India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్కు సర్వీస్ నడిపేందుకు ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ సిద్ధం అవుతుంది. ఈనెల 29వ తేదీన ఈ షిప్ విశాఖ చేరుకుంటుంది. రేట్లు, బెర్తింగ్, టైమ్స్ తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలో విశాఖ పోర్టుకు ది వరల్డ్ సంస్థ ప్రతినిధులు రానున్నారు. విశాఖ పోర్టు నుంచి 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇది బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్కు వెళుతుంది.
వచ్చే నెల 10న జరగనున్న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి అధికారిక ప్రొటోకాల్ పరిధిలోని వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. తొలిపావంచా నుంచి భక్తులను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి తరలిస్తారు. నగర పరిధిలోని ఆరు ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రొటోకాల్ వుండదు.
రుషికొండ బీచ్లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్కు చెందిన తేజ (20) గురువారం సాయంత్రం తన స్నేహితులతో రుషికొండ బీచ్కు వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో వారు స్నానాలకు దిగారు. పెద్ద కెరటం రావడంతో తేజా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డ్స్ గాలించినప్పటికీ తేజ ఆచూకీ లభ్యం కాలేదు. బ్లూకోర్టు పోలీసులు గాలిస్తున్నారు. తేజ ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా జిల్లాలో గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా గాజువాక నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన వివిధ కంట్రోల్రూమ్లను, అనుమతి జారీ కేంద్రాలను తనిఖీ చేశారు.
విశాఖపట్నం- బెనారస్ రైళ్ల మార్గం మళ్లింపు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఈ నెల 21న విశాఖపట్నం నుంచి బయలుదేరే (18311) విశాఖపట్నం-బెనారస్ ఎక్స్ ప్రెస్, ఈ నెల 22న బెనారస్ నుంచి బయలుదేరే (18312) బెనారస్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయనగరం- ఖుర్దా రోడ్- అంగుల్-సంబల్పూర్ సిటీ-జార్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు.
విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాజువాక మినహా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పురుష ఓటర్లు ఎక్కవగా ఉంటే.. 2024 నాటికి మహిళా ఓటర్లు వారిని అధికమించారు. లోక్ సభ పరిధిలో ఇప్పటి వరకు 19,03,175 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 9,36,667, మహిళలు 9,66,389, ఇతరులు 119 మంది ఉన్నారు.
విశాఖ తొట్లకొండ బీచ్ రోడ్డులో జరిగిన <<13024927>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతిచెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. చింతపల్లి వీరభద్ర అనే యువకుడు భీమిలి నుంచి బైక్పై విశాఖ వెళ్తున్నాడు. అదే సమయంలో రుషికొండకు చెందిన దౌలపల్లి చిన అప్పలరాజు రుషికొండ నుంచి ఉప్పాడ వైపు బైకుపై వస్తున్నాడు. వంతెన పాడైన కారణంగా వన్ వే దారిలో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
సంబల్పూర్ డివిజన్లో సబ్ వే పనులు జరుగుతున్న కారణంగా ఈనెల 13న టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ట్రైన్, నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 13 ఉదయం 5.15 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
అచ్చుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అచ్చుతాపురం-ఎలమంచిలి రోడ్డులో బైక్పై వెళుతున్న దుప్పుతురుకి చెందిన గొల్లపల్లి శేఖర్, అమలతో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. లారీ చక్రాల కింద మృతదేహం నుజ్జునుజ్జవ్వడంతో అతడి వివరాలు గుర్తించలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడుతున్నారు.
ఎండ తీవ్రతకు వన్యప్రాణులు జనావాసాల్లోకి వణ్యప్రాణులు వచ్చేస్తున్నాయి. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో తరచూ ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. విశాలాక్షి నగర్లో నిన్న ఓ కొమ్ముల దుప్పి రోడ్లపై సంచరించింది. వీటితో ప్రమాదం లేనప్పటికీ.. అధికారులు తగల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.