Visakhapatnam

News April 2, 2024

విశాఖ: సముద్ర తీరంలో మూడు ముళ్ల బవిరి చేప

image

విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.

News April 2, 2024

విశాఖ: ఎంపీ ఎంవీవీపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే విశాఖలోని పెదజాలరిపేటలో జీవీఎంసీ కల్యాణ మండపాన్ని ప్రారంభించిన విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదు చేశామని తూర్పు రిటర్నింగ్ అధికారి, జేసీ మయూర్ అశోక్ తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 10 కేసులు నమోదు చేశామన్నారు. రూ.1.20 లక్షలు, 42 చీరలు, బీఎస్పీకి చెందిన ఒక ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 2, 2024

అనకాపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు 

image

ఎస్.రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన కారే ఇస్సాక్ (25) పురుగుల తాగి సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విభీషణరావు చెప్పారు. ఒక యువతి విషయమై ఇస్సాక్‌‌ను ఆ కుటుంబ సభ్యులు తరచూ బెదిరించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆదివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

News April 1, 2024

విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు

image

విశాఖలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలో పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్‌లో ఉన్న కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్‌ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.

News April 1, 2024

విశాఖ: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా వర్శీటీలు అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి. శశిభూషణరావు తెలిపారు. మే 4వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈరోజు ఏపీ పీజీ సెట్ చైర్మన్,వీసీ ప్రసాద్ రెడ్డి విడుదల చేసినట్లు తెలిపారు.

News April 1, 2024

విశాఖలో సీఎం జగన్‌పై ఫిర్యాదు

image

ఏపీపీఎస్సీ గ్రూప్-1 చుట్టూ రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిలో సీఎం జగన్ రెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రమేయం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబిఐతో విచారణ నిర్వహించాలన్నారు.

News April 1, 2024

విశాఖ: ‘పెన్షన్లు అడ్డుకోవడం సమంజసం కాదు’

image

రాష్ట్రంలో 60 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఆ రెండు పత్రికలు ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఆ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నది తప్పని విమర్శించారు. దేవుడు క్షమించడని అన్నారు.

News April 1, 2024

విశాఖ:’ఖజానా ఖాళీ.. పెన్షన్లకు సొమ్ము లేదు’

image

రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. దీంతో పెన్షన్ సొమ్ము పంపిణీ 4వ తేదీకి వాయిదా వేసినట్లు విమర్శించారు. పెన్షన్ సొమ్ముతో పాటు వాలంటీర్లతో అక్రమంగా నగదు పంచే ఆలోచన కూడా వైసీపీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశించిందని అన్నారు.

News April 1, 2024

పరవాడ: మాజీ మంత్రి బండారుతో సీఎం రమేశ్ భేటీ

image

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ భేటీ అయ్యారు. పరవాడ మండలం వెన్నెల పాలెంలో బండారు స్వగృహానికి సీఎం రమేశ్, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్ వెళ్లారు. సీఎం రమేశ్ కొద్దిసేపు ఆయనతో చర్చించారు. తర్వాత పంచకర్ల కలవగా అనారోగ్యంగా ఉందని తర్వాత మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది.

News April 1, 2024

అంతా సీఎం అనుకున్నట్లే జరిగింది: గంటా

image

డీఎస్సీ విషయంలో అంతా సీఎం జగన్ అనుకున్నట్లే జరిగిందని భీమిలి టీడీపీ MLA అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఐదేళ్లపాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసి అడ్డగోలు నిబంధనలతో డీఎస్సీ ప్రకటన ఇచ్చారని ట్విటర్ లో
పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ శిక్షణ కోసం నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. జగన్ కుట్ర అందరికీ అర్థమైందని అన్నారు.