India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లూరి ఏజెన్సీ పరిధిలో గంజాయి పూర్తిగా నిర్మూలించామని అయితే ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి రవాణాకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు అటు ఒరిస్సా ప్రభుత్వానికి ఇటు తమపై అధికారులకు వివరాలు ఇచ్చామని, గంజాయి నిర్మూలించాలంటే ఒరిస్సాలో కూడా ఆంధ్రాలో చేపట్టిన గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
విశాఖ-విజయవాడ-విశాఖ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ను 2, 3వ తేదీల్లో రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ వెల్లడించారు. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ను ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు.. విశాఖ-గుంటూరు సింహాద్రిని 3 నుంచి 6వ తేదీ వరకు క్యాన్సిల్ చేశామన్నారు. గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ను 2 నుంచి 5 వరకు, రాయగడ-గుంటూరు రైలును 3 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేసినట్లు వివరించారు.
తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహిస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికుల టికెట్లపై నగదు రిఫండ్ చేయడానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే రద్దైన రైళ్లకు సంబంధించి సమాచారాన్ని తెలియజేసేందుకు విశాఖ, విజయవాడలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. 2న నాందేడ్-సంబల్పూర్ నాగవల్లి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ వందే భారత్(20707), విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20708) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20833), సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ (20834) ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దుచేశామన్నారు.
జిల్లాలో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ నదులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ రోడ్డుపై వరద నీరు ఉంటే చూసి రాకపోకలు సాగించండి
➤ మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండండి
➤ విశాఖ కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0002, అనకాపల్లి 08924 226599
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల లంబసింగి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై అడ్డుగా పెద్ద బండరాళ్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. JCB సాయంతో బండ రాళ్లను తొలగించారు. రాకపోకలను పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వర్షాల వల్ల పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆదివారం బయలుదేరాల్సిన విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ లోకమాన్య తిలక్, విశాఖ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, మహబూబ్ నగర్ విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్, సికింద్రాబాద్-హౌరా ఫలక్ నామాను రద్దు చేశారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ఆదివారం రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా ఈ ట్రైన్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో భారీ వర్షాల వల్ల ఆర్టీసీ విశాఖ రీజియన్ రూ.1.35 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. ప్రయాణికులు బాగా తగ్గడంతో ఆక్యుపెన్సీ, రోజువారీ ఆదాయం పడిపోయాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీ విశాఖ రీజియన్కు 72 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ.95 లక్షలు ఆదాయం వస్తుంది. భారీ వర్షాల కారణంగా బుధవారం రూ.70 లక్షలు, గురువారం రూ.65 లక్షలు, శుక్రవారం రూ.53 లక్షలు, శనివారం రూ.57 లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.