India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబై నటి జత్వాని కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బాధితురాలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. విచారణ కోసం మహిళా అధికారిని నియమించినట్లు మంత్రి ప్రకటించారు. తప్పుచేస్తే అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. దిశ పీఎస్లను మహిళా పీఎస్లుగా వినియోగిస్తామన్నారు.
వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై గురువారం హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. మొబైల్ నుంచి https://ganeshutsav.net/ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చునని వివరించారు. శుక్రవారం నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తరువాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారన్నారు.
వివిధ కారణాలతో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ -భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చే నెల 2, 9 తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను వచ్చే నెల 3,10 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. నేడు బయలుదేరే ఒఖ-పూరీ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేటట్లు లేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నివాసంలో గురువారం గంటా మాట్లాడుతూ… వైసీపీలో ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఈ విషయాన్ని ముందే చెప్పానన్నారు. రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.
విశాఖ టీడీపీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే పి.శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి తదితరులు లోకేశ్ను కలిసిన వారిలో ఉన్నారు.
ఓ పత్రికపై పరువు నష్టం దావా కేసులో మంత్రి లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ పేరుతో ఆ పత్రికలో గతంలో కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంపై లోకేశ్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో పరువునష్టం దావా వేయగా.. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో వాదోపవాదనలు జరిగేవి. పలు కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 32 మంది ఎంపికయ్యారు. ఈనెల 31నుంచి తిరుపతిలో జరగ నున్న పోటీలకు వీరంతా జిల్లా నుంచి పాల్గొంటారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. అదేవిధంగా ఉమెన్స్ లీగ్ పోటీలు కూడా అదే తేదీల్లో తిరుపతిలో జరగనున్నాయన్నారు. ఈనెల 27న గాజువాకలో జిల్లాస్థాయి కాడెట్ క్యొరుగి, పూమేసే పోటీల్లో పలువురు పతకాలు సాధించారన్నారు.
విశాఖ నగరానికి చెందిన వృద్ద దంపతులు లక్ష్మీనారాయణ, ఎండమ్మను వారి ఇద్దరు కుమారులు గతేడాది రోడ్డుపై వదిలేశారు. జీవీఎంసీ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మమత వీరిని వృద్ధాశ్రమంలో చేర్చారు. లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. కాకినాడ, HYDలో ఉంటున్న ఇద్దరు కొడుకులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు లక్ష్మీనారాయణకు అంత్యక్రియలు జరిపించారు.
బచేలి, కిరండూల్ మార్గంలో భారీవర్షాల కారణంగా పలు రైళ్ల గమ్యాలను కుదించినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-కిరండూల్(08551) ప్రత్యేక పాసింజర్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి సెప్టెంబరు 4 వరకు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ(08552) పాసింజర్, కిరండూల్-విశాఖ(18513) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి సెప్టెంబరు 5 వరకు దంతెవాడ నుంచి నడుస్తుందన్నారు
విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చే నెల 14న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు సివిల్ చెక్ బౌన్స్ బ్యాంకింగ్ మోటార్ ప్రమాదాల నష్ట పరిహారం కేసులు, తగదాలు తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని అన్నారు. వివరాలకు 089-2560414 నెంబర్కు సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.