Visakhapatnam

News April 10, 2024

విశాఖ: మిల్లెట్స్‌తో రూపొందించిన మక్కా మసీదు

image

రంజాన్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో కళాకారుడు మొకా విజయ్ కుమార్ మిల్లెట్స్‌తో, మక్కా మసీదును రూపొందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో పోషక విలువలు కలిగిన మిల్లెట్స్‌తో తయారుచేసిన పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతోందన్నారు. మిల్లెట్స్‌పై అవగాహన కల్పించడానికి దీనిని రూపొందించడం జరిగిందన్నారు.

News April 10, 2024

విశాఖ బీచ్ రోడ్డులో ఇద్దరు యువకులు మృతి..!

image

విశాఖలోని తొట్లకొండ బీచ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతూ.. రెండు బైక్‌లు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఘటనకు సంబంధిచి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

image

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి ఏ.కె త్రిపాఠి తెలిపారు. 07165 నంబర్ గల హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 16,23,30 తేదీల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.05 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.45 కటక్ చేరుకుంటుంది. కటక్‌లో 17,24, మే1న 07166 నంబర్ గల రైలు అందుబాటులో ఉంటుందన్నారు.

News April 10, 2024

అన్నవరం నుంచి ప్రచారం ప్రారంభించిన గంటా

image

భీమిలి మండలం అన్నవరంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలో గల రామాలయంలో సతీసమేతంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని అన్నారు.

News April 10, 2024

విశాఖ జిల్లాలో నాలుగు ప్రభుత్వ పెట్రోల్ బంకులు

image

విశాఖ రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మల్లిఖార్జున నిర్ణయం తీసుకున్నారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నారు. మూడు మండలాల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థలాలను కూడా కేటాయించారు. గాజువాక మండలం చినగంట్యాడ, అగనంపూడి, ఆనందపురం మండలం కుసులవాడ, సీతమ్మధార మండల పరిధిలో రేసపువానిపాలెంలో స్థలాలు కేటాయించారు.

News April 10, 2024

విశాఖ: టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

image

విశాఖపట్నంకు చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ మంగళవారం టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News April 10, 2024

విశాఖ నుంచి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం

image

విశాఖపట్నం విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా సంస్థ తీపి కబురు అందించింది. మంగళవారం బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖకు 11.20 కి ఫ్లైట్ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ బయలుదేరి వెళ్తుంది. ఈ నేపథ్యంలో తొలి సర్వీస్ ప్రయాణికులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికారు.

News April 9, 2024

విశాఖలో అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

image

ఉమ్మడి విశాఖలో 2019 ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. భీమిలి-74.8, విశాఖ ఈస్ట్-63.7, విశాఖ సౌత్-60, విశాఖ నార్త్-63, గాజువాక-64.2, చోడవరం-82.8, మాడుగుల-82.9, అరకు-71.3, పాడేరు-61.9, అనకాపల్లి-77.4, పెందుర్తి-74.5, యలమంచిలి-85, పాయకరావుపేట-81.3, నర్సీపట్నం- 82.7 శాతం నమోదు కాగా, విశాఖ వెస్ట్-56.9 శాతం నమోదు అయ్యింది.

News April 9, 2024

విశాఖ-భవానిపట్నం రైలు రీ షెడ్యూల్

image

విశాఖ భవానిపట్నం మధ్య నడిచే పాసింజర్ స్పెషల్ ట్రైన్ మంగళవారం రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. లింకు ట్రైన్ ఆలస్యం అవుతున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు.

News April 9, 2024

విశాఖ: ఘనంగా పెళ్లి రాట మహోత్సవం

image

విశాఖ బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత ఆలయం అయిన అంబికా బాగ్‌లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సీతారాముల కళ్యాణానికి సంబంధించి పెళ్లి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని పెండ్లి కొడుకును చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.