India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మన విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్కు టెస్ట్ టీమ్లోకి పిలుపువచ్చింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో నితీశ్కు చోటు దక్కింది. ఈ మేరకు సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఇటీవల టీ20 అరంగేట్రం చేసిన అతడు త్వరలోనే టెస్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్ట్లలో రాణించి జాతీయ జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు, విశాఖ వాసులు కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం కాఫీ అధికారులు, జీసీసీ అధికారులతో కాఫీ సేకరణపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి నిర్దేశించిన మేరకు, కాఫీ పళ్లను సేకరించాలని కాఫీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కాఫీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈనెల 27న విశాఖ బీచ్లోని ‘విక్టరీ ఎట్ సీ’ స్థూపంపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు GVMC అధికారులు ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ తరఫున అందరినీ ఆకట్టుకునేలా సౌండ్, లేజర్ షో ఉంటుందని అన్నారు. ఆదివారం సా.7 గంటలకు షో మొదలౌతుందని, 1971లో నౌకాదళం యుద్ధం, విశాఖ పాత్ర, యుద్ధవీరుల సాహసాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ప్రతీ ఆదివారం ఈ లేజర్ షోను వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను స్టేడియంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సెషన్లో ఆంధ్రా జట్టు, మధ్యాహ్నం సెషన్లో హిమాచల్ ప్రదేశ్ జట్టు నెట్ ప్రాక్టీస్ చేశాయి. రంజీ మ్యాచ్లను తిలకించేందుకు క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి గస్తీ నిర్వహించాలని పోలీస్ అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పరవాడలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో నిందితులు వాడినట్లు అనుమానిస్తున్న వాహనం లాంటిదే కేరళ రాష్ట్రం త్రిశూల్లో ఇదే రకమైన కేసులో పట్టుబడిందని అన్నారు. పీటీ వారెంట్ పై నిందితులను తీసుకొస్తామన్నారు.
విశాఖ హనీట్రాప్ నిందితురాలు జాయ్ జెమీయాను విచారణ కోసం కంచరపాలెం పోలీసులు జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ ముఠా ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. వారే ఈ ట్రాప్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆమె మీద కేసులు నమోదు చేశారు. ఆయా స్టేషన్ల పోలీస్ అధికారులు కూడా వచ్చి విచారిస్తున్నారు.
భారత్-సింగపూర్ దేశాల సింబెక్స్-2024 మారిటైం ద్వైపాక్షిక విన్యాసాలు ప్రారంభమైనట్లు విశాఖ తూర్పు నావికాదళం అధికారులు తెలిపారు. 1994లో మొదటిసారిగా ఎక్సర్సైజ్ లైవ్ కింగ్ పేరిట ఈ రెండు దేశాల మధ్య సముద్ర విన్యాసాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం వరకు హార్బర్ ఫేజ్లో 28, 29 తేదీల్లో సీఫేజ్లో విన్యాసాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో సింగపూర్కు చెందిన ఆర్ఎస్ఎస్ టినాసియస్ పాల్గొంటుంది.
విశాఖ డెయిరీ యాజమాన్యానికి భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్ గురువారం నోటీసులు జారీ చేశారు. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో సుమారు 7.95ఎకరాల ప్రభుత్వ భూమిని డెయిరీ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీవో శుక్రవారం ఉ.11 గంటలకు భీమిలి ఆర్డీవో కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సంబంధిత అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు.
వచ్చే రబీ సీజన్కు సంబంధించి పంటల భీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సూచించినట్లు అనకాపల్లి జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం పంటల బీమాపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇతరుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా ప్రీమియం కట్టుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న పీజీ డిప్లమో ఇన్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ ఆన్లైన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును నవంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ఆచార్య డీఏ. నాయుడు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 7వ తేదీ ఉదయం కౌన్సెలింగ్కు హాజరుకావాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.