Visakhapatnam

News April 4, 2024

పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 4, 2024

మునగపాక: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ములబంద గోడీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాడి వెంకట అప్పారావు (57) పొలంలోని చెరకు క్రషింగ్ పూర్తి కావడంతో క్రషర్, బెల్లం పెనాన్ని బుధవారం సాయంత్రం తన కుమారుడు చందు, మరో రైతు ఆడారి చిన అప్పారావు సహాయంతో శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగకు పెనం తగిలింది. దీంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో వెంకట అప్పారావు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 3, 2024

విశాఖ: షిప్ యార్డ్‌ను సందర్శించిన ఈఎన్‌‌సీ చీఫ్ 

image

తూర్పు నావికాదళపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం హిందుస్థాన్ షిప్ యార్డ్ ను సందర్శించారు. షిప్ యార్డ్ సిఎండి కమడోర్ హేమంత్ ఖాత్రి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో హెచ్ఎస్ఎల్ చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వివరించారు. అలాగే సంస్థ విస్తరణకు సంబంధించిన విశదీకరించారు.

News April 3, 2024

అల్లూరి: లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. బాలిక మృతి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ఒడిశాకి చెందిన వలస కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఒక బాలిక మృతి చెందింది. వాహనంలో చిక్కుకున్న వారినందరినీ వెలికి తీశారు. అంబులెన్స్‌లో పాడేరు తరలించారు. గతంలో ఇక్కడే ఓ కారు లోయలో వెళ్లిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

News April 3, 2024

విశాఖ జిల్లాలో 48% పింఛన్ల పంపిణీ

image

విశాఖ జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు 48% సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 76% పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో పెన్షనర్లు మొత్తం 1,65,432 మంది కాగా 79,113 మందికి పింఛన్లు అందజేశామన్నారు.

News April 3, 2024

విశాఖ: ‘వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు’

image

ఒకరు విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, మరొకరు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ యాదృచ్ఛికంగా సంపత్ వినాయగర్ ఆలయంలో కలుసుకున్నారు. పార్టీలను పక్కనపెట్టి ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో తనను బలపరచాలని వాసుపల్లి విజ్ఞప్తి చేశారు.

News April 3, 2024

విశాఖ: ‘ప్రత్యేక రైళ్లను జూన్‌ నెలాఖరు వరకు పొడిగింపు’

image

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రతి సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ (08579)ను జూన్‌ 26 వరకు, తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వచ్చే ఎక్స్‌ప్రెస్‌ (08580)ను జూన్‌ 27 వరకు పొడిగిస్తున్నామన్నారు.

News April 3, 2024

విశాఖ: గల్లంతయిన మత్స్యకారులు క్షేమం

image

విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల <<12976842>>ఆచూకీ<<>> లభ్యమయింది. వారంతా అప్పికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలియడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో వారంతా దానిపై భాగంలో ఉండిపోయారు. రాత్రి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నట్లు వారు సమాచారం అందించారు.

News April 3, 2024

ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రగతి

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2023-24లో ఉత్పత్తి, అమ్మకాల్లో ప్రగతి కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో వైర్‌ రాడ్‌ కాయిల్స్‌ 7.30 లక్షల టన్నులు, స్ట్రక్చరల్స్‌ 5.08 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి మందు ఏడాది కంటే వృద్ధి సాధించింది. వినియోగదారులకు డోర్‌ డెలివరీ ప్రాతిపదికన 90 వేల టన్నుల ఉత్పత్తులను సరఫరా చేసింది. సీఎండీ అతుల్‌ భట్‌ సిబ్బంది, అధికారులు అభినందించారు.

News April 3, 2024

విశాఖ: వేతనాల కోసం ఉక్కు ఉద్యోగులు ఎదురుచూపు

image

విశాఖ ఉక్కు కార్మికులు ఈ నెల వేతనాలకు ఎదురు చూడక తప్పని పరిస్థితి. కర్మాగారం బీఐఎస్ఆర్కు నివేదించిన కాలంలోనూ ఇటువంటి పరిస్థితి రాలేదని కార్మికులు వాపోతున్నారు. నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు తదితర చెల్లింపులు చేయలేక ఆర్థికంగా, మానసికంగా సతమతమవుతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.