Visakhapatnam

News March 26, 2024

విశాఖ: జనారణ్యంలోకి కణుజు 

image

విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.

News March 26, 2024

నేటి నుంచి టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సీ ఫేజ్‌ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతానికి నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయాంఫ్‌–2024లో భాగంగా మంగళవారం నుంచి సీ ఫేజ్‌ విన్యాసాలు ప్రారంభంకానున్నాయి. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరగాయి. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, యూఎస్‌ దేశాలకు చెందిన త్రివిధ దళాలు సీ ఫేజ్‌ విన్యాసాలు చేయనున్నాయి.

News March 25, 2024

మరో రికార్డుకు చేరువలో విశాఖ పోర్టు

image

విశాఖ పోర్టు 90 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 72.01 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేసిన పోర్టు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023–24 ముగియకుండానే పోర్టు 79 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు హ్యాండ్లింగ్‌లో కూడా గత ఏడాదితో పోల్చితే సోమవారంతో 73,52,899 టన్నులు అధికంగా హ్యాండ్లింగ్‌ చేసింది.

News March 25, 2024

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

image

అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..? 

News March 25, 2024

అల్లూరి: చెట్టు నిండా తేనెపట్లే

image

సాధరణంగా జనావాసంలో ఉన్న పెద్ద చెట్లకు 5 వరకు తేనెపట్లు ఉంటాయి. అదే అటవీ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ప్రతి కొమ్మకూ తేనెపట్లు ఉంటూ.. మొత్తంగా 100కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.

News March 25, 2024

జిరాఫీ మృతిపై విశాఖ జూ క్యూరేటర్ వివరణ

image

విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.

News March 25, 2024

సింహాద్రి అప్పన్నకు వైభవంగా పెళ్లి చూపులు

image

సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) సోమవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్.శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున సింహాద్రినాదుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్ణాభరణాలతో అందంగా అలంకరించారు.

News March 25, 2024

REWIND: 9 ఓట్లతో అనకాపల్లి ఎంపీగా గెలిచారు

image

అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

News March 25, 2024

విశాఖ ఇందిరాగాంధీ జూలో జిరాఫీ మృతి

image

విశాఖ ఇందిరాగాంధీ పార్కులో సోమవారం తెల్లవారుజామున జిరాఫీ మృతి చెందింది. గతంలో రెండు జిరాఫీలు ఉండేవి. అందులో ఒకటి ఇప్పటికే మృతి చెందగా ఈరోజు మరో జిరాఫీ మృతి చెందింది. దీంతో జూ పార్క్‌లో ఉన్న జిరాఫీల ఎన్‌క్లోజర్  ఖాళీ అయింది. జంతువుల వరుస మరణాలతో జూ పార్క్ వెలవెలబోతోందని జంతు ప్రేమికులు అంటున్నారు. అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని జంతువులను కాపాడాలని కోరుతున్నారు. 

News March 25, 2024

విశాఖలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా,  కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత్రగాత్రులను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.