India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కశింకోట మండలం జి భీమవరం వంతెన వద్ద మంగళవారం స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు రావికమతం మండలం గొల్లలపాలెంకు చెందిన ఎస్.లక్ష్మమ్మ(65)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఆమె అల్లుడు శృంగవరపు రాము గాయపడ్డాడు. కశింకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.
రైలు నుంచి జారి పడి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని యువకుడు(25) మంగళవారం మృతి చెందాడు. శారదానది బ్రిడ్జ్ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైల్వే ట్రాక్ సమీపంలో రైలు నుంచి యువకుడు జారి పడిపోయాడు. అటుగా వెళ్లే రైల్వే గ్యాంగ్మాన్ సమాచారంతో 108 అంబులెన్సులో ఆస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లే అనురాధను వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె తండ్రి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె మొదటిసారి 2021లో కె. కోటపాడు మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని TDP-9, జనసేన-4, BJP-2 స్థానాల్లో పోటీ చేయునున్నట్లు తెలుస్తోంది. అరకు, మాడుగుల, చోడవరం, విశాఖ ఈస్ట్, వెస్ట్, గాజువాక, పాయకరావుపేట, నర్సీపట్నంలో TDP అభ్యర్థులను ప్రకటించగా..భీమిలి కూడా TDPకే ఇవ్వనున్నట్లు సమాచారం. అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలిలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. విశాఖ సౌత్ సీటు ఆశిస్తుంది. అటు BJPకి విశాఖ నార్త్, పాడేరు సీట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
విశాఖ జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణుల మృత్యువాత ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చనిపోతుండడం జూలో కలకలం రేపుతోంది. కార్డియో పల్మనరీ వ్యవస్థ విఫలమవ్వడంతో తాజాగా జిరాఫీ మృతి చెందింది. గత నెలలో ఆడ చింపాంజీతో కలుపుకొని కొద్ది నెలల్లోనే ఎనిమిది వరకు చనిపోయాయి. వరుసగా చోటుచేసుకుంటున్న వీటిని చూస్తుంటే జంతువుల సంరక్షణపై అనుమానం కలుగుతోంది. నిజంగా వాటి మృతికి వయసు మీరడమే కారణమా అన్నది సందేహంగా మారింది.
సింహాచలంలో అప్పన్న స్వామి డోలోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్వామివారికి పిల్లని ఇవ్వాలంటూ సోదరి పైడితల్లమ్మ అమ్మవారిని అర్ధించే తంతు పూర్తిచేశారు. ఈ విధానాన్ని స్వామివారి పెళ్లిచూపులు(డోలోత్సవం) అంటారు. అనంతరం వారికి పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉగాది రోజు పెండ్లిరాట, 19వ తేదీన చైత్ర ఏకాదశిన పురస్కరించుకొని వార్షిక కల్యాణోత్సవానికి స్వామివారు సిద్ధమవుతున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం వైర్ రాడ్ మిల్ (WRM) -2 విభాగంలో 2023-24 ఏడాదికి రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. విభాగం ప్రారంభం నాటి నుంచి పరిశీలించగా, ఈ ఏడాది 6 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి నిర్ణీత సామర్థ్యాన్ని అధిగమించినట్లు వివరించారు. విభాగం అధికారులను, ఉద్యోగులను ఉక్కు సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్ (ఆపరేషన్స్ ప్రాజెక్ట్) అభినందించారు.
విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఆదివారం మగ జిరాఫీ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో కోల్ కతా అలీపూర్ జూ పార్క్ నుంచి రెండు జిరాఫీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియ తెలిపారు. దీనికోసం సెంట్రల్ జూ అథారిటీకి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. వాటిని తీసుకురావడానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ విశాఖ నగరానికి మంగళవారం వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని స్థానిక అధికారులు తెలిపారు. తిరిగి బుధవారం రాత్రి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని అన్నారు.
Sorry, no posts matched your criteria.