India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలోని చిన్న వాల్తేరుకు చెందిన ఓ బాలికపై యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. పి.ధణేశ్ గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలికను వేధిస్తూ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు CI రమణయ్య తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గురువారం తెలిపారు. జిల్లాలోని 22మండలాల్లో 2,969 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామ సభలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. భూ, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కార చర్యలు చేపడతామన్నారు.

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జగ్దల్ పూర్-కిరండూల్ రైల్వే లైన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ గురువారం తనిఖీ చేశారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ట్రాక్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాల్తేరు రైల్వే డిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

వైసీపీకి తాను రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని.. తనని కౌంటర్ చేస్తే తిరిగి కౌంటర్ ఇస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ‘ఏ రాజకీయా పార్టీ అయినా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా జరగకపోవడంతోనే ఓడిపోయాం. ఫలితాల తర్వాత కూడా వైసీపీలో తీరు మారలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. ప్రస్తుతం కూటమి పాలన బాగుంది’ అని అవంతి చెప్పారు.

అవంతి శ్రీనివాస్ YCPకి గుడ్ బై చెప్పారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలిసారి MLAగా గెలిచారు. PRP కాంగ్రెస్లో విలీనం కావడంతో TDPలో చేరారు. 2014లో MP గెలిచి 19 ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా సేవలందించారు. 2024లో ఓటమితో వైసీపీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఆయన పయనం ఎటు అనేది చూడాల్సి ఉంది.

ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

రెండో విడత జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా బుధవారం వెలగపూడి సచివాలయంలోని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమాయ్యారు. కలెక్టర్ల సదస్సు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్పీలు, ఇతర అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.

వచ్చేనెల 2 నుంచి 8 వరకు విశాఖ- రాయపూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, 3 నుంచి 9 వరకు రాయపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డీసీఎం కే.సందీప్ బుధవారం పేర్కొన్నారు. 3 నుంచి 8 వరకు విశాఖ-భవానిపట్నం స్పెషల్ పాసింజర్, విశాఖ-దుర్గ్ ఎక్స్ప్రెస్, 4 నుంచి 9 వరకు భవానిపట్నం- విశాఖ ప్యాసింజర్, 3 నుంచి 8 వరకు దుర్గ్-విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు చేసినట్లు తెలిపారు.

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు రోజుల పాటు జరుగుతున్న కలెక్టర్లు సమావేశంలో విశాఖ, అనకాపల్లి కలెక్టర్లు ఎం.ఎన్ హరిందర్ ప్రసాద్, విజయ కృష్ణన్ పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశంలో భాగంగా కలెక్టర్లకు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పలు పథకాల అమలపై కూడా చర్చించనున్నారు.

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.