Visakhapatnam

News November 2, 2024

విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

image

విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామ్మన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సుధీర్ఘ సమీక్ష చేశారు.

News November 2, 2024

పరవాడ: మహా యజ్ఞం మొదలైంది- హోంమంత్రి

image

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఆమె మహా యజ్ఞం మొదలైందని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

News November 2, 2024

పరవాడ: రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన సీఎం

image

పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో రహదారుల మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సిమెంటు పిక్కతో కలిపిన కాంక్రీట్ మిక్చర్‌ను స్వయంగా పారతో తీసి గుంతల్లో వేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News November 2, 2024

ఎవరినైనా ఇబ్బంది పెట్టామా: సీఎం చంద్రబాబు

image

విజయనగరం జిల్లాలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రోగ్రాం పరవాడకు మార్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాత్రి రాత్రికి ప్రోగ్రాం మార్చినా ఎక్కడైనా పరదాలు కట్టామా, చెట్లు కొట్టామా, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి అరెస్ట్ చేయించామా అన్నారు. రోడ్లు బాగోలేక RTC బస్సులను నిలిపివేశారని పేర్కొన్నారు. గుంతలతో ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మంచి రోజులు వచ్చాయని ఈ గ్రామం నుంచే మంచి రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

News November 2, 2024

సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు

image

వెన్నెలపాలెంలోని సభలో CM చంద్రబాబు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై మాట్లాడారు. పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా సంక్రాతి నాటికి రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని R&B మంత్రికి సూచించారు. YCP ఐదేళ్లలో రహదారులను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయన్నారు. ఈ రోడ్లు చూశాక గర్భిణీలకు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోడ్లపైనే డెలివరీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

News November 2, 2024

విశాఖ: నేడు రుషికొండ భవనాలను పరిశీలించనున్న సీఎం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రుషికొండకు చేరుకుంటారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి కలెక్టరేట్‌‌‌కు వెళతారు. అక్కడ సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.

News November 2, 2024

సింహాచలంలో వైభవంగా తిరువీధి ఉత్సవం

image

అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సింహాద్రి అప్పన్న ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా అలంకరించి వాహనంపై అధిష్టింప చేసి మాడవీధుల్లో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

News November 1, 2024

విశాఖలో క్రైమ్ ఎస్ఐను సస్పెండ్ చేసిన సీపీ

image

ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీశ్‌ను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సస్పెండ్ చేశారు. ఇదే సంఘటనపై ద్వారక క్రైమ్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ డి.బంగారుపాపపై శాఖపరమైన చర్యలకు మేజర్ పీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు 79950 95799 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీపీ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఇద్దరు ట్రాఫిక్ ఎస్ఐలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

News November 1, 2024

విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.

News November 1, 2024

పోయిన పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి: గంటా

image

గత ప్రభుత్వ హయాంలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ తన నివాసంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనున్నదని వెల్లడించారు. రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు.