Visakhapatnam

News March 31, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు కమిటీ

image

విశాఖలో చైతన్య పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని బలవన్మరణంపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సంఘటనపై విచారణ జరిపి 24 గంటలలోగా నివేదిక అందించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ రాజ్యలక్ష్మి విచారణ చేయనున్నారు.

News March 31, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలి’

image

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ సూచించారు. జిల్లాలోని వివిధ నోడల్ అధికారులతో శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో చేయాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని డీఆర్ఓ సూచించారు.

News March 31, 2024

అనకాపల్లి: ‘వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తాం’

image

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన సౌకర్యాలను వృద్ధులు దివ్యాంగులకు కల్పిస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పేర్కొన్నారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కల్పించే సౌకర్యాలను వారు వినియోగించుకోవాలని కోరారు. 85 ఏళ్లు నిండిన వృద్ధులకు పోలింగ్ బూత్‌కి రాలేని దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు.

News March 30, 2024

భీమిలిలో రోడ్డు ప్రమాదం వివాహిత మృతి

image

మండలంలోని సంగివలస మూడు అమ్మవార్ల గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. అనకాపల్లికి చెందిన చంద్రతేజాదేవి (24)కి భీమిలి మండలానికి చెందిన గంగడ పైడిరాజుకి గత నెలలో వివాహం అయింది. వీరు మద్దిలపాలెంలో నివాసముంటున్నారు. ఈరోజు సింగనబంద అమ్మవారిని దర్శించుకుని బైక్‌‌పై తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భీమిలి సీఐ డీ.రమేశ్ తెలిపారు.

News March 30, 2024

సీఎం రమేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: సీపీఎం

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కానివ్వమని, పరిశ్రమకు అవసరమైన సొంత గనులు, నిధులు రప్పించి ఆధునీకరించి ఉపాధి కల్పిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా ఎంపీగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో మీరు చేసిందేమిటి? అని లోకనాధం ప్రశ్నించారు.

News March 30, 2024

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కలెక్టర్

image

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహా యజ్ఞం కార్యక్రమాన్ని తిలకించారు. అప్పన్న బాబును దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దంపతులు యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News March 30, 2024

విశాఖ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08579/08580) రైళ్లను జూన్‌ 27 వరకు, విశాఖ-తిరుపతి-విశాఖ రైళ్లను జూన్‌ 25 వరకు, విశాఖ-కర్నూలు-విశాఖ రైళ్లను జూన్‌ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.

News March 30, 2024

విశాఖ జిల్లాలో ఆ ఒక్కటే మిగిలింది.!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 9, జనసేన 3, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అధినేత పవన్ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

News March 30, 2024

వాల్తేరు రైల్వే డివిజన్ మరో రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ మరో రికార్డు సాధించింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో సరుకు రవాణా చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 26వ తేదీ నాటికి 75.64 మిలియన్ టన్నుల మార్కును దాటినట్లు వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ ప్రసాద్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 69.9 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఐదు రోజుల వ్యవధి ఉండగా 75.64 మిలియన్ టన్నుల రవాణా చేసినట్లు తెలిపారు.

News March 30, 2024

విశాఖలో యువతి సూసైడ్..

image

విశాఖ మధురవాడలో శుక్రవారం యువతి(17) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొమ్మాదిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి దూకేసింది. కాలేజీ ఫ్యాకల్టీ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆత్మహత్యకు ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసినట్లు సమాచారం. మృతురాలి తండ్రి నాతవరం మండలానికి చెందిన వ్యవసాయం కూలీ. యువతి ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.