Visakhapatnam

News April 6, 2024

విశాఖ: మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

image

మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాలిపేటలోని పాడుబడిన భవనంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ శ్రీనివాస్ జగదాంబ జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో భార్య లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2024

ఈనెల 8న అచ్యుతాపురంలో వారాహి యాత్ర

image

అచ్యుతాపురంలో ఈనెల 8వ తేదీన నిర్వహించే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్, టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు పిలుపునిచ్చారు. మండలంలో లాలం కోడూరు గ్రామంలో వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఈ సభకు హాజరుకావాలని కోరారు. జనసేన- బీజేపీ- టీడీపీలకు చెందిన వారందరూ పాల్గొంటారని తెలిపారు.

News April 5, 2024

గాజువాక వైన్ షాప్‌లో చోరీ.. నిందితుడు అరెస్టు

image

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ రైల్వే గేట్ వద్ద గల గవర్నమెంట్ వైన్ షాపులో ఈనెల 18న చొరబడి రూ.5,50,580 నగదును దొంగిలించిన మిత్తిరెడ్డి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.2,85,00 నగదు రూ.38 వేల విలువగల మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

News April 5, 2024

అల్లూరి జిల్లాలో జోరుగా పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

సామాజిక పింఛన్ల పంపిణీలో అల్లూరి జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. శుక్రవారం నాటికి జిల్లాలో ఉన్న 1లక్ష 27వేల 894 పింఛనుదారులకు గాను 1లక్ష 20వేల 825మందికి పింఛను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 94.47 శాతం పింఛను పంపిణీ పూర్తయిందన్నారు. ఈమేరకు పింఛను పంపిణీ ఇన్చార్జి అధికారులు జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తదితర అధికారులను అభినందించారు.

News April 5, 2024

విశాఖ: ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వీవీ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. భీమిలి-ఎల్లిపిల్లి అనిల్ కుమార్, విశాఖ పశ్చిమ- జగ్గుమంత్రి వెంకట గణేష్, అనకాపల్లి- కె.సురేష్ బాబు, పెందుర్తి- కేఎంకే శ్రీకాంత్, ఎలమంచిలి- డి.పూర్ణచంద్రరావు, అరకు-ఉపేంద్ర పోటీ చేస్తారు.

News April 5, 2024

విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తా: కేఏ పాల్

image

విశాఖలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ-టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశాయన్నారు. రుషికొండలో కొండను మాయం చేశారని పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు.

News April 5, 2024

విశాఖ: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపాలెంలో గురువారం ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్కోజు హేమంత్ కుమార్ (38) గురువారం మధ్యాహ్నం ఇంటి లోపల గడియ పెట్టుకున్నాడు. రాత్రి అవుతున్నా బయటకు రాకపోవడంతో తల్లి స్థానికుల సాయంతో తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన మృతికి ఎవరు కారణం కాదని సూసైడ్ లెటర్ రాసి పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 5, 2024

గోపాలపట్నం: ఎండ వేడి తాళలేక వృద్ధుడి మృతి

image

జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్‌కి చెందిన తీడ బాబూరావు (65) కాకినాడలోని తన సోదరుడి వద్ద ఉంటున్నాడు. విశాఖలోని వార్డు సచివాలయం(482) పరిధిలో ప్రతి నెలా పింఛను పొందుతున్నాడు. ఈనెల పింఛను కోసం గురువారం కాకినాడ నుంచి విశాఖ వచ్చి, గోపాలపట్నంలోని సచివాలయం వద్దకు వెళ్తున్నాడు. ఇంతలో బీఆర్టీఎస్ రోడ్డులో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

మాధవధార: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

పాత ఐటీఐ హ్యాపీ హోమ్స్‌లో నివాసం ఉంటున్న వరాహ గిరి మురళీధర్ (19) ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. కొద్దిరోజులుగా సక్రమంగా చదవలేక పోతున్నానని మనస్తాపం చెందాడు. గురువారం సాయంత్రం ఫోన్లో మాట్లాడతానని అపార్ట్మెంట్‌పై అంతస్తుకు వెళ్లి కిందకు దూకేశాడు. స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న అతడిని KGHకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు కంచరపాలెం పోలీసులు తెలిపారు.