India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 29న విశాఖపట్నం రానున్నారు. ఉదయం 10 గంటలకు దిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు చెందిన నేవల్ బేస్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 01.45 గంటల వరకు అక్కడ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.
విశాఖకు చెందిన 101 ఏళ్ల నేవీ కమాండర్ వి.శ్రీరాములు వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా చాటి మూడు కేటగిరిలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఆయన మంగళవారం విశాఖ చేరుకున్నారు. స్వాతంత్ర్యానికి ముందే రాయల్ ఇండియన్ నేవీలో చేరిన శ్రీరాములు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం భారత నావికాదళంలో అధికారిగా చేరారు. కళాశాల రోజుల నుంచి క్రీడాకారుడైన శ్రీరాములు అథ్లెటిక్స్లో పాల్గొనేవారు.
విశాఖ స్టీల్ ప్లాంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య మంగళవారం హైడ్రాలిక్ లూబ్రికేట్ ఆయిల్ గ్రీజు సరఫరాపై ఎంఓయూ జరిగింది. ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం సమావేశ మందిరంలో 2024-29 వరకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ప్లాంట్ డైరెక్టర్ ఏకే బాగ్చీ, లూబ్స్ ఈడీ ఆర్.ఉదయ్ కుమార్, ప్లాంట్ సీజీఎం శ్రీధర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రంపాలెంలో బోర అన్నపూర్ణ (37) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. నాలుగేళ్ల కిందట ఆమె కుమారుడు నిఖిల్ అనారోగ్యంతో మృతి చెందగా అప్పటినుంచి మానసిక వేదనతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ రానున్నారు. విజయవాడ నుంచి విమానంలో రాత్రి 9.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రామ్ నగర్లోని టీడీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ బస చేస్తారు. 29న ఉదయం 9.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 6.30 గంటలకు నోవాటెల్ హోటల్కు వెళ్తారు. రాత్రి 9 గంటలకు రామనగర్ ఎన్టీఆర్ భవనానికి చేరుకొని అక్కడ బస చేస్తారు.
విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. మొత్తం 250 సీట్లలో అఖిల భారత కోటాలో 37 సీట్ల భర్తీకి మంగళవారం మొదట విడత కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీలోగా అఖిలభారత కోటా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 85 సీట్లను రాష్ట్ర కోటా కింద డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భర్తీ చేస్తుందన్నారు.
భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘INS అరిఘాత్’ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించింది. ప్రధాని మోదీ సెప్టెంబరు తొలివారంలో దీన్ని జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం విశాఖ రానున్నట్లు సమాచారం.
ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం చాలా ముఖ్యమైందని, నర్సరీల నుంచి సకాలంలో మొక్కలు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. కడియం నుంచి మొక్కల సరఫరా సరిగా లేదని, రానున్న సంవత్సరం నుంచి వారి దగ్గర మొక్కలు కొనేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగానే నర్సరీల ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.
సింహాచలం ఆలయ సమీపంలో భైరవకోన వద్ద భక్తులకు కనీస వసతులు కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆలయ ఈవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ఈవో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి భైరవకోన స్థితిగతులు, భక్తుల రద్దీ గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులపై వారికి సూచనలు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రంలో వచ్చే నెల 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు 202 క్యాంటీన్లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ సప్లయ్ చేసేవారు అవసరమైన వాటిని సమకూర్చుకునేందుకు సమయం అడిగినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో మిగిలినవి ప్రారంభిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.