India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణము కొనసాగించి బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుకొనే అవకాశముందని వెల్లడించారు. రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు.

వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో అనకాపల్లి కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాలపై ఉంటే ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.

లోన్యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు మృతి చెందారని ఎస్ఐ కే.రమణ తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి(36), ఆమె కుమారుడు సంతోష్(13), కుమార్తె అంజలి(10) ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it

తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.
Sorry, no posts matched your criteria.