Visakhapatnam

News March 30, 2024

విశాఖ యువకుడికి రూ.కోటి ఉపకార వేతనంతో MBA సీటు

image

విశాఖకు చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఎంబీఏ)లో రూ.కోటి ఉపకార వేతనంతో సీటు లభించింది. అమెరికాలోని ఐవీవై లీగ్ యూనివర్సిటీలోనూ సీటు లభించిందని, అయినా స్టాన్ఫోర్డు వర్సిటీలో చేరనున్నట్లు వరుణ్ తెలిపారు. దేశంలో అతికొద్ది మందికి మాత్రమే ఉపకారవేతనంతో కూడిన సీటు లభిస్తుందన్నారు.

News March 30, 2024

అనకాపల్లి: 85 ఏళ్లు దాటిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్

image

ఓటింగ్‌ శాతం తగ్గరాదనే ముందు చూపుతో ఎన్నికల సంఘం 85 ఏళ్లు దాటిన వారికి, 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్ వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు అందించి, వారితో ఓటు వేయించే బాధ్యత రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలతో బీఎల్వోలే తీసుకుంటారని తెలిపింది. నోటిఫికేషన్‌ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్వోలకు సమర్పించాలని నోడల్‌ అధికారి హేమంత్‌ తెలిపారు.

News March 29, 2024

విశాఖలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు

image

విశాఖలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశా దివ్యాంగ్‌ సురక్ష ద్వారా ఈ నెల 15న డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోటవురట్లకు చెందిన ఒక దివ్యాంగుడు ఫోన్‌ చేసి.. అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఒక సంస్థ తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 29, 2024

భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీ

image

భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. 2009లో అవంతిని గంటా రాజకీయాల్లోకి పరిచయం చేశారు. 2009లో వీరిద్దరూ ప్రజారాజ్యం నుంచి పోటీచేయగా అనకాపల్లిలో గంటా, భీమిలిలో అవంతి గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇద్దరూ వేరు వేరు పార్టీలలో చేరి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ భీమిలిలో ప్రత్యర్థులుగా దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 29, 2024

గంటా రాజకీయ ప్రస్థానం

image

భీమిలి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన గంటా శ్రీనివాసరావుకు ఓటమి ఎరుగని నేతగా పేరుంది. 1999 ఆయన అనకాపల్లి నుంచి మొదటిసారిగా టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. 2014లో మళ్లీ టీడీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

News March 29, 2024

ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు సీటు ఖరారు

image

ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.

News March 29, 2024

విశాఖ మత్స్యకారులకు చిక్కిన పవర్ ఫిష్

image

విశాఖపట్నం సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారులకు సముద్ర కప్పలుగా పిలవబడే విభిన్న చేపలు లభించాయి. తిరిగారు ఈ తరహా జీవులను పవర్ ఫిష్ గా పిలుస్తారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సముద్రపు అట్టడుగు లోతుల్లో సంచరించే ఈ జీవులు దాడికి గురైన సమయంలో ఇలా బెలూన్ రూపంలో ఆకృతిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ చేపలను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.

News March 29, 2024

విశాఖ: బీటెక్ విద్యార్థినికి వేధింపులు.. యువకుడిపై కేసు

image

మాకవరపాలెం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడన్న ఆరోపణపై నర్సీపట్నం కొత్తవీధికి చెందిన యువకుడు వి.అయ్యప్పపై కేసు నమోద అయ్యింది. గురువారం కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ కాంతికుమార్ తెలిపారు. ఈ యువకుడు కొద్దిరోజులుగా కళాశాల వరకు ఆమె వెంట పడటమే కాకుండా అటకాయించి కొట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.

News March 29, 2024

విశాఖ: అప్పన్న తలనీలాల వేలం రూ.10.13 కోట్లు

image

సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.

News March 29, 2024

విశాఖ నుంచి అందుబాటులోకి కొత్త విమాన సర్వీసులు

image

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు అంతర్జాతీయ, రెండు దేశీయ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి విశాఖ బ్యాంక్, 26 నుంచి కౌలాలంపూర్ విశాఖ, మార్చి 31 నుంచి విశాఖ ఢిల్లీ, విశాఖ హైదరాబాద్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఆయా సర్వీసులకు సంబంధించి టికెట్లు ప్రస్తుతం ఆల్ లైన్ లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.