై బి.లోవరాజు తెలిపారు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుడి ఊరు పేరూ తెలియదని పేర్కొన్నారు. బూడిద రంగు ఫ్యాంటు, బూడిద రంగు చొక్కా ధరించి ఉన్నట్లు ఎస్సై తెలిపారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు సాయంత్రం గాజువాక లంకా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి అనకాపల్లి వెళ్లి బస చేయనున్నారు. 15న అనకాపల్లి జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సమాచారం వచ్చిందని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు.
పలు రైళ్లును రీ షెడ్యూల్ చేసిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. నిజాముద్దీన్-విశాఖ(12808) ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 15, 18 తేదీల్లో ఒక గంట ఆలస్యంగా 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు. విశాఖ-భగత్ కీ కోఠి (18573)ను ఈనెల 18న 2గంటల 30నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు. నిజాముద్దీన్-విశాఖ12808) ఎక్స్ ప్రెస్ ఈ నెల 22న 2గంటల ఆలస్యంగా 9గంటలకు రీషెడ్యూల్ చేశారు.
భీమిలి మండలం తగరపువలసలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మజ్జి రాజేష్ కుమార్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోలేదు. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పేవాడు. గురువారం తరగతి గదిలో పాఠాలు చెబుతూ నోటి నుంచి నురగలు కక్కుకుంటు కుప్పకూలి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గురువారం సీపీఐ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు ఓట్లు రాకపోయినా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, పార్టీ నేత పైడిరాజు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.