India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రేంజ్ పరిధిలో 15 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. అచ్యుతాపురం యూపీఎస్ సీఐ ఎం.బుచ్చిరాజును రేంజ్ వీఆర్కు, పాడేరు యూపీఎస్ సీఐ డీ.నవీన్ కుమార్ను అల్లూరి సీతారామరాజు జిల్లా సీసీఎస్కు, ఏఎస్ఆర్ జిల్లా సీసీఎస్ సీఐ వెలగాడ శంకరనారాయణను రేంజ్ వీఆర్కు, రేంజ్ వీఆర్లో ఉన్న పీ.పైడపునాయుడును కే.కోటపాడుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అకడమిక్ ఇయర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ఏయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ మోహన్ తెలిపారు. నవంబరు 15 వరకు ఫీజులు చెల్లించేందుకు గడువు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వాహన చోదకులారా.. తస్మాత్ జాగ్రత్త.. నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి అంటూ సిటీ పోలీస్లు అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తి గానీ, వాహనంపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు BIS మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించవలెను.
CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో జిల్లాలోని విద్య, వైద్య రంగ సేవలను మరింత విస్తృతం చేద్దామని విశాఖ కలెక్టర్ పేర్కొన్నారు. దీనికి పారిశ్రామికవేత్తలంతా మంచి మనసుతో ముందుకు రావాలని, పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులను వెచ్చించాలని సూచించారు. శనివారం వారితో కలెక్టరేట్లో సమావేశం అయ్యారు.
భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
జిల్లాలో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ నదులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ రోడ్డుపై వరద నీరు ఉంటే చూసి రాకపోకలు సాగించండి
➤ మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండండి
➤ విశాఖ కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0002, అనకాపల్లి 08924 226599
విశాఖ నగరంలో శనివారం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్ల పాలెంలో ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు కలెక్టర్ హరీంధర ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభారాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సెలవు ప్రకటించారు. కచ్చితంగా విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఎంఈఓ లు విద్యాసంస్థల మీద పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరో 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.