Visakhapatnam

News March 27, 2024

గాజువాక: నేలబావిలో సెక్యూరిటీ గార్డు మృతదేహం

image

గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

విశాఖ: 315 మందికి షోకాజ్ నోటీసులు

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరుకాని 315 మంది ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఇన్ ఛార్జ్, ఆర్.ఐ.ఓ మురళీకృష్ణ తెలిపారు. రోజుకు రూ.1000 చొప్పున కళాశాల యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని తెలిపారు. మూల్యాంకనానికి ప్రైవేట్ కార్పొరేట్, కళాశాలల అధ్యాపకులను వెళ్ళనీయకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News March 27, 2024

రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

image

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.

News March 27, 2024

విశాఖ: ‘ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షల్లో అప్పు’

image

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై లక్షల్లో అప్పు ఉందని ప్రజాశాంతి పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖ రైల్వే న్యూ కాలనీ వద్దగల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… తాను ఎంపీగా పోటీ చేద్దామని బీజేపీలో చేరితే మోసం చేశారని అన్నారు. అందుకే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా కేఏ పాల్‌ను గెలిపించాలన్నారు.

News March 27, 2024

విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

లింక్ రైళ్లు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పలు రైళ్లను రీ షెడ్యూలు చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం త్రిపాఠి తెలిపారు. విశాఖ-బెనారస్ రైలు ఈనెల 27న తెల్లవారు జామున 4 గంటల 20 నిమిషాలకు బదులు ఉ.7 గంటల 10 నిమిషాలకు, విశాఖపట్నం-పాట్నా హోలీ ప్రత్యేక రైలు ఈనెల 27న ఉ.9.25 గంటలకు బదులు 11.30 గంటలకు వెళ్లేలా మార్పులు చేశామని తెలిపారు.

News March 27, 2024

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆల్ టైమ్ రికార్డు

image

2003-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు డిఆర్ఎం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు 5 రోజుల ముందే రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, అధికారులను డిఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అభినందించారు. ఈ సంవత్సరంలో సుమారు 10 శాతం ఆర్థిక ఆదాయం సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 27, 2024

విశాఖ: ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు విమాన రాకపోకలు

image

విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 24 గంటలు విమాన రాకపోకలకు నేవీ అనుమతించింది. రీ సర్ఫేసింగ్ పనులు కారణంగా 2023, నవంబర్ 15 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసి మూసి వేస్తూ పనులు చేపట్టారు. నిర్దేశిత గడువుకు ముందే నేవీ ముందుగానే పనులు పూర్తి చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం తొలగింది.

News March 27, 2024

విశాఖ: కారుతో యువతి బీభత్సం..!

image

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కారుతో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో కారు నడిపి మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. డ్రైవింగ్ చేస్తున్న యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థినిగా గుర్తించారు. కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. కారు నడిపిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు.

News March 27, 2024

అనకాపల్లి: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి’

image

అనకాపల్లి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రవి సుభాష్ ఆదేశించారు ‌ మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ పురపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల నీటిమట్టాలను అంచనా వేస్తూ అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు. మరమ్మతులకు గురైన బోరుబావులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు.

News March 26, 2024

విశాఖ: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

image

విశాఖలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో వేగంగా వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నాలుగవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.