Visakhapatnam

News August 26, 2024

పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు: హోం మంత్రి

image

ఇకపై పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల భద్రతను గాలికి వదిలి వేసినట్లు పేర్కొన్నారు.

News August 26, 2024

విశాఖ: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

విశాఖ ప్రభుత్వ మహిళ కళాశాలలో 10 పీజీ కోర్సుల్లో ఏపీపీజీ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్  మంజుల తెలిపారు. ఎకనామిక్స్, ఎంకామ్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బాటనీ, మైక్రో బయాలజీ, సైకాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు కాలేజీలో సంప్రదించాలని కోరారు.

News August 26, 2024

పారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ కోచ్‌గా విశాఖ వాసి

image

పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్‌గా విశాఖకు చెందిన మురళీకృష్ణ వ్యవహరించనున్నారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పలు అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే బ్యాడ్మింటన్ జట్టుకు మురళీకృష్ణ కోచ్‌గా సేవలు అందించనున్నారు. కోచ్‌గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు.

News August 26, 2024

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశారు. కృష్ణాష్టమి పండగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రజలు గమనించాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

News August 25, 2024

అనకాపల్లి: 29న జాతీయ క్రీడా దినోత్సవం

image

ఈనెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రమణ తెలిపారు. ఈనెల 26 నుంచి క్రీడలతో పాటు వ్యాసరచన తదితర అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పోటీలను పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల స్థాయిలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.

News August 25, 2024

విశాఖలో నగరవనం అభివృద్ధి చేస్తాం: పవన్ కళ్యాణ్

image

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లో నగర వనాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్: బొర్రా గుహలకు నూతన హంగులు

image

స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా రూ.29.87 కోట్ల నిధులతో <<13936416>>బొర్రా గుహల<<>>ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్, కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్, సందర్శకుల కోసం ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రదేశంలో నడకదారి అభివృద్ధి, గుహల ముందు సందర్శకులు కూర్చుని వీక్షించే ఏర్పాట్లతో పాటు ఎక్కడికక్కడ సూచిక బోర్డులు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు.

News August 25, 2024

విశాఖ: ఎసెన్షియాలో భారీగా సాల్వెంట్ నిల్వలు

image

అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీ రియాక్టర్లలో ఇంకా 700 లీటర్ల సాల్వెంట్ నిల్వలు ఉన్నట్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు గుర్తించారు. వాటిని నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తగా బయటకు పంపించాలని వారు కంపెనీ యాజమాన్యానికి సూచించారు. ప్రమాదాల నివారణ కు మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సలహా ఇచ్చారు. కంపెనీ విధిగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్ పథకం కింద బొర్రా ఎంపిక

image

ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు నూతన రూపు సంతరించుకోనున్నాయి. స్వదేశీ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో బొర్రా గుహలను ఎంపిక చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. బొర్రా రైల్వే స్టేషన్ మొదలుకొని లోపలికి వెళ్లే అన్ని ప్రదేశాలను ఆధునీకరిస్తారు. గుహల లోపల విద్యుత్ వెలుగుల ఏర్పాటు, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

News August 25, 2024

విశాఖ: ‘డిజైన్ లోపంతోనే భారీ ప్రమాదం’

image

అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్ నిర్వహణతో పాటు డిజైన్‌లో లోపాలే పెద్ద ప్రమాదానికి కారణమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎం.ప్రతాప్ తెలిపారు. పరిశ్రమల తనిఖీల్లో సరైన విధానం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నారు. నిపుణులైన కార్మికులను నియమించుకోవడం, ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునన్నారు.