India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10, ITI వరకే చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు <<14419916>>పాలిటెక్నిక్ కోర్సు <<>>పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. విశాఖ గవర్నమెంట్ కెమికల్ ఇన్స్టిట్యూట్లో కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు, అచ్యుతాపురం ప్రశాంతి కాలేజ్లో సీఈ, ఎంఈ కోర్సులు, విశాఖలో బెహర శుభాకర్ కాలేజ్లో ECE,EEE,ME కోర్సులు అందుబాటులో ఉన్నాయి. >Share it
ఐటిఐల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ ఒక ప్రకటన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 28న ప్రభుత్వ ఐటీఐలకు, 30న ప్రైవేటు ఐటీఐలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కళాశాలలో కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు.
క్షణికావేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం..నీపై ఆశలుపెట్టుకున్న వారిని జీవితాంతం వేధిస్తుందని గుర్తు పెట్టుకో. నచ్చిన ఫోన్ కొనివ్వలేదనో.. పార్టీకి డబ్బులివ్వలేదనో.. నీ ప్రేమను అంగీకరించలేదనో ప్రాణం తీసుకుని కన్నపేగుకు కడుపుకోత మిగల్చొద్దు. వంటమాస్టార్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తండ్రి బర్తడే పార్టీకి డబ్బులివ్వలేదని నిన్న విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కోటవురట్ల సమీపంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు కాకర కొండబాబు (50) మృతి చెందాడు. కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన కొండబాబు పొలానికి వెళ్లి యూరియా చల్లుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నట్లు ఆయన సోదరుడు కుమార్ తెలిపారు. నిరుపేద అయిన కొండబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని స్థానికులు కోరారు.
కశ్మీర్ మారథాన్లో అల్లూరి జిల్లా యువకుడు మెరిశాడు. ఈ నెల 20న కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ & కశ్మీర్ టూరిజం కలిసి నిర్వహించిన 42 కి.మీ. అంతర్జాతీయ కశ్మీర్ మారథాన్లో అరకులోయ మండలం గరడగూడకు చెందిన కిల్లో బుద్దు ప్రతిభ కనబరిచారు. 2000 మంది పాల్గొన్న ఈ మారథాన్లో కిల్లో బుద్దు 9వ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఒక మేజర్, 3 మీడియం, ఒక మైనర్ నీటి ప్రాజెక్టు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో సాగునీటి వనరుల కింద ఉన్న 303 సాగునీటి సంఘాలకు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఆర్జీలు ఎస్పీకి అందజేశారు. ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. వేగవంతంగా సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో రుషికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను పరిశీలించనున్నట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఈ ప్యాలెస్ నిర్మాణంపై వైసీపీ.. కూటమి పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.
విశాఖలోని విమ్స్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు సోమవారం ప్రకటన విడుదల చేశారు. శిబిరం నందు రొమ్ము క్యాన్సర్ నిర్ధారించే పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. >Share it
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. వాయవ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. ఈ తుఫానుకు ‘దానా’ అని నామకరణం చేశారు. ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.