Visakhapatnam

News April 3, 2024

విశాఖలో దారుణ హత్య

image

విశాఖలోని అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ స్థలం విషయంలో వేపకాయల శ్రీరాములు, దాము మధ్య జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారి తీసింది. వేపకాయ శ్రీరాములు(55)ని దాము అనే వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రెండవ పట్టణ సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News April 3, 2024

పరవాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో లంకెలపాలెం సబ్బవరం రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన సహదీప్ (52) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సహదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్మైల్ ఎక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బాలసూర్యారావు తెలిపారు.

News April 3, 2024

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్

image

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ AC స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు
వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా – యశ్వంత్ పూర్ (02863) ట్రైన్ ఈ నెల 4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి అదేరోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. యశ్వంత్పూర్ 6,13 తేదీల్లో  అందుబాటులో ఉంటుందన్నారు.

News April 3, 2024

విశాఖ: నేటి నుంచి పెన్షన్‌ల పంపిణీ

image

ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల పెన్షన్‌లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్‌ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

News April 2, 2024

విశాఖ: గోవులతో ఉన్న కంటైనర్ సీజ్

image

నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ సమీపంలో కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ మోహన్, నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక కంటైనర్ తనిఖీ చేయగా.. అందులో 65 గోవులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కంటైనర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

News April 2, 2024

విశాఖ: విద్యార్థిని మృతి కేసులో ఐదుగురు అరెస్టు

image

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.

News April 2, 2024

విశాఖ: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తొలి విడతలో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా విశాఖ, అనకాపల్లి, అరకు ఎంపీ అభ్యర్థులతో పాటు మరో 9 నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
✒ విశాఖ ఈస్ట్- గుత్తుల శ్రీనివాసరావు
✒ మాడుగుల- బీబీఎస్ శ్రీనివాసరావు
✒ పాడేరు(ST)- శటక బుల్లిబాబు
✒ అనకాపల్లి- ఇల్లా రామ గంగాధరరావు
✒ పెందుర్తి- పిరిడి భగత్
✒ పాయకరావుపేట(SC)- బోని తాతారావు

News April 2, 2024

విశాఖ ఎంపీగా ఇదే అత్యధిక మెజారిటీ

image

విశాఖ లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో ద్విసభ విధానంతో ఇద్దరు ఇండిపెండెంట్‌లు గెలుపోందారు. 1984 ఎన్నికల్లో TDP నుంచి భాట్టం శ్రీరామమూర్తి అత్యధిక మెజారిటీ 1,40,431 నమోదుకాగా, 2019లో YCP నుంచి MVV సత్యనారాయణ అత్యల్ప మెజారిటీ 4,414 నమోదయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News April 2, 2024

విశాఖ: ‘రేపటి నుంచి పింఛన్ల పంపిణీ’

image

సామాజిక పింఛన్లను ఈనెల మూడవ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ కార్యదర్శిలకు వెంటనే అందజేయాలన్నారు.